మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడించిన ఏబీవీపీ, అరెస్ట్ | ABVP workers picket ministers' quarters | Sakshi
Sakshi News home page

మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడించిన ఏబీవీపీ, అరెస్ట్

Jan 8 2014 8:37 AM | Updated on Oct 2 2018 8:08 PM

మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడించిన ఏబీవీపీ, అరెస్ట్ - Sakshi

మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడించిన ఏబీవీపీ, అరెస్ట్

ఫీజు రీయింబర్స్మెంట్ను తక్షణమే చెల్లించాలని ఏబీవీపీ కార్యకర్తలు మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడించారు

హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్మెంట్ను తక్షణమే చెల్లించాలని, రీయింబర్స్మెంట్కు ఆధార్ కార్డుతో అనుసంధానం చేయవద్దంటూ ఏబీవీపీ విద్యార్థులు డిమాండ్ చేశారు. పెండింగ్ స్కాలర్ షిప్లను చెల్లించాలని డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడించి ఆందోళనకు దిగారు.

ఈ సందర్భంగా మినిస్టర్స్ క్వార్టర్స్లోనికి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆందోళన చేస్తున్న ఏబీవీపీ విద్యార్థులను  పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని గోల్కొండ పోలీస్ స్టేషన్కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement