ఏపీలో ఇప్పట్లో డీఎస్సీ లేనట్లే..! | AP DSC Notification Postponed | Sakshi
Sakshi News home page

ఏపీలో ఇప్పట్లో డీఎస్సీ లేనట్లే..!

Apr 23 2018 8:44 PM | Updated on Mar 28 2019 5:27 PM

AP DSC Notification Postponed - Sakshi

ఏపీ మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు

సాక్షి, విజయవాడ: ఈ నెల 29న పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఏపీ మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. సోమవారం విజయవాడలో విద్యాశాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. డీఎస్సీ ఇప్పట్లో లేదని మంత్రి ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. డీఎస్సీ కంటే ముందు మరో టెట్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 11న టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు మంత్రి పేర్కొన్నారు. జూన్‌ 18న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర‍్వహిస్తామన్నారు. మంత్రి తాజా ప్రకటనతో  ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్నవారికి ఈ ఏడాది కూడా నిరాశ మిగిలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement