స్వైన్‌ఫ్లూ లక్షణాలతో వ్యక్తి మృతి | a man died due to swine flu | Sakshi
Sakshi News home page

స్వైన్‌ఫ్లూ లక్షణాలతో వ్యక్తి మృతి

Jan 25 2015 3:17 PM | Updated on Sep 2 2017 8:15 PM

స్వైన్ఫ్లూ లక్షణాలతో ఓ వ్యక్తి మరణించిన సంఘటన ప్రకాశం జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది.

 స్వైన్ఫ్లూ లక్షణాలతో ఓ వ్యక్తి మరణించిన సంఘటన ప్రకాశం జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. ప్రకాశం జిల్లా పంగలూరు మండలానికి చెందిన శ్రీనివాసరావు(45) అనారోగ్యానికి గురికావడంతో శనివారం ఒంగొలులోని రిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. మూడు రోజులుగా జలుబు, దగ్గుతో బాధ పడుతున్నానని చెప్పడంతో అనుమానం వచ్చిన వైద్యులు అతని నుంచి నమూనాలు సేకరించి స్వైన్‌ఫ్లూ నిర్ధారన టెస్టులకు పంపించారు. ఆదివారం ఉదయం రోగి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. అయితే రోగికి టీబీ వ్యాధి కూడా ఉందని వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement