బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా మంచిర్యాలకు చెందిన వెరబెల్లి రవీందర్రావు నియామకం అయ్యారు.
బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా రవీందర్రావు
Sep 20 2013 3:26 AM | Updated on Mar 29 2019 9:18 PM
మంచిర్యాల టౌన్, న్యూస్లైన్ : బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా మంచిర్యాలకు చెందిన వెరబెల్లి రవీందర్రావు నియామకం అయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్గా ఉన్న రవీందర్రావు జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా నియామకం కావడంతో గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మల్లేశ్, బీజేపీ నాయకులు చుంచు శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్చార్జి మద్దెర్ల కృష్ణమూర్తి, జిల్లా మహిళామోర్చా ప్రధాన కార్యదర్శి బోడకుంట ప్రభ, బీజేవైఎం పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొద్దున మల్లేశ్, మేరుగు ఆంజనేయులు, కిషాన్ మోర్చా మండల అధ్యక్షుడు నరెడ్ల పోచమల్లు పాల్గొన్నారు.
Advertisement
Advertisement