ప్రొఫెసర్ కిడ్నాప్ కేసులో వీడిన మిస్టరీ! | Andhra univarsity professor appa rao held for suspected Maoist links | Sakshi
Sakshi News home page

ప్రొఫెసర్ కిడ్నాప్ కేసులో వీడిన మిస్టరీ!

Nov 6 2014 9:13 AM | Updated on Oct 9 2018 2:38 PM

ప్రొఫెసర్ కిడ్నాప్ కేసులో వీడిన మిస్టరీ! - Sakshi

ప్రొఫెసర్ కిడ్నాప్ కేసులో వీడిన మిస్టరీ!

ఆంధ్ర యూనివర్శిటీ అసోసియేటట్ ప్రొఫెసర్ అప్పారావు కిడ్నాప్ కేసులో మిస్టరీ వీడింది.

విశాఖ : ఆంధ్ర యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అప్పారావు కిడ్నాప్ కేసులో మిస్టరీ వీడింది. మావోయిస్టులకు పేలుడు పదార్ధాలు సప్లయి చేస్తున్నారన్న ఆరోపణలతో... తామే అరెస్ట్ చేసినట్లు విశాఖ రూరల్ పోలీసులు గురువారం ఉదయం వెల్లడించారు. అప్పారావు అరెస్ట్పై పోలీసులు సాయంత్రం వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం. 


కాగా యూనివర్శిటీ స్టాఫ్ క్వార్టర్స్లో ఉంటున్న అప్పారావు ఇంటికి ఒంటిగంట ప్రాంతంలో పదిమంది దుండగులు వచ్చారు. అప్పారావుతో మాట్లాడాలని ఇంట్లోకి వెళ్లిన వాళ్లు ఆయన్ని బలవంతంగా కారులో తీసుకుని వెళ్లారు. దాంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement