కర్నూలు జిల్లా బనగానపల్లె ఎలక్ట్రసిటీ ఏడీఈ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
ఏసీబీకి చిక్కిన ఎలక్ట్రిసిటీ ఏడీఈ
Nov 27 2015 11:08 AM | Updated on Aug 17 2018 12:56 PM
బనగానపల్లె: కర్నూలు జిల్లా బనగానపల్లె ఎలక్ట్రసిటీ ఏడీఈ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఎలక్ట్రసిటీ క్రాంట్రాక్ట్కు సంబంధించిన రూ.4 లక్షల బిల్లులు చెల్లించేందుకు ఏడీఈ సుధాకర్ రావు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఎలక్ట్రసిటీ కాంట్రాక్టర్ కిషోర్ బాబు నుంచి సుధాకర్ తన ఇంట్లో రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సుధాకర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement