-
అరుణ్ జైట్లీకి లెక్కలు రావా?
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం వార్షిక జనరల్ బడ్జెట్ సమర్పిస్తూ మరోసారి అబద్ధం ఆడారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎంఎన్ఆర్ఈజీ) పథకానికి మున్నెన్నడు లేనివిధంగా 38,500 కోట్ల రూపాయలను కేటాయించినట్లు గర్వంగా చెప్పుకున్నారు. 2006లో ప్రారంభించిన ఈ పథకానికి 2010-11 వార్షిక బడ్జెట్లో ఏకంగా 40,100 కోట్ల రూపాయలను కేటాయించారు. గతేడాది కూడా ఈ పథకానికి 34,699 కోట్ల రూపాయలను కేటాయించినప్పుడు కూడా మున్నెన్నడు లేని విధంగా అత్యధిక నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు ఏడాది 34,000 కోట్ల రూపాయలను కేటాయించారు. దానితో పోలిస్తే గతేడాది 699 కోట్ల రూపాయలను అరుణ్ జైట్లీ అదనంగా కేటాయించగా, ఈ ఏడాది 38, 500 కోట్ల రూపాయలను కేటాయించారు. ఒకవేళ కేటాయింపులు ముఖ్యం కాదు, ఖర్చు పెట్టిందే లెక్కనుకుంటే 2013-14 ఆర్థిక సంవత్సరంలో 38, 552 కోట్ల రూపాయలు యూపీఏ ప్రభుత్వం ఈ పథకంపై ఖర్చు పెట్టినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ లెక్కన అరుణ్ జైట్లీ మాట నిజం కావాలంటే మున్నెన్నడు లేనివిధంగా కేటాయింపులు జరిపామనకుండా, బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ పథకానికి అత్యధిక కేటాయింపులు జరపడం ఇదే మొదటిసారని వ్యాఖ్యానించి ఉండాల్సింది. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలకు సజీవ స్మృతి చిహ్నంగా ఈ పథకాన్ని కొనసాగిస్తామంటూ గత ఫిబ్రవరి నెలలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం ఈ పథకంలో వారి డ్రామాను సూచిస్తోంది. మరింత లోతుగా పరిశీలిస్తే ఎనిమిది కరవు రాష్ట్రాలతోపాటు మిగతా 21 రాష్ట్రాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఈబిల్లుల మొత్తం 6,359 కోట్ల రూపాయలు. కరవు రాష్ట్రాలకు యాభై వేల పని దినాలను అదనంగా ప్రభుత్వం ప్రకటించి ఇప్పటికీ వాటికి నిధులు విడుదల చేయలేదు. వాటిని కూడా కలుపుకుంటే ఉపాధి హామీ పథకానికి 47, 549 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. పెరిగిన ద్రవ్యోల్బణం రేటును, పెరిగిన గ్రామీణ కుటుంబాలను లెక్కలోని తీసుకుంటే ఈ పథకం అమలుకు అక్షరాల 50,000 కోట్ల రూపాయలు అవసరం. అనుభవజ్ఞుడైన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఈ మాత్రం లెక్కలు రావా? ఉద్దేశపూర్వకంగా చేసిన అబద్ధపు ప్రచారమా? -
ఈపీఎఫ్ పన్నుపై పునరాలోచన?
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్)లో దాచుకొనే మొత్తాలకు ఆదాయపన్ను విధించాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునే అవకాశం కన్పిస్తోంది. దీనిపై ఈపీఎఫ్ చందాదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు కనబడుతోంది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకునే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈపీఎఫ్ లో ఏప్రిల్ 1 తర్వాత నుంచి దాచుకొనే మొత్తాలను వెనక్కి తీసుకోవాలనుకున్నప్పుడు 60 శాతం మొత్తం మీద ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక బడ్జెట్ లో పేర్కొన్నారు. పదవీ విరమణ నాటికి ఈపీఎఫ్లో సమకూరిన నిధిలో 40 శాతం మొత్తానికి ఎలాంటి పన్ను ఉండదని అరుణ్ జైట్లీ ప్రకటించారు. తాజా ప్రతిపాదనపై ఆరున్నర కోట్ల ఈపీఎఫ్ చందాదారులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా స్పందించారు. ఈపీఎఫ్, పీపీఎఫ్, ఎన్ పీఎస్ పన్నుల విధానంలో ప్రతిపాదిత మార్పుల పట్ల ఆందోళనను గుర్తించామని, దీనిపై సందేహాలను త్వరలోనే నివృత్తి చేస్తామని ట్విటర్ ద్వారా తెలిపారు. 60 శాతం మొత్తం మీద వచ్చే వడ్డీకి మాత్రమే పన్ను చెల్లించాల్సివుంటుందని పీటీఐతో రెవెన్యూ కార్యదర్శి హసముఖ్ అదియా చెప్పారు. ప్రిన్సిపల్ అమౌంట్ కు పన్ను మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. -
'బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ను అవమానించేలా ఉంది'
హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు అవమానం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. ఆయన మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 'చంద్రబాబు నిస్సహాయ స్థితి, చేతగానితనానికి అద్దం పట్టింది. రాష్ట్రానికి రావాల్సింది చంద్రబాబు కన్నీళ్లు కాదు, అభివృద్ధి. కేంద్రం, రాష్ట్రం కలిసి ప్రజల నోట్లో మట్టి కొట్టారు. 5 కోట్ల ఏపీ ప్రజలను బికారులుగా చేశారు. 2018 కల్లా పోలవరం పూర్తి చేస్తానన్న మంత్రి దేవినేని ఉమ ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు. ఇప్పటికైనా చంద్రబాబు నోరు విప్పాలి. మన రాష్ట్రానికి రావాల్సిన వాటా కోసం చంద్రబాబు పోరాడాలి.' అని పార్థసారధి సూచించారు. -
అవినీతి, కేసులు.. బాబు నోరు నొక్కేశాయి!
బడ్జెట్లో ఏపీకి అన్యాయంపై నోరెత్తని ముఖ్యమంత్రి ఓటుకు కోట్లు కేసు, అవినీతి వల్లే కేంద్రంపై ఒత్తిడి చేయని చంద్రబాబు రాజధాని నిర్మాణానికి పైసా కూడా కేటాయించని కేంద్రం ప్రత్యేక హోదా ఊసు లేదు..రైల్వే జోన్ విషయంలోనూ మొండిచెయ్యి పోలవరం ప్రాజెక్ట్కు రూ.100 కోట్లే 2018 నాటికి పూర్తి చేస్తామన్న సీఎం మాటలన్నీ అసత్యాలే! సాక్షి, హైదరాబాద్: నిన్న రైల్వే బడ్జెట్లో మొండి చెయ్యి... నేడు సాధారణ బడ్జెట్లోనూ అరకొర విదిలింపులు... అయినా రాష్ర్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నోరెత్తడం లేదు. కనీసం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్పెట్టి ‘మా అవసరాలకు తగినన్ని నిధులెందుకు ఇవ్వరు’ అని అడిగిన పాపాన పోలేదు. ఒకవైపు అవినీతి, మరోవైపు ఓటుకు కోట్లు కేసు వెంటాడుతుండడం వల్లే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి చేయలేకపోతున్నారని విశ్లేషకులంటున్నారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం ఐదు కోట్ల మంది రాష్ర్టప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శకులంటున్నారు. రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడం, జాతీయహోదా ఉన్న పోలవరం ప్రాజెక్టుకు అరకొర నిధులు విదిలించడం ఇందుకు నిదర్శనమని వారు పేర్కొంటున్నారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఎప్పుడూ కేంద్రంపై ఒత్తిడి చేయడం లేదు. హోదా కన్నా కేంద్రం మెరుగైన ప్యాకేజీ ఇస్తుందని చెప్పిన చంద్రబాబు బడ్జెట్లో అరకొరగానే నిధులు విదిలించినా ఎందుకు మాట్లాడడం లేదని పార్టీ వర్గాలే ప్రశ్నిస్తున్నాయి. రెండేళ్లు పూర్తవుతున్నా విభజన చట్టంలోని హామీల విషయంలోనూ కేంద్రాన్ని ఒత్తిడి చేయడానికి చంద్రబాబు సిద్ధపడడం లేదు. స్వార్థప్రయోజనాలే కారణమా..? అయితే రాజధానిని, పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి వివాదాస్పదంగా మార్చడం వల్లే కేంద్రం మొండిచేయి చూపినట్లు అధికార వర్గాలంటున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇప్పటివరకు ఇచ్చిన నిధులను పట్టిసీమ ప్రాజెక్టు కోసం వినియోగించారు. పోలవరం ప్రాజెక్టు కిందే పట్టిసీమ ప్రాజెక్టును చూపారు. దీనికి కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్రం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి అథారిటీని కూడా ఏర్పాటు చేసింది. అయితే, చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాలకే పెద్దపీట వేశారు. పోలవరం ప్రాజెక్టును అథారిటీ కింద కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలని నిర్ణయించారు. తన పార్టీకి చెందిన కాంట్రాక్టర్కు పనులు అప్పగించి, కమీషన్లు దండుకునేందుకే ఈ ఎత్తుగడ వేశారు. అందుకే ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులపై కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ.200 కోట్లు విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్లో రూ.300 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే, ఇందుకు గతంలో ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పాలని, వినియోగ పత్రాలు అందజేయాలని రాష్ట్రాన్ని కోరింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టు కింద చేసిన వ్యయాన్ని పోలవరం కింద చూపించి నిధులు ఇవ్వాల్సిందిగా కోరింది. దీనికి కేంద్రం ససేమిరా అంది. పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో భాగం కాదని, అందుకు నిధు లు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. సెప్టెంబర్లో ప్రకటించిన రూ.300 కోట్లను విడుదల చేయాలంటే వినియోగ పత్రాలు సమర్పించాలని తేల్చిచెప్పింది. ఈ బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.100 కోట్లు కేటాయించింది. రూ. 40 వేల కోట్లు ఖర్చయ్యే ప్రాజెక్టుకు ఏడాదికి రూ.100 కోట్ల చొప్పున అరకొర నిధులే కేటాయిస్తున్నా 2018 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి చూపిస్తామని బాబు చెబుతున్నారు. రాజధాని నిధులు పక్కదారి రాజధాని నిర్మాణానికి కేంద్రం గతంలో ఇచ్చిన రూ.850 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు, ఇతర అవసరాలకు మళ్లించింది. ఇటీవల ఈ విషయం నీతి ఆయోగ్ దృష్టికి వెళ్లింది. ఇప్పటివరకు రాజధానిలో భవనాల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పాలని నీతి ఆయోగ్ కోరింది. ఈ నిధులను ఇతర అవసరాలకు వినియోగించినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు పేర్కొన్నారు. దీనిపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రాజధాని నిర్మాణానికి రూ.4,000 కోట్లు కేటాయించాల్సిందిగా ముఖ్యమంత్రి ఇటీవలే ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రిని కోరారు. అయితే రాజధాని నిధులను ఇప్పటికే పక్కదారి మళ్లించిన నేపథ్యంలో కేంద్రం బడ్జెట్లో పైసా కూడా కేటాయించలేదు. -
'ఈసారి ఆ విషయం ఎందుకు చెప్పలేదో'
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి మండలి ఆమోదం తర్వాత సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తొలిసారి దేశ రక్షణ బడ్జెట్ ఎంతో చెప్పలేదు. దాదాపు పదిహేనేళ్ల తర్వాత అసలు డిఫెన్స్ శాఖకు ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారనే విషయాన్ని ఆయన చదవలేదు. ఏడవ సెంట్రల్ కమిషన్ సూచించిన వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) చెల్లింపులు ఈసారి బడ్జెట్కు అదనపు భారం అంటూ చెప్పిన ఆయన డిఫెన్స్ బడ్జెట్ ఎంత అనే విషయం మాత్రం సభలో ప్రస్తావించలేదు. అయితే, మొత్తం బడ్జెట్లో దాదాపు పది శాతంగానీ, అంతకంటే ఎక్కువగానీ డిఫెన్స్కు కేటాయించడం పరిపాటి. గత ఏడాది డిఫెన్స్ రంగానికి రూ.2,46,727కోట్లు కేటాయించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘నల్లసూరీడు’పై నజర్
ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
10న జిల్లాకు ప్రియాంక గాంధీ రాక
కాంగ్రెస్తోనే కుల వృత్తులకు మహర్దశ
అంతటా యజ్ఞ సహిత యోగా నిర్వహించాలి
ముగిసిన హోం ఓటింగ్
జిల్లా రద్దు అంశంపై ఫోకస్..
మల్లారంలో నేరడిగొండవాసి హత్య
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement