ప్రత్తి శేషయ్యకు గాంధీస్మారక పురస్కారం

Gandhi Memorial Award for Pathi Seshayya

పశ్చిమగోదావరి , భీమవరం : స్వాతంత్య్ర సమరయోధుడు, గాందేయవాది ప్రత్తి శేషయ్యకు గాంధీ స్మారక పురస్కారం అందజేయనున్నట్టు జిల్లా సర్వోదయమండలి ప్రధాన కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహాత్మాగాంధీ 148వ జయంతి సందర్భంగా ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. అక్టోబర్‌ 2న తాడేపల్లిగూడెం సత్యవతి నగర్‌లోని శేషయ్య నివాసంలో రాష్ట్ర సర్వోదయమండలి ఆధ్వర్యంలో అవార్డును అందజేయనున్నట్టు చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top