సంతకవిటి : పంచాయతీ ల్లో ఈ పాలన మొదలైంది. దీంతో గ్రామీణ ప్రజలకు సైతం ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తొలి దశలో కొన్ని పంచాయతీలో ప్రారంభమైన ఈ ప్రక్రియ దశలవారీగా అన్ని పంచాయతీలకు విస్తరించనుంది. ఇప్పటివరకూ పంచాయతీల్లో రికార్డుల నిర్వహణతోపాటు అన్ని రకాల పనులు రాతకోతల రూపంలోనే జరుగుతున్నాయి. విధానపరమైన నిర్ణయాల్లో పారదర్శకత ఉండే ది కాదు. కొందరు పెద్దలు తీసుకున్న నిర్ణయాలను అందిరపై రుద్దేవారు. ఈ పాలనలో భాగంగా అన్ని కార్యక్రమాలను ఆన్లైన్లో పొందుపరచడం వల్ల పారదర్శకత పెరుగుతుంది. ఏం జరుగుతుందన్నది ఎవరైనా తెలుసుకొనే అవకాశం కలుగుతుంది. అక్రమాలను అరికట్టగలగడంతోపాటు వివిధ రకాల ధ్రువపత్రాలను సకాలంలో అందించేందుకు వీలవుతుంది. పంచాయతీ కార్యదర్శుల చుట్టూ రోజుల తరబడి కాళ్లరిగేలా తిరిగే బాధ తప్పుతుంది. అన్నింటికీ మించి ఎప్పుడూ మూసి ఉండే గ్రామసచివాలయాలు ఇక నుంచి 365 రోజులు ప్రజలకు సేవలందించనున్నాయి.
జిల్లాలో ఇలా...
జిల్లాలో మొత్తం 1099 పంచాయతీలు ఉండగా తొలిదశగా ప్రస్తుతం 87 పంచాయతీల్లో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. సంతకవిటి మండలంలో మొత్తం 34 పంచాయతీలు ఉండగా ఆరు పంచాయతీల్లో వీటిని గత నెలాఖరు నుంచే ప్రా రంభించారు. మందరాడ, వాసుదేవపట్నం, సంతకవిటి, మామిడిపల్లి, బొద్దూరు, గుళ్లసీతారాంపురం పంచాయతీలు ఆన్లైన్లో చేరాయి. ఈ కార్యాలయాల్లో ఇప్పటికే కంప్యూటర్ ఆపరేటర్లను నియమించారు. గ్రామ సచివాలయాలకు పక్కా భవనాలు ఉన్నచోటనే కంప్యూటర్లు ఏర్పా టు చేశారు. పక్కా భవనాలు లేని ప్రాం తాల్లో అద్దె భవనాల్లో వీటిని ప్రారంభిం చేందుకు చర్యలు చేపడుతున్నామని సంతకవిటి ఎంపీడీవో ఎ.త్రినాథస్వామి తెలి పారు.
నెట్లో సమాచార సమస్తం
ఈ సేవలు ప్రారంభించిన పంచాయతీల కు సంబంధించిన సమస్త సమాచారం, వాటి పరిధిలో లభించే సేవల వివరాలన్నీ ంటర్నెట్లో సంబంధిత పంచాయతీ వెబ్సైట్లో లభ్యమవుతాయి. పంచాయతీలోని వార్డులు, ఓటర్లు, జానాభా వివరాలు, స్త్రీలు, పురుషులు, పిల్లల వివరాలతో పాటు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాలు, జనన, మరణ వివరాలు, ధ్రువీకరణ పత్రా ల జారీ పరిస్థితి తదితర అంశాలన్నీ ఆన్లైన్లోనమోదవుతుంటాయి. అలాగే పంచాయతీల ఆస్తులు, పన్నుల వివరాలు, విని యోగ ఫలితాలు, ఆదాయ వ్యయాలను ఎప్పటికప్పుడు పొందుపరుస్తుంటారు. అభివృద్ధి కార్యక్రమాలతోపాటు నిధుల మంజూరు, వినియోగ వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి.
పల్లెకు చేరిన ఈ-పాలన
Published Tue, Sep 23 2014 1:54 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ హ్యాక్.. బాధతో ఇన్ స్టాలో పోస్ట్
కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి
నర్రెడ్డి నాటకాలు చాలు
థ్యాంక్స్ టూ మనీష్ మల్హోత్రా.. సమ్మర్ 2024 స్పెషల్ డిజైన్స్ (ఫొటోలు)
సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
టీ20 వరల్డ్కప్ 2024 కోసం మరో జట్టు ప్రకటన
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్
‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
హైదరాబాద్లో భారీగా భూమిని కొన్న మైక్రోసాఫ్ట్!
తప్పక చదవండి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement