* పట్టుబడిన ఓ స్మగర్
* రూ.50 లక్షల ఎర్రచందనం స్వాధీనం
చిత్తూరు (అర్బన్) : జిల్లాలో రెండు రోజుల పాటు జరిపిన దాడుల్లో 46 మంది ‘ఎర్ర’ కూలీలు, ఒక స్మగ్లర్ను చిత్తూరు టాస్క్ఫోర్సు పోలీసులు పట్టుకున్నారు. శనివారం చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) కలిశల రత్న ఈ మేరకు వివరాలను వెల్లడించారు. నిందితులందరినీ పీలేరు, కేవీ పల్లె, వైవీ పాళెం, భాకరాపేట, రొంపిచెర్ల పరిధిల్లోని అటవీ ప్రాంతంలో పట్టుకున్నట్లు ఓఎస్డీ తెలిపారు. నిందితుల నుంచి టాటా సఫారి, సుమో, పికప్, రెండు మారుతి ఓమ్నీ వాహనాలతో పాటు 42 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.50 లక్షలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
ఈ నెల 28న కే వీ పల్లె పోలీసు స్టేషన్ పరిధిలోని వడ్డివారిపల్లె బస్టాప్ వద్ద పోలీసులు ఆరుగురు ఎర్రకూలీలను పట్టుకున్నారు. టాటా సఫారి వాహనం, 8 ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. శనివారం సాయంత్రం అంబువారిపల్లె వద్ద 11 మంది కూలీలను పట్టుకున్నారు. సుమో వాహనాన్ని, 8 ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. ఎర్రావారిపాళెం పరిధిలోని రెడ్డిచెరువు వద్ద శుక్రవారం ఏడుగురు కూలీలను పట్టుకున్నారు. ఓ మారుతి వ్యాను, ఆరు ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. పీలేరు పోలీసు స్టేషన్ పరిధిలోని గుండ్లమల్లీశ్వర గుడి వద్ద 9 మంది ఎర్ర కూలీలను పట్టుకున్నారు. వారి నుంచి పిక్అప్ వ్యాను, 10 ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిలో పీలేరుకు చెందిన స్మగ్లర్ ఎం.భువనేశ్వర్రెడ్డి (20) ఉన్నాడు. ఇతడు గజ్జెల శ్రీనివాసులురెడ్డికి ప్రధాన అనుచరుడు.
రొంపిచెర్ల పోలీసు స్టేషన్ పరిధిలోని మారుమరెడ్డిగారిపల్లె వద్ద ఉన్న నల్లగుట్ట ప్రాంతంలో శనివారం 11 మంది కూలీలను పట్టుకున్నారు. ఓ మారుతి వ్యాను, పది దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. భాకరాపేట పరిధిలోని వరకొండ అటవీ ప్రాంతంలో శని వారం నలుగురు కూలీలను పట్టుకున్నారు. ఐదు దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో మదనపల్లె డీఎస్పీ రాజేంద్రప్రసాద్, పీలేరు సీఐ నరసింహులుతో పాటు పలువురు ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ దాడుల్లో ఎర్రావారిపాళెం పరిధిలో జ్ఞానేశ్వర్ అనే మేస్త్రీ, కెవి.పల్లె పోలీసు స్టేషన్ పరిధిలో పెంచలయ్య, నరసయ్య తప్పించుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.
రెండు రోజుల్లో 46 మంది ‘ఎర్ర’ కూలీల అరెస్టు
Published Sun, Nov 30 2014 3:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘నీట్’ మాల్ ప్రాక్టీస్కు చెక్!
నేతన్నల బాధలు సీఎంకు కనిపించలేదా..?
ఎమ్మెల్యే నివాసంలో కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో సమావేశం
ఓటుహక్కుపై ‘ఉపాధి’ కూలీలకు చైతన్యం
శ్రీమద్రామాయణ మహాక్రతువుకు అంకురార్పణ
విద్యార్థులకు అభినందన
వేసవి పూట.. జలకాలాట
రోహిత్ కేసును పునర్విచారించాలి
సంజయ్ ఓ పొలిటికల్ టూరిస్ట్
లోఓల్టేజీ నియంత్రణకు డీటీఆర్ ఏర్పాటు
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement