20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

AP Assembly Special Meeting on January 20th - Sakshi

నోటిఫికేషన్‌ విడుదల చేసిన శాసనసభ కార్యదర్శి

సాక్షి, అమరావతి: ఈ నెల 20వ తేదీ ఉ.11 గంటలకు రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశం జరగనుంది. అలాగే, 21వ తేదీ ఉ.10 గంటలకు శాసన మండలి సమావేశం జరుగుతుంది. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

ఈ ప్రత్యేక సమావేశాల్లో రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సంబంధించి జీఎన్‌ రావు, బీసీజీ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. హైపవర్‌ కమిటీ కూడా తన నివేదికను సభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై సమగ్ర చర్చ చేపట్టనున్నట్లు సమాచారం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top