ఏపీ ప్రభుత్వం వైఫల్యం వల్లే అన్యాయం | ap government failure to gets funds from centre, says buggana rajendranath reddy | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రభుత్వం వైఫల్యం వల్లే అన్యాయం

Feb 29 2016 3:56 PM | Updated on Sep 3 2017 6:42 PM

కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరగలేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరగలేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే ఏపీకి అన్యాయం జరిగిందని విమర్శించారు.

ప్రత్యేక హోదా వంటి హామీలను ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగిందని, ఇప్పుడు సాధారణ బడ్జెట్లోనూ రాష్ట్రానికి అదే పరిస్థితి ఎదురైందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement