breaking news
-
విశాఖ కేజీహెచ్లో అగ్నిప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: ప్రముఖ కింగ్ జార్జి ఆస్పత్రిలో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. సీఎస్ఆర్ బ్లాక్ మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే దట్టంగా పొగ అలుముకోవడంతో వెంటనే సిబ్బంది అప్రమత్తమయ్యారు. సిబ్బంది రోగులను హుటాహుటిన పక్క వార్డుకు తరలించారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. సీఎస్ఆర్ బ్లాక్ ఐసీయూ వార్డులోని వెంటిలేటర్ బ్యాటరీ పేలడంతోనే ప్రమాదం జరిగిందని అధికారులు వివరించారు. రాత్రి విధుల్లో ఉన్న వైద్యులు హుటాహుటిన అక్కడికి చేరుకుని వార్డులో ఉన్న ఏడుగురు రోగులను పిల్లలు, సర్జికల్ ఐసీయూకి తరలించారు. తర్వాత వెంటిలేటర్కు విద్యుత్తు సరఫరాను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. అగ్నిమాపకశాఖ అధికారులు వచ్చే సరికి మంటలు అదుపులోకి వచ్చాయి. కేజీహెచ్ పర్యవేక్షక వైద్యాదాధికారి డాక్టర్ శివానంద ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులందరూ సురక్షితంగా ఉన్నారని చెప్పారు. ప్రమాదానికి దారి తీసిన కారణాలపై విచారణ జరిపిస్తామన్నారు. రాత్రి 12గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుందని, 1గంట సమయానికి పూర్తిగా అదుపులోకి వచ్చిందని తెలిపారు. -
దర్శిలో అర్ధరాత్రి టీడీపీ రౌడీల వీరంగం
దర్శి: తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రకాశం జిల్లా దర్శిలో ప్రజలు భయంతో కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏ వైపు నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు వచ్చి పడతారోనని ప్రజలు ఆందోళనతో బతుకుతున్నారు. ఆదివారం రాత్రి వైఎస్సార్సీపీ నాయకుడి ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. 30మందికి పైగా నరసరావుపేట నుంచి తెచ్చిన రౌడీలతో కలిసి వైఎస్సార్సీపీ నాయకుడు కుందురు నరసింహారెడ్డి ఇంటి విధ్వంసం సృష్టించారు. బాధితుడు నరసింహారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 11.40 సమయంలో కాలింగ్ బెల్ మోగడంతో ఇంటి తలుపు తీశారు.ఇంటి బయట ఉన్న రౌడీలు నరసింహారెడ్డి నువ్వేనా అంటూ ప్రశ్నించి దర్శిలో మేం ఓడిపోవడానికి కారణం నువ్వేనంటూ దుర్భాషలాడారు. ఈవీఎంలు ఎత్తుకెళుతుంటే అడ్డుకుంటావా అని బూతులు తిట్టారు. కర్రలు, రాడ్లతో దాడి చేశారు. ఇంటి దిమ్మెలను బాది పెద్ద పెద్ద శబ్ధాలు చేస్తూ గేటుకు ఉన్న లైట్లు పగులగొట్టి వీరంగం వేశారు. నరసింహారెడ్డి వరండా గేటు తీయకుండా పోలీసులకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. బయట రౌడీలు దాడి చేయడంతో ఇంట్లో ఉన్న నరసింహారెడ్డి భార్య, పిల్లలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు.నీతో పాటు మరో 30 మంది మా టార్గెట్లో ఉన్నారని, మీ అందరి అంతు చూస్తామంటూ నరసింహారెడ్డిని బెదిరించారు. ఈ లోగా పోలీస్ వాహనం రావడం, చుట్టుపక్కల వారు అక్కడకు రావడంతో వారంతా పారిపోయారు. ఈ ఘటనతో నియోజకవర్గం ఉలిక్కిపడింది. దర్శిలో ఎప్పుడూ ఇలాంటి సంస్కృతి లేదని, ఇప్పుడు గొట్టిపాటి లక్ష్మి వచ్చి కొత్తగా రౌడీ సంస్కృతిని తెచ్చిందని మండిపడుతున్నారు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదుటీడీపీ శ్రేణుల దాడిపై నరసింహారెడ్డి భార్య కుందురు సునీత స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇటీవల ఎన్నికల్లో తన భర్త నరసింహారెడ్డి బూత్ ఏజెంట్గా ఉన్న బూత్లో ఈవీఎంలు ఎత్తుకెళ్లనీయలేదని, అందుకే తమపై కక్ష కట్టి ఇంటిపైకి వచ్చి దాడి చేసి దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు.బూచేపల్లి పరామర్శ..టీడీపీ నాయకుల దాడి విషయం తెలుసుకున్న దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ సోమవారం నరసింహారెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఎవ్వరూ భయపడాల్సిన పని లేదని, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎటువంటి ఆపద రాకుండా అండగా ఉంటానని ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు. -
పెనుమూరులో టీడీపీ కార్యకర్తల బరితెగింపు
కార్వేటినగరం: చిత్తూరు జిల్లా పెనుమూరు మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ కామసాని విజయకుమార్రెడ్డి ఇంటిపై ఆదివారం రాత్రి టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. ఇంటి ఆవరణలోని రెండు కార్లను ధ్వంసం చేశారు. విజయకుమార్రెడ్డిని చంపుతామని బెదిరించారు. విజయకుమార్రెడ్డి పెనుమూరు హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో నివాసం ఉంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో ఇంట్లో నిద్రపోతుండగా పెనుమూరుకు చెందిన టీడీపీ కార్యకర్తలు పి.సుబ్రమణ్యంరెడ్డి కుమారుడు పి.అనంత్రెడ్డి, పి.హేమాద్రినాయుడు కుమారుడు పి.ప్రదీప్, కె.బాబు కుమారుడు కె.రాజేష్ ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మద్యం తాగి ఆ ఇంటిపై దాడిచేశారు. ఇంటి ఆవరణలో ఉన్న కారు అద్దాలు పగులగొట్టి ధ్వంసం చేశారు.వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోలున్న కారు నంబరు ప్లేట్లను పెరికి ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న పెనుమూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బండి కమలాకరరెడ్డి కారు నంబర్ ప్లేటు తీసి పగులగొట్టారు. అనంతరం ఇంట్లో నిద్రపోతున్న విజయకుమార్రెడ్డికి ఫోన్చేసి బయటకు రమ్మని పిలిచారు. నిద్రలో ఉన్న విజయకుమార్రెడ్డి భార్యాపిల్లలతో బయటకు రాగా చంపుతామంటూ బెదిరించారు. భయంతో విజయకుమార్రెడ్డి కుటుంబ సభ్యులతో ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. వీరి నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆయన సోమవారం ఉదయం పెనుమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెనుమూరు ఎస్ఐ లోకేష్ సంఘటన స్థలానికి వెళ్లి విచారించారు.నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి అర్ధరాత్రి ఇంటి పైకి వచ్చి కార్లు ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపాలని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి, రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్రరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహాసముద్రం దయాసాగర్రెడ్డి డిమాండ్ చేశారు. వారు సోమవారం విజయకుమార్రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన నారాయణస్వామి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. -
పెళ్లిళ్ల పేరయ్య పేరిట టోకరా!
ఆలమూరు: పెళ్లి సంబంధాలు కుదుర్చుతానంటూ అమాయక ప్రజలను నమ్మించి రూ.కోటి వరకూ ఓ వ్యక్తి టోకరా వేసిన ఘటన ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారంలో జరిగింది. పెళ్లిళ్ల పేరయ్య అవతారమెత్తి వయసుకు వచ్చిన యువతకు, కొంచెం లోపాలు ఉన్నవారికి పెళ్లి సంబంధాలు చూస్తానంటూ రూ.లక్షల విలువైన బంగారం, నగదు స్వాహా చేసిన వైనం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకూ ఆరుగురు బాఽధితులు వెలుగులోకి రాగా అనేక మంది మోసపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మూలస్థాన అగ్రహారానికి చెందిన యర్రంశెట్టి దుర్గయ్య దివ్యాంగుడు. అతను పెళ్లి సంబంధాలు చూసే దళారీగా అవతారమెత్తాడు. ఇదే క్రమంలో గ్రామంలో దొడ్డా రాంబాబు, వరలక్ష్మి దంపతుల కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తానంటూ నమ్మబలికాడు. వధువు కుటుంబానికి కొంత నగదు అవసరమంటూ దశల వారీగా రూ.20 లక్షల వరకూ తీసుకున్నాడు. దీంతో పాటు రాంబాబు కుటుంబ సభ్యుల వద్ద సుమారు రూ.12 లక్షల విలువైన 20 కాసుల బంగారాన్ని కూడా తన మాయమాటలతో స్వాహా చేశాడు. ఆ బంగారం ఆ ఆశ చూపి, తక్కువకు వస్తుందంటూ గ్రామానికి చెందిన విజయ, నవాబుపేటకు చెందిన సింగంశెట్టి సురేష్ను నమ్మించాడు. విజయ వద్ద రూ.5.5 లక్షలు, సురేష్ వద్ద రూ.4.10 లక్షలు తీసుకుని మాట మార్చేశాడు. దీంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అనేక మంది వద్ద రూ.లక్షలు తీసుకోవడంతో స్వాహా చేసిన సొమ్ము రూ.కోటి పైనే ఉంటుందని సమాచారం. పెళ్లి సంబంధాలకు సంబంధించి అవతలి వారు ఒప్పుకున్నారని ఇతరులతో డమ్మీ ఫోన్లు చేయించేవాడు. జల్సాలకు అలవాటు పడిన దుర్గయ్య స్వాహా చేసిన సొమ్మును అంతా విలాసాలకు ఖర్చు చేశాడు. పెళ్లి సంబంధాలు చూస్తున్నానంటూ కాలయాపన చేస్తున్న దుర్గయ్య ప్రవర్తనపై బాధితులకు అనుమానం వచ్చింది. దీంతో వారంతా సోమవారం దుర్గయ్య ఇంటికి వెళ్లి అతని భార్య రాణి, తల్లి వెంకాయమ్మ, సోదరుడు మురళీని నిలదీయగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితులంతా ఆలమూరు పోలీస్ స్టేషన్కు చేరుకుని ఎస్సై ఎల్.శ్రీను నాయక్కు ఫిర్యాదు చేశారు.జల్సాలకు అలవాటు పడి..మాయమాటలతో బాధితులను నమ్మించి స్వాహా చేసిన సొమ్మును అనతికాలంలోనే దేశమంతా తిరిగి జల్సాలకు, విలాసాలకు ఖర్చు చేశాడని భార్య రాణి పోలీసులకు వివరించింది. తన భర్త పెళ్లి సంబంధాల పేరిట డబ్బులు తీసుకున్నది వాస్తవమేనన్నారు. సోదరుడు మురళీ, తల్లి వెంకాయమ్మ ప్రోద్భలంతో స్వాహా చేసిన సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేశాడని తెలిపింది. ఇలాంటివి వద్దని పలుమార్లు చెప్పినా పట్టించుకోకుండా చేతిలో ఉన్న డబ్బును చూసి విచ్చలవిడిగా ఖర్చు చేశాడంది. ఈ సొమ్ము దుర్వినియోగంలో కొంత భాగం సోదరుడు, తల్లి ప్రమేయం ఉందని ఆరోపించింది. భార్య, ఇద్దరు పిల్లలను పట్టించుకోకుండా పెళ్లి సంబంధాల పేరిట తీర్థయాత్రలు, విలాసవంతమైన ప్రాంతాలకు వెళ్లేవాడంది. ఇప్పటి వరకూ తమకు సొంత ఇల్లు కూడా లేదని, అద్దె ఇంట్లోనే ఉంటూ జీవనం సాగిస్తున్నామని ఆమె పేర్కొంది. ప్రస్తుతం తన భర్త దుర్గయ్య ఒక్క పైసా కూడా లేకుండా ఖర్చు చేశాడని వివరించింది.బాధితులకు న్యాయం చేస్తాం..పెళ్లి సంబంధాల పేరిట మోసపోయిన బాధితులందరికీ తగిన న్యాయం చేస్తామని ఎస్సై శ్రీను నాయక్ భరోసా ఇచ్చారు. దీనిపై కేసు నమోదు చేస్తున్నామని, విచారణ జరిపి నిందితుడు దుర్గయ్యతో పాటు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుంటామన్నారు. స్వాహా చేసిన నగదు, బంగారాన్ని రికవరీ చేసేందుకు చర్యలు తీసుంటామని అన్నారు. -
మహిళను కాటేసిన అత్యంత విషపూరితమైన పాము
నెల్లూరు(అర్బన్): నెల్లూరు దర్గామిట్టలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (పెద్దాస్పత్రి)లో రత్నమ్మ అనే అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికురాలిని అత్యంత విషపూరితమైన రక్తపింజరి పాము కాటేసింది. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది. సిబ్బంది కథనం మేరకు.. రోజులాగే రత్నమ్మ సోమవారం విధులకు వచ్చింది. సంబంధిత సూపర్వైజర్ మెడికల్ కళాశాల ఆవరణలో గడ్డిని తొలగించే పనిని ఆమెకు అప్పగించారు. దీంతో గడ్డిని తొలగిస్తుండగా పాము ఆమె చేతి వేలిపై కాటువేసింది. రత్నమ్మ కేకలు వేయగా సహచర సిబ్బంది వచ్చి ఆమెను ఆస్పత్రి క్యాజువాలిటీలో చేర్చారు. డాక్టర్ ప్రాథమిక వైద్యం అనంతరం ఐసీయూకి తరలించారు. ఈసీజీ తీశారు. అనంతరం అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ అయిన ఎజైల్ గ్రూపు మేనేజర్ కొండయ్య మరికొన్ని రక్తపరీక్షలను బయట ల్యాబ్లో చేయించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.గతంలో ఓ కార్మికురాలి మృతిగతంలో ఓపారిశుద్ధ్య కార్మికురాలు పెద్దాస్పత్రి ఆవరణలో గడ్డి కోస్తుండగా పాము కాటు వేసింది. తర్వాత భయాందోళనకు, ఒత్తిడికి లోనైంది. రెండో రోజు మృతి చెందింది. ఈ ఘటన అప్పట్లో ఆస్పత్రిలో సంచలనం రేకెత్తించింది. ఆమె మృతితో కుటుంబం వీధిన పడింది. ఏజెన్సీ ఎజైల్ సంస్థ తదితరులు సుమారు రూ.లక్ష సాయం అందించారు.పెస్ట్ కంట్రోల్ వైఫల్యంఆస్పత్రిలో పాములు లేకుండా, చెదపురుగులు పట్టకుండా, ఎలుకలు లేకుండా చూసే బాధ్యత పెస్ట్ కంట్రోల్ది. దీనికి సంబంధించి కాంట్రాక్ట్ను పొందిన వ్యక్తికి ప్రభుత్వం సంవత్సరానికి సుమారు రూ.50 లక్షలు చెల్లిస్తోంది. అయితే ఆ సంస్థ నిబంధనలు గాలికొదిలేశారని ఆరోపణలున్నాయి. మందును స్ప్రే చేయడం మినహా మిగతా పనులు చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎలుకలు పట్టేందుకు బోనులు పెట్టాలి. పాములు నివసించేందుకు అనువైన పుట్టలు, బొరియలుంటే తొలగించాలి. బొద్దింకలు, ఇతర చెదపురుగులు చేరకుండా మందులు వాడాలి. ప్రతి నెలా రూ.లక్షలో బిల్లులు తీసుకుంటున్నా నిబంధనల మేరకు పని చేయడంలేదని విమర్శలున్నాయి. సరిపడా ఉద్యో గులను నియమించలేదని తెలుస్తోంది. అయినా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆ ఏజెన్సీకి ఫుల్ మార్కులు వేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి లోపాలు సరిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు. -
మహిళా వలంటీర్పై దాడి
వేమూరు: గ్రామ వలంటీర్పై టీడీపీ కార్యకర్తలు మహిళలతో దాడి చేయించి కొట్టిన ఘటన బాపట్ల జిల్లా వేమూరు మండలం చంపాడులో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎస్సీ మాదిగ వర్గానికి చెందిన పమిడిపాగుల జ్యోతి అనే మహిళ గ్రామ వలంటీర్గా పని చేస్తోంది. వలంటీర్లపై కూటమి నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎన్నికల ముందు ఆమె రాజీనామా చేశారు. కాగా.. ఎన్నికల్లో గెలిచాక టీడీపీ కార్యకర్తలు జ్యోతిని లక్ష్యంగా చేసుకుని వేధించటం మొదలుపెట్టారు. నాలుగు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంటిపై ఇటుక రాళ్లతో దాడి చేశారు. ‘మీ వైఎస్సార్సీపీ పార్టీ గెలవాలని ఓట్లు వేయించి తెగపాకులాడావుగా గొప్ప వాలంటీరు. ఇప్పుడు మాది రాజ్యం. నీ అంతు చూస్తాం. జై టీడీపీ, జై కూటమి’ అంటూ ఆ ఇంటి గోడపై పోస్టర్ అతికించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. మరుసటి రోజునుంచి స్కూల్కెళ్తున్న జ్యోతి పిల్లలను దూషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం బజారు నుంచి ఇంటికెళ్తున్న జ్యోతిపై కొందరు మహిళలతో టీడీపీ నాయకులు దాడి చేయించి కొట్టించారు. కిందపడిపోయిన జ్యోతిని వేమూరు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ ఆమె స్పృహ కోల్పోవటంతో 108 అంబులెన్స్లో తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ వేమూరు ఇన్చార్జి వరికూటి అశోక్బాబు హుటాహుటిన వేమూరు పోలీస్ స్టేషన్కు వెళ్లి జ్యోతిని పరామర్శించారు. నాలుగు రోజుల క్రితం ఆమె ఇంటిపై రాళ్లురువ్వి పోస్టర్ అతికించినట్టు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకపోవటంపై పోలీసులను ప్రశ్నించారు. ఆ కేసుతో పాటు ఆదివారం జరిగిన దాడిపై కేసులోనూ ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తేనే పోలీస్ స్టేషన్ నుంచి వెళతానని పట్టుబట్టారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటిపై జరిగిన రాళ్ల దాడిపై ఎఫ్ఐఆర్ తర్వాత ఇస్తామని ఎస్ఐ నాగరాజు వెల్లడించారు. వరికూటి అశోక్బాబు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎక్కడైనా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులకు పాల్పడితే సహించబోమన్నారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, తనతోపాటు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. వైఎస్సార్సీపీ నేతపై దాడి.. వేటపాలెం: బాపట్ల జిల్లా వేటపాలెం మండల పరిధిలోని బచ్చులవారిపాలెంలో వైఎస్సార్సీపీ నేత బచ్చుల బంగారు బాబు పై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు..గ్రామంలో శనివారం రాత్రి గంగమ్మ తల్లి కొలుపులు జరుగుతున్నాయి. అదే అదునుగా గ్రామంలో టీడీపీకి చెందిన ప్రధాన నాయకుడు వారి అనుచరులు నలుగురికి మద్యం తాగించి బంగారుబాబుపై దాడికి తెగబడ్డారు. దీంతో బంగారుబాబు తలకు తీవ్రగాయం అయ్యింది. అక్కడే ఉన్న కొంతమంది మహిళలు దాడిని అడ్డుకోవడంతో అతడిని వదిలేశారు. కాగా, బంగారుబాబు వైఎస్సార్సీపీ తరఫున గ్రామంలో ప్రచారం చేసి ఓట్లు వేయించాడు. టీడీపీ చెందిన ఒక నాయకుడు గ్రామంలో టీడీపీ తరఫున పోటీ చేసిన మన సామాజిక వర్గం నాయకుడు కొండయ్యకు గ్రామం మొత్తం ఓట్లు వేద్దామని బంగారు బాబును అడిగారు. అందుకు అతను ఒప్పుకోకపోగా వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టంగా చెప్పాడు. దాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామంలో టీడీపీ ఓట్లు చీలుస్తావా అని చెప్పి వారికి సంబంధించిన కొంత మందికి మద్యం తాగించి బంగారు బాబుపై దాడి చేయించాడు. తనను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు వాపోయాడు. తనకు, తన వర్గం వారికి రక్షణ కల్పించాలని కోరుతూ వేటపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
తాగునీటిలో విష ప్రయోగం
కణేకల్లు: ప్రజలు తాగే నీళ్లలో విషాన్ని కలిపారు.. ఆ నీరు తాగినోళ్లు ప్రాణాలతో ఉండకూడదనుకున్నారో.. లేక వాంతులు, విరేచనాలొచ్చి నిర్వహణ చేసే వారికి చెడ్డపేరు రావాలనుకున్నారో గానీ అత్యంత అమానుష ఘటనకు ఒడిగట్టారు. వాటర్ప్లాంట్ నిర్వాహకులు సకాలంలో గుర్తించడంతో ముప్పు తప్పింది. అనంతపురం జిల్లా కణేకల్లు మండలం తుంబిగనూరులో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రత్యక్ష సాక్షులు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. తుంబిగనూరులో సుజలాన్ ఎనర్జీ లిమిటెడ్.. రెండేళ్ల క్రితం మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీకి అప్పగించింది. గ్రామ సర్పంచ్, వైఎస్సార్సీపీ నాయకుడు ఫణీంద్ర గౌడ్ వాటర్ ప్లాంట్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేందుకు తన తండ్రి తిప్పయ్యను ప్లాంట్ వద్దే ఉంచారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా పంచాయతీ ఆధ్వర్యంలో రూ.5కే రెండు బిందెల నీటిని పంí³ణీ చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు దుప్పటి కప్పుకుని మినరల్ వాటర్ ప్లాంట్ వద్దకు వచ్చారు. కిటికీలు తీసి నీటి ట్యాంకులో టెర్మినేటర్ పురుగుల మందు కలిపారు. అదే సమయంలో బహిర్భూమి కోసం లేచిన తిప్పయ్య ప్లాంట్ వద్ద వ్యక్తులు ఉండటాన్ని గమనించి.. ఎవరక్కడ అంటూ గద్దించాడు. దీంతో పొరుగున ఉండే తలారి హనుమంతు, కొట్రేగౌడ్ నిద్ర లేచి అక్కడికి వచ్చారు. ఇంతలోనే దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. వాటర్ప్లాంట్ను పరిశీలించగా.. అందులో పురుగుల మందు కలిపినట్టు తేలింది. ఈ ఘటనను అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలి సీరియస్గా తీసుకున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేవారిని ఉపేక్షించొద్దని పోలీసు అధికారులను ఆదేశించారు. కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులు, కణేకల్లు ఎస్ఐ శ్రీనివాసులు డాగ్స్క్వాడ్, క్లూస్టీమ్ను రంగంలో దింపి ఆధారాలను సేకరించారు. జరిగిన ఘటనపై తిప్పయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఎల్లో మీడియాలో దుష్ప్రచారం ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మెజార్టీ రాలేదన్న ఉద్దేశంతో నేనే కొందరితో తాగునీటిలో విషం కలిపించానంటూ ఎల్లో మీడియాలో ప్రసారం చేయడం దుర్మార్గం. గ్రామ సర్పంచ్గా నేను 365 ఓట్ల మెజార్టీతో గెలిచాను. గ్రామంలో సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 494 ఓట్లు రాగా.. టీడీపీకి 512 ఓట్లు వచ్చాయి. ఓట్లు వేయలేదని ప్రజలను బెదిరించడం, దౌర్జన్యం చేయడం లాంటివి నేను ఏరోజూ చేయలేదు. ఎల్లో మీడియా నాపై నింద వేయడంబాధాకరం.– ఫణీంద్ర గౌడ్, గ్రామ సర్పంచ్, తుంబిగనూరు -
వైఎస్సార్సీపీ నేతల దుకాణాలు, ఇళ్లు ధ్వంసం
సాక్షి, విజయవాడ: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు, సానుభూతిపరుల ఇళ్లు, వాహనాలు, కార్యాలయాలపై టీడీపీ నాయకులు, కార్యకర్తల దాడులు కొనసాగుతున్నాయి. అజిత్సింగ్నగర్లో వైఎస్సార్సీపీ కార్యకర్త జహీర్బాషాకు చెందిన టైలరింగ్ దుకాణాన్ని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. కుట్టుమెషిన్లు, ఎల్ఈడీ టీవీ, ఇతర ఫర్నిచర్ ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ నాయకుడు పెద్దిరెడ్డి శివారెడ్డి కారు అద్దాలను పగులగొట్టారు. ఇంటిపై రాళ్లు రువ్వు శివారెడ్డిని దుర్భాషలాడారు. ఇటీవల వైఎస్సార్సీపీలో చేరి ఎన్నికల్లో పనిచేసిన నగర మాజీ డెప్యూటీ మేయర్ గోగుల రమణ కారు అద్ధాలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరిపై ఏకంగా దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నేతల ఇళ్లలో సామగ్రి దహనంవెల్దుర్తి: వైఎస్సార్సీపీ నాయకులకు చెందిన రెండు గృహాలపై టీడీపీ శ్రేణులు దాడికి తెగబడి ఇళ్లల్లోని సామగ్రిని దహనం చేసిన ఘటన పల్నాడు జిల్లా గొట్టిపాళ్లలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పిన్నెబోయిన బాలగురవయ్య యాదవ్, పల్లపాటి వీరనారాయణ యాదవ్ గృహాలపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు గుంపులుగా వచ్చి దాడి చేశారు. ఆ రెండు గృహాల్లో ఉన్న విలువైన సామగ్రి, పత్రాలపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. టీడీపీ శ్రేణులు దాడులు చేస్తారనే భయంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఊరు వదిలి వెళ్లిపోగా.. మహిళలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇదే అదనుగా భావించిన టీడీపీ శ్రేణులు ఆ రెండు ఇళ్లపై దాడులకు పాల్పడి మొత్తం సామగ్రిని దహనం చేశారు. రూ.10 లక్షల విలువైన వస్తువులు కాలిపోయినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.రాజకీయ కక్షతో వైఎస్సార్సీపీ నేత ఇల్లు కూల్చివేతఆక్రమణల నెపంతో విజయవాడలో టౌన్ప్లానింగ్ అధికారుల హడావుడిపాయకాపురం (విజయవాడ రూరల్): విజయవాడ ప్రకాష్నగర్లోని వైఎస్సార్సీపీకి చెందిన కోఆప్షన్ సభ్యుడు నందెపు జగదీశ్కు చెందిన భవనాన్ని వీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు శనివారం కూల్చి వేశారు. 12 ఏళ్ల క్రితం మంజూరు చేసిన ప్లాన్ ప్రకారం సర్వే నంబర్ 89లో జగదీశ్ 3 పోర్షన్ల భవనాన్ని నిర్మించారు. ప్లానింగ్ అధికారులు శుక్రవారం భవన యజమానులకు సమాచారం ఇవ్వకుండా కొలతలు తీసి భవనానికి నోటీసులు అంటించారు. శనివారం కూల్చివేత చేపట్టారు. జగదీశ్ భార్య సౌభాగ్యలక్ష్మి భవనం కూల్చివేస్తున్నారని తెలుసుకొని భవనం దగ్గరకు వచ్చి ఎందుకు కూల్చి వేస్తున్నారని అధికారులను అడుగుతున్నా ఎలాంటి సమాధానం చెప్పకుండా భవనం వెనుకవైపు కూల్చి వేశారు. భవనం పక్కనే ఉన్న రేకుల షెడ్డును కూడా ఆక్రమణలో ఉందని, వీఎంసీ స్థలంలో నిర్మించినట్లుగా గుర్తించామని చెబుతూ కొంత కూల్చివేశారు. దీనిపై కోర్టు స్టే ఉండ టంతో అధికారులు కూల్చివేతను నిలిపివేశారు.రాజకీయ కక్షలే కారణం.. రాజకీయ కక్షలతోనే భవనం కూల్చివేత జరిగిందని సౌభాగ్యలక్ష్మి పేర్కొన్నారు. హరిబాబు అనే వ్యక్తి నుంచి 214 గజాల స్థలాన్ని కొనుగోలు చేశామన్నారు. 12 ఏళ్ల క్రితం విజయవాడ కార్పొరేషన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు తీసుకొని భవనం నిర్మించామని, భవనం నిర్మాణంలోని ఆక్రమణలను అధికారులు ఇప్పుడే గుర్తించడం ఏమిటని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతల ఆదేశాలతో అధికారులు భవనం కూల్చివేత చేపట్టగా..ఆ విషయం తెలుసుకుని వచ్చిన వైఎస్సార్సీపీ నగర ప్రధాన కార్యదర్శి విజయకుమార్ ఆకస్మికంగా ఎందుకు కూల్చుతున్నారని ప్లానింగ్ అధికారి కృష్ణను ప్రశ్నించారు. ఫిర్యాదు ఇప్పుడే అందింది కాబట్టి కూల్చివేస్తున్నామని అధికారులు సమాధానమిచ్చారు. -
యథేచ్ఛగా టీడీపీ దాడులు
సాక్షి టాస్క్ఫోర్స్: రాష్ట్రంలో అధికార మత్తుతో టీడీపీ నేతలు, కార్యకర్తలు పేట్రేగిపోతున్నారు. గత ప్రభుత్వం హయాంలో ఏర్పాటైన ప్రభుత్వ ఆస్తులను, అభివృద్ధి పథకాల శిలాఫలకాలను యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఈ విధ్వంసం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం కూడా టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పలుచోట్ల విధ్వంసానికి దిగారు. అనంతపురం రూరల్ మండలం రాచానపల్లిలో పట్టపగలు అందరూ చూస్తుండగానే రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ శిలాఫలకాలను ధ్వంసం చేశారు. వీటి పక్కనే ఉన్న జగనన్న పాలవెల్లువ ‘నేమ్ బోర్డు’ను తొలగించారు. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం చింతలచెర్వు గ్రామ సచివాలయం శిలాఫలకాన్ని పగులకొట్టారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బోయలచిరివెళ్ల సచివాలయం, ఆర్బీకే, హెల్త్ క్లినిక్ భవనాలపై దాష్టీకానికి పాల్పడ్డారు. వైఎస్సార్ హెల్త్క్లినిక్ పేరుతో వేసిన శిలాఫలకంపై ఉన్న వైఎస్ జగన్, మేకపాటి విక్రమ్రెడ్డి చిత్రాలను బండరాయితో తుడిచే ప్రయత్నం చేశారు. రైతు భరోసా కేంద్రం, సచివాలయం భవనాలకు ఉన్న కిటికీ అద్దాలను పగులగొట్టారు. అలాగే ఏఎస్పేట మండలం చౌటభీమవరంలో జగనన్న లేఔట్ను టీడీపీ నాయకుడు రాంబాబు జేసీబీతో తవ్వేశారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో సచివాలయాలు, ఆర్బీకే భవనాల శిలాఫలకాలను టీడీపీ నాయకులు, కార్యకర్తలు ధ్వంసం చేశారు. కీలపల్లిలో గ్రామ సచివాలయం, ఆర్బీకే భవనాలకు అమర్చిన శిలాఫలకాలు, బోర్డు దిమ్మెలను గునపాలు, సమ్మెటతో పగులకొట్టారు. అలాగే గండ్రాజుపల్లి పంచాయతీ ఆలకుప్పంలో బీఎంసీ సెంటర్కు అమర్చిన శిలాఫలకాన్ని ఆ గ్రామ టీడీపీ నాయకులు తొలగించారు. శ్రీరంగరాజపురం మండలం నెలవాయి సచివాలయం, రైతుభరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్ వద్ద, జీఎంఆర్ పురం పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నవరత్నాలు, డిజిటల్ లైబ్రరీ శిలాఫలకాలను ధ్వంసం చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచెర్ల మెట్ట సమీపంలో ఏర్పాటు చేసిన దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. -
గిరిజన పాఠశాల భూమి కబ్జా
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికారం చేపట్టిన గంటల వ్యవధిలోనే టీడీపీ నేతలు బరి తెగించారు. ప్రభుత్వ స్థలాల కబ్జాకు తెర తీశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి అండతో స్థానిక నేతలు చెలరేగిపోతున్నారు. వెంకటాచలం మండలం గొలగమూడిలో టీడీపీ నాయకులకు ప్రభుత్వ భూమిపై కన్ను పడింది. అనుకున్నదే తడవుగా పట్ట పగలే జేసీబీ యంత్రంతో ఆ భూమిని చదును చేశారు. వెంకటాచలం మండలం గొలగమూడిలో ప్రభుత్వ ఆశ్రమ గిరిజన ఉన్నత పాఠశాలకు ఆనుకుని సీజేఎఫ్ఎస్ భూములున్నాయి. ఆశ్రమ గిరిజన ఉన్నత పాఠశాల కోసం మరింత స్థలం కేటాయించాలని పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది కోరడంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీకి చెందిన వ్యక్తికి గతంలో సీజేఎఫ్ఎస్ పథకం కింద కేటాయించిన 1.25 ఎకరాల భూమిని పాఠశాల కోసం అప్పగించింది. వాస్తవానికి సీజేఎఫ్ఎస్ పథకం కింద కేటాయించిన భూమిపై ఏ వ్యక్తికీ అధికారం లేదు. ఈ భూమికి ఆర్డీవో హక్కుదారుగా ఉంటారు. సదరు వ్యక్తికి ప్రత్యామ్నాయంగా మరోచోట భూమిని కేటాయిస్తామని రెవెన్యూ అధికారులు చెప్పారు. అయితే ఇంతలోనే సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఈ ఎన్నికల్లో సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి గెలవడం, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ టీడీపీ నేత అది తన భూమేనంటూ దౌర్జన్యపూరితంగా ఆక్రమించేందుకు ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది. ఒక గిరిజన పాఠశాలకు కేటాయించిన స్థలాన్ని ఆక్రమించే సాహసం చేయడం చూస్తే టీడీపీ నేతలు ఏ విధంగా బరి తెగించారో అర్థమవుతోంది. ఈ భూఆక్రమణను ఆశ్రమ గిరిజన పాఠశాల ఉపాధ్యాయినులు అడ్డుకోబోతే వారిని సైతం బెదిరించారు. ఈ భూమి పాఠశాలకు కేటాయించారని చెప్పినా వినకుండా చదును చేశారు. ఈ విషయంపై తహసీల్దార్ను వివరణ కోరేందుకు సాక్షి ప్రయతి్నంచగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. -
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
కృష్ణా, సాక్షి: రోడ్డు ప్రమాదంతో వేకువ ఝామున జిల్లా రహదారి నెత్తురోడింది. శుక్రవారం ఉదయం కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురిని చికిత్స కోసం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రొయ్యల ఫీడ్తో వెళ్తున్న కంటెయినర్ను బొలెరో వాహనం ఢీ కొట్టడంతో ఈ ఘోరం జరిగింది. మృతుల్లో ఐదుగురు కోనసీమ అంబేద్కర్ జిల్లా తాళ్లరేవుకు చెందిన వాళ్లుగా పోలీసులు గుర్తించారు. వీళ్లంతా మునిపెడలో చేపల వేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో మృతదేహం కంటెయినర్ డ్రైవర్ది కాగా.. అతని పేరు, ఇతర వివరాలు తెలియరావాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రొయ్యల ఫీడ్తో పాండిచ్చేరి నుంచి భీమవరం ఆ కంటెయినర్ వెళ్తోంది. ఇక బొలెరో వ్యాన్ అమలాపురం మండలం తాళ్లరేవు నుంచి కృత్తివెన్ను మండలం మునిపెడ వెళ్తోంది. అయితే పుల్లల లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ ను బొలెరో డ్రైవర్ అతివేగంగా ఓవర్ టేక్ చేసే క్రమంలో కంటెయినర్కు ఢీ కొట్టినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించుకున్నారు.పురంధేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతికృష్ణా జిల్లా సీతనపల్లి ఘోర రోడ్డు ప్రమాద ఘటన పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆమె.. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను కోరారు. అలాగే ఘటన తర్వాత.. గాయపడిన వాళ్లను బయటకు తీసిన స్థానికుల చొరవకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. -
ఆగని టీడీపీ ఉన్మాదం
సాక్షి నెట్వర్క్: ఎన్నికల్లో కూటమి విజయం తర్వాత టీడీపీ శ్రేణుల్లో చెలరేగిన ఉన్మాదం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులపై దాడుల రూపంలో కొనసాగుతూనే ఉంది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే మొదలైన ఈ దాడుల నియంత్రణకు ప్రభుత్వం కనీస ప్రయత్నం చేయడంలేదు. దీన్ని ఆసరా చేసుకొని టీడీపీ శ్రేణులు మరింతగా రెచ్చిపోతున్నాయి. గురువారమూ టీడీపీ శ్రేణులు పలు సచివాలయాలు, ప్రభుత్వ స్థలాలపై దాడులు చేశాయి. శిలాఫలకాలు ధ్వంసం చేశాయి. బోర్డులు విరగ్గొట్టాయి.» చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో బైరెడ్డిపల్లె, నగరి మండలాల్లోని పలు సచివాలయాల్లో ఉద్యోగులు విధి నిర్వహణలో ఉండగానే టీడీపీ నాయకులు శిలాఫలకాలను ధ్వంసం చేశారు. పుంగనూరు మండలంలోని పాలెంపల్లి, భీమగానిపల్లి, బోడేవారిపల్లె సచివాలయాలకు, వెల్నెస్ సెంటర్లకు, ఆర్బీకెలకు, ఆర్వో ప్లాంటుకు, నాడు–నేడు స్కూల్ ప్రారంభించేందుకు వేసిన శిలాఫలకాలను ధ్వంసం చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోటోలు ఉన్న శిలాఫలాకాలను గునపాలతో ధ్వంసం చేశారు. దీంతో సచివాలయ కార్యదర్శులు భయంతో పరుగులు తీశారు.» బైరెడ్డిపల్లె మండలం లక్కనపల్లెలో సచివాలయంలోని శిలాఫలకాలు, సంక్షేమ పథకాల బోర్డులను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. శిలాఫలకాలు తొలగించాలని ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు లేవని ఎంపీడీవో రాజేష్ చెప్పారు. కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో రెచ్చగొడుతూ శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.» నగరి మండలం తెరణి గ్రామంలో సచివాలయ భవనంపై ఉన్న నవరత్నాల ఫలకాన్ని గురువారం టీటీడీ నాయకులు, కార్యకర్తలు తొలగించారు. భవనం ముందు ఉన్న ప్రారంభోత్సవ శిలాఫలకంపై పెయింట్ పూశారు. ఈ ఘటనపై స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు పోలీసులకు సమాచారం అందించారు.» శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రామాయపట్నం గ్రామ సచివాలయం భవనంపై ఉన్న నవరత్నాల బోర్డును టీడీపీ కార్యకర్తలు బుధవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. » నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని కల్వటాలలో టీడీపీ నాయకులు మినరల్ వాటర్ ప్లాంట్ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా ఎస్సీ కాలనీకి చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరులు పెసల ఏసోబు, యాడికి ఏబులపై కర్రలతో దాడి చేశారు.» బాపట్ల జిల్లా బల్లికురవ మండలం వలాపల్లి గ్రామంలో 2017–2018లో ఉపాధి హామీ నిధులు రూ.10 లక్షలతో గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించారు. 2019లో దానిపై మొదటి అంతస్తు నిర్మించి, సచివాలయం ఏర్పాటు చేశారు. ఈ సచివాలయం శిలాఫలకాన్ని టీడీపీ నాయకులు ధ్వంసం చేశారు. గ్రామస్తులందరూ గ్రామాభివృద్ధికి బాటలు వేసుకోవాలే తప్ప శిలాఫలకాలు ధ్వంసం చేయడం సరికాదని గ్రామ సర్పంచ్ మందా మోహన్రావు అన్నారు. -
పెళ్లికి నిరాకరించిందని యువకుడి ఆత్మహత్య
బద్వేలు అర్బన్/అట్లూరు: ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందనే మనస్తాపంతో ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని కలసపాడు గ్రామానికి చెందిన బాలిరెడ్డి, వెంకట సుబ్బమ్మకు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడైన పామూరి సాయికుమార్రెడ్డి (27) గోపవరం మండలంలో 108 వాహనానికి డ్రైవర్గా పని చేస్తుండేవాడు. కలసపాడు మండలం సిద్ధమూర్తిపల్లెకు చెందిన ఓ యువతి, సాయికుమార్రెడ్డి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆమె అట్లూరు మండలం తంబళ్లగొంది రైతు భరోసా కేంద్రంలో ఉద్యోగం చేస్తోంది. గురువారం ఉదయం 10 గంటల సమయంలో తంబళ్లగొందికి వెళ్లిన సాయికుమార్రెడ్డి తనను పెళ్లి చేసుకునేది, లేనిదీ తేల్చాలని.. లేదంటే ఇద్దరం ఆత్మహత్య చేసుకుని చనిపోదామని ఉమామహేశ్వరిని నిలదీశాడు. దీనికి ఆమె ససేమిరా అనడంతో మనస్తాపానికి గురైన అతను అక్కడి నుంచి నేరుగా పట్టణంలోని సిద్దవటం రోడ్డులో ఉన్న తన అక్క ఇంటికి వచ్చాడు. కొద్దిసేపటికి ఆమె సమీపంలోని వారి ఫ్యాన్సీ స్టోర్కు వెళ్లిపోగా ఇంట్లో ఎవరూ లేరని గ్రహించి వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇంటినుంచి దట్టమైన మంటలు, పొగలు వ్యాపించడంతో చుట్టుపక్కల వారు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి లోపలికి వెళ్లి చూడగా సాయికుమార్రెడ్డి తీవ్రమైన గాయాలతో మృతి చెంది ఉన్నాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
అటు ప్రమాణం.. ఇటు విధ్వంసం
సాక్షి నెట్వర్క్: ఒకవైపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, జనసేన, కూటమి శ్రేణులు మరింత రెచ్చిపోయి విధ్వంసాలకు దిగాయి. పలు ప్రభుత్వ కార్యాలయాల పేర్లు మార్చేశారు. ప్రగతి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేశారు. విగ్రహాలను నేలకూల్చారు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై టీడీపీ జెండాలు కట్టారు. వైఎస్సార్సీపీ జెండాదిమ్మెల్ని ధ్వంసం చేశారు. అనంతపురం రూరల్ మండలం కాటిగానికాలువ గ్రామంలో రైతుభరోసా కేంద్రం (ఆర్బీకే) శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో కొందరు టీడీపీ కార్యకర్తలు కాటిగానికాలువ రైతుభరోసా కేంద్రంలోకి కేక్ తీసుకొచ్చి కట్ చేశారు. అనంతరం బయటకు వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఒక మహిళ చేతికి సుత్తి ఇచ్చి పగులగొట్టించారు. తర్వాత ఇద్దరు కార్యకర్తలు ఆ శిలాఫలకాన్ని బయటకు తీసుకెళ్లి పూర్తిస్థాయిలో ధ్వంసం చేశారు. సచివాలయ భవనంపైకెక్కి టీడీపీ జెండా కట్టారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని ప్రభుత్వ కార్యాలయ భవనంపై కట్టిన టీడీపీ జెండాను పీకేయించారు. ఈ ఘటనపై మహిళా పోలీసు మౌనిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన కేసులో వీడియో ఆధారంగా అదే గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, రామాంజనేయులు, చంద్రమౌళినాయుడుపై కేసు నమోదు చేసినట్లు సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. అలాగే కొందరు బెదిరింపులకు దిగుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ఎవరైనా బెదిరిస్తే బాధితులు నేరుగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. బెదిరించేవారిపట్ల పోలీసుశాఖ కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. » కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మండలం ఉలిమేశ్వరం గ్రామంలో విధ్వంసానికి పాల్పడ్డారు. మంత్రివర్గ ప్రమాణస్వీకారాన్ని ప్రజలు చూసేందుకు పంచాయతీ అధికారులు రైతుభరోసా కేంద్రంలో ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మాజీ సభ్యుడు పేకేటి దొరబాబు, తదితరులు అక్కడున్న ఆర్బీకే ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. కార్యాలయంలోని కరపత్రాలు, అధికారిక పత్రాలను తగులబెట్టారు. ఇదెక్కడి దౌర్జన్యం అంటూ సర్పంచ్ భర్త ఆకుల వీరబాబు నిలదీశారు. దీంతో దొరబాబు, వీరబాబు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సీఐ రవికుమార్, ఎస్ఐ వెలుగుల సురేష్ అక్కడికి చేరుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు. పోలీస్ పికెట్ను ఏర్పాటు చేశారు. » చిత్తూరు జిల్లా నిండ్ర మండలంలోని అగరం గ్రామ పంచాయతీలో సచివాలయం భవనం ప్రారంభోత్సవం నాడు ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, అప్పటి మంత్రి రోజా పేరిట ఉన్న శిలాఫలకాన్ని పగులగొట్టారు. ఈ విషయమై బుధవారం స్థానికులు అధికారులకు ఫిర్వాదు చేశారు. » తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) కార్యాలయానికి ఉన్న డాక్టర్ వైఎస్సార్ పేరును దౌర్జన్యంగా తొలగించారు. ఆ స్థానంలో ఎన్టీఆర్ పేరు ఏర్పాటు చేశారు. కార్యాలయం లోపల ఉన్న వైఎస్సార్ ఫొటో అక్కడి నుంచి తొలగించారు. » కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ఈడేపల్లిలో శిశు విద్యామందిర్ వద్ద ఉన్న 45వ డివిజన్ సచివాలయానికి పసుపు పచ్చని నూతన బోర్డు ఏర్పాటు చేశారు. ఆ డివిజన్ టీడీపీ నాయకుడు పి.వి.ఫణికుమార్తో కలిసి నాయకులు, కార్యకర్తలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి పవన్కళ్యాణ్, ఎంపీ వల్లభనేని బాలశౌరి చిత్రాలతో తయారు చేసిన సచివాలయం బోర్డు ఏర్పాటు చేశారు. బోర్డు ఏర్పాటుకు సచివాలయ సిబ్బంది సహకరించారు. ఫణికుమార్ కేక్ కట్ చేశారు. » శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులోని 54వ డివిజన్ జనార్దన్రెడ్డికాలనీలో వైఎస్సార్సీపీ జెండాను, స్థూపాన్ని, శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఘటనా స్థలాన్ని నెల్లూరు మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు, వైఎస్సార్సీపీ నాయకుడు ఎస్కే జమీర్అహ్మద్, పలువురు పార్టీ నాయకులు పరిశీలించారు. » చిత్తూరు జిల్లా కుప్పం మండలం కొత్తయిండ్లు గ్రామంలో వైఎస్సార్సీపీ జెండాను ధ్వంసం చేశారు. మొదటి నుంచి టీడీపీకి పట్టున్న గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలను గెల్చుకున్న వైఎస్సార్సీపీ వర్గీయులు జెండా ఎగురవేసారు. అప్పటి నుంచి వైఎస్సార్సీపీపై అక్కసు వ్యక్తంచేస్తున్న టీడీపీ నాయకులు మంగళవారం రాత్రి జెండా పీకేసి స్థూపాన్ని ధ్వంసం చేశారని స్థానికులు తెలిపారు. » శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఆర్.హెచ్.పురంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని మంగళవారం రాత్రి కూల్చివేశారు. గ్రామంలో టీడీపీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన అనంతరం విద్యుత్ సరఫరా నిలిపేసి సుమారు 15 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించి పొదల్లో పడేశారు. దీనిపై కలెక్టర్కు, ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు.» ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో తెలుగుదేశం, జనసేన నాయకులు బుధవారం గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు సచివాలయం–2 భవనం ప్రారంభ సమయంలో ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్ల వద్ద బాణసంచా కాలుస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. దీనిపై వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ మణికుమార్ చెప్పారు. » తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపుసావరం గ్రామంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతల విజయోత్సవ ర్యాలీ శృతితప్పింది. మోటారు సైకిళ్లపై ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలు గ్రామంలోని జక్కంపూడి గ్రామ మోహన్రావు మల్టీపర్పస్ సెంటర్ గేట్లు తెరుచుకుని గ్రౌండ్లోకి ప్రవేశించారు. అక్కడున్న ఫ్లెక్సీలను చించేశారు. కళ్యాణ మంటపం గోడపై మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, జిల్లా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా తదితరుల పేర్లున్న శిలాఫలకాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు రాళ్లు విసిరారు. దీంతో పలు కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. శిలాఫలకం పాక్షికంగా దెబ్బతింది. -
రైల్వే సిగ్నల్స్ ట్యాంపర్..రెండు రైళ్లలో దోపిడీ
బిట్రగుంట: విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని కావలి– శ్రీవెంకటేశ్వరపాళెం రైల్వేస్టేషన్ల మధ్య బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు రెండు రైళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. రైల్వే సిగ్నల్స్ను ట్యాంపర్ చేయడం ద్వారా రెడ్ సిగ్నల్ వేసి రైళ్లను నిలిపి దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. రైల్వే జీఆర్పీ అధికారుల సమాచారం మేరకు.. కావలి–శ్రీవెంకటేశ్వరపాళెం రైల్వేస్టేషన్ల మధ్య నెల్లూరు వైపు వెళ్లే మార్గంలో తెల్లవారుజామున 1.50 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు సిగ్నలింగ్ వ్యవస్థను ట్యాంపర్ చేసి రెడ్ సిగ్నల్ పడేలా చేశారు. ఆ సమయంలో నరసాపురం నుంచి ధర్మవరం వెళుతున్న ధర్మవరం ఎక్స్ప్రెస్ (నంబరు 17247)ను నిలిపివేసి ఎస్–11, ఎస్–13 బోగీల్లోకి ప్రవేశించారు. ఇద్దరు మహిళా ప్రయాణికుల మెడల్లోని బంగారు గొలుసులు, బ్యాగులు చోరీ చేసి పారిపోయారు. ఈ ఘటన జరిగిన 20 నిమిషాల తర్వాత అదే మార్గంలో వచి్చన షిర్డిసాయినగర్ నుంచి తిరుపతికి వెళ్తున్న తిరుపతి స్పెషల్ (07638) ట్రైన్ను ఇదే తరహాలో నిలిపి ఎస్–3, ఎస్–5 కోచ్ల్లోకి ప్రవేశించారు. ఇద్దరు మహిళా ప్రయాణికుల మెడల్లోని 38 గ్రాముల బంగారు గొలుసులు, బ్యాగులు అపహరించారు. ఈ క్రమంలో దోపిడీని అడ్డుకునేందుకు ఓ ప్రయాణికుడు ప్రయత్నించగా రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. అనంతరం పక్కనే ఉన్న కొండబిట్రగుంట అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. రైల్వే పోలీసులు దుండగుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
జగన్ ఓటమిని జీర్ణించుకోలేక..
కొవ్వూరు : సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలుకావడం ఆ వీరాభిమాని జీర్ణించుకోలేకపోయాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. మొన్నటి ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఉంటారని.. తన ఆవేదనను రాష్ట్రపతి దృష్టికి వెళ్తే మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారని భావిస్తూ మిత్రులకు పంపిన వీడియో సందేశంలో వివరించాడు. తూర్పుగోదావరి జిల్లా గోదావరి నదిపై ఉన్న గామన్ బ్రిడ్జిపై మంగళవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఏమిటంటే.. తూర్పు గోదావరి జిల్లా చాగల్లు మండలం బ్రాహ్మణగూడెం గ్రామానికి చెందిన తాళ్లూరి రాజు, తన భార్య నాగలక్ష్మి, కుమార్తె హర్షిత, కుమారుడు మోక్షిత్తో కలిసి మంగళవారం గోదావరి నదిలో దూకి ఆత్మహత్య కోవాలని నిర్ణయించుకున్నాడు. కొవ్వూరు–కాతేరు మధ్య గోదావరిపై ఉన్న గామన్ బ్రిడ్జి పైకి వేకువజామునే చేరుకున్నాడు. తాను, తన కుటుంబమంతా గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నామని మిత్రులకు వీడియో సందేశం పెట్టాడు. పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, రాజు కుటుంబ సభ్యులు, కొవ్వూరు పట్టణ పోలీసులు ఈ సమాచారం తెలుసుకుని వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్రిడ్జిపై రోడ్డు పక్కన ఫుట్పాత్పై ఉన్న రాజుకు, ఆయన కుటుంబ సభ్యులకు వైఎస్సార్సీపీ కార్యకర్త చిన్నం హరిబాబు, కొవ్వూరు పట్టణ సీఐ వి. జగదీశ్వరరావు, ఇతర సిబ్బంది నచ్చజెప్పి బయటకు తీసుకుకొచ్చారు.ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఉంటారు..అనంతరం.. రాజు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ ఒక్కరిని అడిగినా వైఎస్సార్సీపీకే ఓటు వేశామంటున్నారని, కానీ, జగన్ ఎలా ఓటమి పాలయ్యారో తెలీడంలేదని ఆవేదన వ్యక్తంచేశాడు. తన కుటుంబ చావుతోనైన ఎన్నికల్లో చోటుచేసుకున్న అవకతవకలపై విచారణ చేస్తారని ఆశిస్తున్నానన్నాడు. ఈవీఎంల ట్యాంపరింగ్ చేసి ఉంటారని, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి అవుతారని రాజు చెప్పాడు. తన ఆవేదనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకువెళ్తే రీపోలింగ్కు ఆదేశిస్తారన్న ఉద్దేశంతో వీడియో ద్వారా తన సందేశాన్ని తెలిపి కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నానన్నాడు. తన కుటుంబం చావు ద్వారా జగనన్నకు మేలు చేకూరితే చాలని కన్నీటి పర్యంతమయ్యాడు. ఇంత మంచి చేసిన జగన్ ఓడిపోతారనుకోలేదు..తనకు రెండుసార్లు యాక్సిడెంట్ అయితే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం చేశారని.. కాలులో స్టీల్రాడ్లు వేసి, వైద్యం చేసి, ఇంటికి పంపించారని రాజు తనకు జరిగిన మేలును వివరించాడు. మంచంపై ఉన్న రెండునెలలూ తన కుటుంబ పోషణకు వైఎస్సార్ ఆసరా పేరిట ఆర్థిక సాయం చేశారని.. అలాగే, తనకు ఏళ్ల తరబడి సొంతిల్లు లేదని, జగనన్న దయతో ఇంటి స్థలం ఇచ్చారని, ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పాడు. ఈ ఏడాది తన కుమార్తె చదువుకు అమ్మఒడి సొమ్ము పడుతుందని ఆశపడ్డానని, తన తమ్ముడికీ అమ్మఒడి సాయం అందుతోందని తెలిపాడు. అలాగే, నాన్నమ్మకు రూ.3 వేల పింఛను అందిస్తున్నారని, అందరికీ ఇంత మంచి చేసిన జగన్ ఘోరంగా ఓటమి పాలవుతారని కలలో కూడా ఊహించలేదని కన్నీటితో చెప్పాడు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచీ తనకు కంటి మీద కునుకులేదని, జగనన్న ఓటమి నిరంతరం తనను కలచివేస్తోందని ఆవేదన చెందాడు. ఏదో మోసం జరిగిందనేదే తన బాధ అని, ఈ ఎన్నికలపై విచారణ చేయిస్తే వాస్తవాలు బయటపడతాయన్నాడు.ఇక బుధవారం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తే ఎన్నికలపై విచారణకు అవకాశం ఉండదన్నారు. అందుకనే తెల్లవారుజామున 5.30 గంటలకు భార్యాపిల్లల్ని తీసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు బ్రిడ్జిపైకి వచ్చానని చెప్పాడు. రాజు, ఆయన భార్యకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
చంపుతామని టీడీపీ.. ఊరొదిలి పెట్టమని పోలీసులు
సాక్షి టాస్క్ఫోర్స్ : రేయ్.. మాధవ్.. నిన్ను చంపుతాం అంటూ టీడీపీ నాయకులు, ఊరొదిలి వెళ్లిపోవాలంటూ పోలీసు అధికారులు నిన్నటి వరకు ఎంపీ అయిన గోరంట్ల మాధవ్పై అధికార జులుం ప్రదర్శిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ రోజున అనంతపురం నగరంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశారు. ‘రేయ్ మాధవ్ నిన్ను చంపుతాం’ అంటూ కేకలు వేస్తూ రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనపై నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇప్పటికి వారం అవుతున్నా పోలీసులు కనీస చర్యలు తీసుకోలేదు. దాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా పోలీసులపై అధికార పార్టీ నుంచి పెద్దఎత్తున ఒత్తిళ్లు వస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా, నిన్నటి వరకు ఎంపీ అయిన మాధవ్నే ఊరొదిలి వెళ్లిపోవాలని పోలీసు అధికారులు ఒత్తిడి చేయడం గమనార్హం. అయితే, ఇందుకు మాధవ్ ససేమిరా అంటున్నారు. కార్యకర్తలకు అండగా ఇక్కడే ఉంటానని కరాఖండిగా చెబుతున్నారు.ఆరోజు ఏమి జరిగిందంటే..ఈ నెల 4న ఎన్నికల కౌంటింగ్ జరిగింది. మధ్యాహ్నానికి రాష్ట్రంలో కూటమి మెజార్టీ సీట్లు గెలుచుకోవడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో నగర శివారులోని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటి వద్ద కొందరు టీడీపీ కార్యకర్తలు వీరంగం చేశారు. ఇంటి మీద రాళ్ల వర్షం కురిపించారు. ఆ సమయంలో మాధవ్ దంపతులు ఇంట్లోనే ఉన్నారు. ఇంటిపై భాగంలోని అద్దాలు పగిలిపోయాయి.ఒక రాయి మాధవ్ కుడికాలి పాదం వద్ద బలంగా తాకడంతో గాయమైంది. చుట్టుపక్కల వాళ్లు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్లకు తలుపులు వేసుకున్నారు. మాధవ్ గన్మెన్లు నిలువరించే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. ‘రేయ్.. మా ప్రభుత్వం వస్తోంది. మాధవ్గాడిని చంపుతాం. నీకు ఎవరు దిక్కు వస్తారురా’ అంటూ కేకలు వేశారు. పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ‘నిన్ను ఎప్పటికైనా హతమారుస్తాం’ అంటూ వెళ్లిపోయారు. ఎస్పీ గౌతమిశాలి స్వయంగా ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అల్లరిమూకలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. గోరంట్ల మాధవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కానీ కేసులో ఇప్పటిదాకా ఎలాంటి పురోగతీ లేదు.ఊరొదిలి పోవాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు : మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్తనను ఊరు వదిలి పోవాలంటూ పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పారు. మంగళవారం సాయంత్రం ఇద్దరు సీఐలు తన నివాసానికి వచ్చి ఈ విషయం చెప్పారని తెలిపారు. అనంతపురం డీఎస్పీ కూడా ఇదే రకమైన ఒత్తిడి చేస్తున్నారన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు వదిలిపెట్టి వెళ్లబోనని, తమ పార్టీ కార్యకర్తల కోసం అండగా ఉంటానని స్పష్టంచేశారు. అవసరమైతే తనను అరెస్టు చేసుకోవాలన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని టీడీపీ సద్వినియోగం చేసుకుని వారికి మంచి చేయాలి కానీ ఇలా ఇళ్లపై దాడులు చేయడం హేయమని అన్నారు. ఎప్పుడూ లేని విధంగా కౌంటింగ్ రోజు నుంచే గ్రామాల్లో దాడులకు తెగబడుతున్నారన్నారు. టీడీపీ నాయకుల దాడులకు తట్టుకోలేక చాలా మంది ఊళ్లు వదిలారని, కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని, పార్టీ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని చెప్పారు. పార్టీ అధినేత సూచనలతో త్వరలోనే బాధితులను కలిసి భరోసా ఇస్తామన్నారు. -
ఊరూరా విధ్వంసాలు, వేధింపులు..
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో టీడీపీ నేతలు, కార్యకర్తల ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది. వారం రోజులుగా జరిగిన వందలాది ఘటనల్లో వైస్సార్సీపీ కార్యకర్తలు తీవ్ర గాయాలపాలయ్యారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లింది. ప్రధానంగా గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలను లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టిస్తున్నారు. శిలాఫలకాలను ధ్వంసం చేస్తూ.. వైఎస్సార్ విగ్రహాలను కూలదోస్తున్నారు. పోలింగ్ ముగిసినప్పటి నుంచి దాడులు, దౌర్జన్యాలు, విధ్వంసాలు మొదలైనప్పటికీ.. ఫలితాల వెల్లడి తర్వాత పరిస్థితి శ్రుతిమించి పోయింది. ఎక్కడికక్కడ వైఎస్సార్సీపీ కార్యకర్తలను దారి కాచి దాడులు చేస్తున్నారు. గ్రామాల్లో ఇళ్లలోకి దూరి కొడుతున్నారు. వైఎస్సార్సీపీకి ఓటు వేశారన్న అనుమానంతో సామాన్యులను సైతం కక్ష సాధింపుతో వేధిస్తున్నారు. ‘ఇదేం అన్యాయం.. కాపాడండయ్యా..’ అంటూ బాధితులు పోలీస్స్టేషన్కు పరుగులు తీస్తున్నా.. ఆ ఖాకీలు మాత్రం వృత్తి ధర్మాన్ని మరచి చోద్యం చూస్తున్నారు. తాజాగా అనంతపురంలో హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను చంపుతామని బెదిరించారు.ఊరు వదిలి వెళ్లాలని సాక్షాత్తు పోలీసు అధికారులే ఉచిత సలహా ఇస్తుండటం నివ్వెరపరుస్తోంది. తెనాలిలో వైఎస్సార్సీపీ నేత కాళిదాసు సత్యంపై, పల్నాడు జిల్లా బట్లూరులో ఆర్ఎంపీ వైద్యుడు శివయ్యపై హత్యాయత్నం చేశారు. రోజురోజుకూ పెరుగుతున్న టీడీపీ నేతలు, కార్యకర్తల అరాచకం.. దౌర్జన్యం.. కనుసైగ చేసి దాడులను ప్రోత్సహిస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, లోకేశ్ల తీరుపై రాష్ట్రపతికి నివేదించాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా పార్టీ ఎంపీల బృందం మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకుంది. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరింది. రాష్ట్రంలో విధ్వంసకాండ గురించి బుధవారం జాతీయ మీడియాకు కూడా వివరించనుంది. ఇదే విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించగా, హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. ఆ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నెల 13న ఈ పిటిషన్ విచారణకు రానుంది. -
విజయనగరం: ఆ ఆర్టీసీ డ్రైవరన్న టైమింగ్.. దెబ్బకు స్మగ్లర్లు పరార్
విజయనగరం: గుర్తుతెలియని వ్యక్తులు బస్సులో విడిచిపెట్టి వెళ్లిన గంజాయితో కూడిన రెండు బ్యాగులను దత్తిరాజేరు మండలం పెదమానాపురం పోలీస్ స్టేషన్కు ఆర్టీసీబస్సు డ్రైవర్ పి.గణపతి సోమ వారం అప్పగించారు. ఎస్ఐ శిరీష తెలిపిన వివరాల ప్రకారం.. సాలూరు నుంచి వైజాగ్ వెళ్తున్న ఆర్టీసీ డీలక్స్ బస్సులో రామభద్రాపురం వద్ద ఇద్దరు వ్యక్తులు ఎక్కారు. పెదమానాపురం వద్దకు వచ్చేసరికి బస్సులో ఎంత మంది ఉన్నారో ఆర్టీసీ సిబ్బంది లెక్కిస్తున్న సమయంలో వారు టిక్కెట్లు తీయలేదని గమనించి నిలదీశారు. వారు వెంటనే బస్సుదిగి పారిపోయారు. ప్రయాణికులతో కలిసి వారు తెచ్చిన బ్యాగులు తెరిచి చూడగా గంజాయి ఉన్నట్టు గమనించారు. వెంటనే బస్సును స్టేషన్ వద్ద ఆపి గంజాయిని ఆర్టీసీ డ్రైవర్ అప్పగించారు. తహసీల్దార్ సుదర్శన్, వీఆర్వో ఆధ్వర్యంలో బ్యాగులో ఉన్న గంజాయిని తూకంవేసి 14.3 కేజీలు ఉన్నట్టు నిర్ధారించారు. గంజాయిని సీజ్ చేసి పరారైన వ్యక్తుల కోసం గాలిస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ కార్యకర్తల దాడి
సాక్షి, అనకాపల్లి: అధికారం అండ చూసుకుని టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపుపాలెం మండలం రాశిపల్లి శివారు ఎరకన్నపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ బూత్ కనీ్వనర్ కొల్లి అప్పలనాయుడుపై కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆదివారం రాత్రి ఎరకన్నపాలెంలో టీడీపీ విజయోత్సవ ర్యాలీ చేశారు. గ్రామ శివారులో ఉన్న వైఎస్సార్సీపీ బూత్ కనీ్వనర్ అప్పలనాయుడు ఇంటిపై బాణా సంచాకాల్చారు. దీంతో అప్పలనాయుడు ఇంటి సమీపంలోనే ఉన్న పశువులు బెదిరాయి.పశువులు బెదురుతున్నాయని, పక్కనే గడ్డి వాము కూడా ఉందని, బాణాసంచా కాసింత దూరంలో కాల్చుకోవాలని అప్పలనాయుడు వారిని కోరాడు. వెంటనే టీడీపీ కార్యకర్తలు ఆయనపై కర్రలతో దాడి చేశారు. దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన ఆయన తమ్ముడు రామారావు, తల్లి సత్యవతి, తండ్రి అప్పారావును కూడా కర్రలతో కొట్టారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పలనాయుడుకు తలపై తీవ్రమైన గాయం కావడంతో గాజువాక కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో, ఆయన తల్లి సత్యవతి, తమ్ముడు రామారావు ఇద్దరూ నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రణాళిక ప్రకారమే దాడి అప్పలనాయుడిపై ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందని గ్రామస్థులు తెలిపారు. ఆయన ఇంటి వద్దకు టీడీపీ ర్యాలీ వచి్చన వెంటనే కరెంటు పోయిందని, అప్పలనాయుడిపై దాడి జరిగిన కొన్ని నిమిషాల్లో కరెంట్ వచి్చందని, ముందస్తుగానే కరెంటు తీసేసి దాడికి పాల్పడ్డారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దాడికి పాల్పడిన వారే ముందుగా పోలీసు స్టేషన్కు వెళ్లి తమపై కూడా దాడి చేశారని వెళ్లి ఫిర్యాదు చేశారు.50 మంది టీడీపీ రౌడీలు కర్రలతో దాడి టీడీపీ గూండాలు ఉద్దేశపూర్వకంగానే అప్పలనాయుడు ఆవుల షెడ్పైకి తారాయి జువ్వలు వేశారు. దూరంగా కాల్చుకోవాలని చెప్పిన అప్పలనాయుడుపై 50 మందికి పైగా టీడీపీ గూండాలు కర్రలతో దాడి చేశారు. ఆయన తల పగిలేలా కొట్టారు. అప్పలనాయుడును నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యుల సూచన మేరకు రాత్రి 12 గంటల సమయంలో విశాఖలోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తీసుకెళ్లాం. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. పోలీసు స్టేషన్లో 8 మందిపై కేసు నమోదు చేశారు. – భద్రాచలం, జెడ్పీటీసీ, మాకవరపుపాలెం మండలం -
విగ్రహాలపై అక్కసు
సాక్షి నెట్వర్క్ : ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తల విధ్వంసకర ప్రవర్తన కొనసాగుతోంది. కర్రలు, రాళ్లు, రాడ్లతో వీరంగం చేస్తున్నారు. విగ్రహాలను, శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. వీరు యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. టీడీపీ, జనసేన పార్టీల తీరుపై ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం గోపువానిపాలెం గ్రామంలో ప్రధాన రహదారి పక్కన ఆంజనేయస్వామి ఆలయం ఎదుట ఉన్న మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.రెండేళ్ల కిందట అన్ని అనుమతులు తీసుకుని ఏర్పాటుచేసిన ఈ విగ్రహాన్ని అప్పటి ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ ఆవిష్కరించారు. ఈ విగ్రహం తలభాగాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయమై మాజీ ఎమ్మెల్యే అనిల్కుమార్ సూచన మేరకు స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు కనగాల హరిబాబు పార్టీ మండల పార్టీ నాయకులతో కలిసి సోమవారం పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని, ఆంజనేయస్వామి దేవస్థానంలోని సీసీ కెమెరాలను పరిశీలించి దుండగుల ఆచూకీ తెలుసుకోవాలని కోరారు.మండలంలోని కపిలేశ్వరపురం, వీరంకిలాకు, పమిడిముక్కల, ఐనపూరు గ్రామాల్లోని వైఎస్సార్ విగ్రహాలకు రక్షణ కల్పించాలని, దాడులను అరికట్టాలని వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు యలమంచిలి గణేష్ పార్టీ నాయకులతో కలిసి స్టేషన్లో వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీలు కొడమంచిలి మహేష్, గంజాల సీతారామయ్య, ఎంపీటీసీ సభ్యుడు గుర్విందపల్లి వంశీ, కోఆప్షన్ సభ్యుడు దియానత్అలీ, మాజీ ఎంపీపీ శొంఠి వెంకటేశ్వరరావు, సర్పంచ్ కోట మణిరాజు, పీఏసీఎస్ అధ్యక్షుడు అక్కినేని సతీష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. శిలాఫలకాలపై గునపాలతో దాడికాకినాడ జిల్లా కరప మండలం కూరాడ గ్రామ సచివాలయంపై ఉన్న దివంగత నేత వైఎస్సార్, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు చిత్రాలను సోమవారం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు గునపాలతో పగులకొట్టి తొలగించారు. గత ఏడాది ఈ సచివాలయం నిర్మించి, ఇరువైపులా వైఎస్సార్, జగన్, కన్నబాబు ముఖ చిత్రాలను సిమెంట్తో చెక్కించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా జనసేన అభ్యర్థి పంతం నానాజీ గెలుపొందారు.ఈ నేపథ్యంలో కూరాడలో జనసేన నాయకులు, కార్యకర్తలు గ్రామ సచివాలయంపై ఉన్న వైఎస్సార్సీపీ నాయకుల చిత్రాలను, గ్రామంలో అభివృద్ధి పనుల శిలాఫలకాలను కూడా తొలగించారు. నంద్యాల మండలం రాయమాల్పురం గ్రామంలో అభివృద్ధి శిలాఫలకాలను సోమవారం టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. 20 రోజుల కిందట కురిసిన వర్షాలకు గతంలో టీడీపీ నేతలు అభివృద్ధి పనుల సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకం కింద పడిపోయింది. అయితే ఇది వైఎస్సార్సీపీ వర్గీయుల పని అని టీడీపీ నేతలు అనుమానించారు. ఈ నేపథ్యంలో వారు సోమవారం గ్రామ సచివాలయం వద్ద ఉన్న శిలాఫలకం, రహదారి పక్కనున్న శిలాఫలకాలను ధ్వంసం చేశారు.వీటిపై పంచాయతీ కార్యదర్శి విశ్వనాథరెడ్డి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కందులూరు గ్రామంలో రైతుభరోసా కేంద్రం, సచివాలయాలపై ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటాలను సోమవారం టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అనంతరం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే చంద్రబాబునాయుడు, ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే స్వామి ఉన్న ఫ్లెక్సీలను రైతుభరోసా కేంద్రం, సచివాలయాలపై అంటించి కవ్వింపు చర్యలకు దిగారు. చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీని చింతలపట్టెడలో నూతనంగా నిర్మించిన సెంగుంధ మొదలియార్ కమ్యూనిటీ హాలు వద్ద వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆర్కే రోజా పేరిట ఉన్న శిలాఫలకాన్ని టీడీపీ నాయకులు ఆదివారం రాత్రి ధ్వంసం చేశారు.సోమవారం ఉదయం మండపం వద్ద శిలాఫలకం ధ్వంసం కావడాన్ని గమనించిన మున్సిపల్ చైర్మన్ పి.జి.నీలమేఘం, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు బి.ఆర్.వి.అయ్యప్పన్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు సీఐ సురేష్కు ఫిర్యాదు చేశారు. ఇలాంటి సంస్కృతి ఇప్పటివరకు నగరిలో లేదని తెలిపారు. దీన్ని కట్టడి చేయాలని కోరారు. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం కురువల్లిలో సోమవారం టీడీపీ కార్యకర్తలు వీరంగం చేశారు. గ్రామ సచివాలయం, అంగన్వాడీ భవనాల వద్ద శిలాఫలకాలను ధ్వంసం చేశారు. ఈ విషయంపై ఎస్ఐ శ్రీనివాసులకు ఫిర్యాదు చేసినట్లు సర్పంచ్ జయరామ్రెడ్డి తెలిపారు. -
పెదకాకాని వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం
పెదకాకాని: గుంటూరు జిల్లా పెదకాకాని సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం రాత్రి మూడు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న రెడీమిక్స్ వాహనం మరమ్మతులకు గురవడంతో పెదకాకాని క్యాన్సర్ హాస్పిటల్ ఎదుట జాతీయ రహదారిపై మార్జిన్లో డ్రైవర్ నిలిపారు. విజయవాడ నుంచి గుంటూరుకి అతి వేగంగా వస్తున్న కారు రెడీమిక్స్ వాహనాన్ని ఢీకొట్టింది.దీని వెనుక ప్రయాణికులతో వస్తున్న టాటా ఏస్ వాహనం అతివేగంగా కారును, రెడీమిక్స్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు, టాటా ఏస్ వాహనంలో ఉన్న పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్కి తరలించారు. ఆస్పత్రికి వెళ్లేసరికే ఇద్దరు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు, గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మాంబట్టు సెజ్లో భారీ అగ్నిప్రమాదం
తడ (తిరుపతి జిల్లా): పరిశ్రమల్లో లభించే పాత వస్తువులను సేకరించే ఒక సంస్థ నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమలకు సమీపంలో నెలకొలి్పన డంపింగ్ యార్డులో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా తడలోని మాంబట్టు ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నిల్వ ఉంచిన చెత్తకు నిప్పు అంటుకోవడంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో పొగ ఆకాశాన్ని అంటుకుని చీకట్లు కమ్మేయడంతో సమీప పరిశ్రమల్లోని కార్మికులు ఆందోళన చెందారు.నాయుడుపేట సీఐ శ్రీనివాసులురెడ్డి, సూళ్లూరుపేట సీఐ మధుబాబు, తడ, సూళ్లూరుపేట ఎస్ఐలు నరశింహారావు, రహీంరెడ్డి తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సూళ్లూరుపేట, అపాచీ పరిశ్రమలకు చెందిన రెండు ఫైరింజన్లు మంటలు అదుపు చేసేందుకు శ్రమించాయి. మంటలతోపాటు మంటల్లో నుంచి భారీ శబ్దాలతో పేలుళ్లు వస్తుండటంతో పోలీసులు ఆ దారిన రాకపోకలు అడ్డుకుని ఇతర మార్గాల్లో వాహనాలు మళ్లించారు.కాగా పరిశ్రమలకు సమీపంలో ఎలాంటి జాగ్రత్తలు లేకుండా ఉన్న డంపింగ్ యార్డు వల్ల తీవ్ర ఇబ్బందులు జరుగుతాయని ఏడాది క్రితం సూళ్లూరుపేట ఫైర్ అధికారులు తిరుపతికి చెందిన స్థల యజమాని హర్షవర్ధన్, చెత్త సేకరించి నిల్వ చేసుకునేందుకు స్థలాన్ని లీజుకు తీసుకున్న షేర్ అలీ అనే వ్యక్తులకు సమాచారం ఇచ్చినా వారు పెడచెవిన పెట్టారని ఫైర్ సిబ్బంది తెలిపారు. డంపింగ్ యార్డులో పనికి రాని చెత్త మాత్రమే కాలిపోగా ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఆనుకుని ఉన్న అల్యూమినియం క్యాస్టింగ్ కంపెనీ తీవ్రంగా నష్టపోయింది. -
జగనన్న లేఅవుట్లోని ఇళ్లు ధ్వంసం
దుత్తలూరు: జగనన్న లేఅవుట్లలోని ఇళ్లను కూడా టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం ఏరుకొల్లు పంచాయతీలో జగనన్న లేఅవుట్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎస్సీలకు 36 ఇళ్లు మంజూరు చేసింది. వాటిలో 20 ఇళ్లు పునాది దశలో ఉన్నాయి. ఎస్సీ కాలనీవాసులు వైఎస్సార్సీపీకి ఓటేశారనే అక్కసుతో సోమవారం సాయంత్రం అదే పంచాయతీ రావిళ్లవారిపల్లికి చెందిన పిడికిటి వెంకటేశ్వర్లు జేసీబీతో ధ్వంసం చేశాడు. ఇదేమని ప్రశ్నిaస్తే మీ దిక్కున్న చోట చెప్పుకోండని బెదిరించాడని ఎస్సీ కాలనీవాసులు తెలిపారు.ధ్వంసం చేసిన తొమ్మిది ఇళ్లలో 6 కాంట్రాక్టర్ నిర్మించగా 3 ఇళ్లు సొంతంగా నిర్మించుకుంటున్నారు. ఇళ్ల కూల్చివేతను ఎస్సీ కాలనీవాసులు అడ్డుకొన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కావలి డీఎస్పీ వెంకటరమణ, ఉదయగిరి సీఐ గిరిబాబు, ఎస్సై ఉమాశంకర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. తమ ఇళ్లను ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ కాలనీవాసులు డిమాండ్ చేశారు. పోలీసులు టీడీపీ నాయకుడు పిడికిటి వెంకటేశ్వర్లును, జేసీబీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జేసీబీని స్వా«దీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు మంగళవారం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. -
సరిపల్లిలో టీడీపీ, జనసేన కార్యకర్తల విధ్వంసం
కొయ్యలగూడెం: ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం సరిపల్లి గ్రామంలో సచివాలయ భవనాన్ని ఆదివారం జనసేన, టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. మాజీ ఎమ్మెల్యే బాలరాజు శిలాఫలకాన్ని, సచివాలయం నిర్మించ తలపెట్టిన సామగ్రిని ధ్వంసం చేశారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ పేరిట ప్రణాళిక ప్రకారం నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ భవనం వద్దకు చేరుకుని వైఎస్ జగన్మోహన్రెడ్డిŠ, తెల్లం బాలరాజు ఫ్లెక్సీలను, శిలాఫలకాలను ధ్వంసం చేశారు.సచివాలయ కార్యాలయంలోని సామగ్రిని పగలగొట్టి వీరంగం సృష్టించారు. ఎవరైనా అడ్డుకుంటే అంతుచూస్తామంటూ భవన నిర్మాణ కారి్మకులను బెదిరించారు. పక్కన నిర్మాణంలో ఉన్న మహానేత వైఎస్సార్ విగ్రహం, స్మారక మందిరం వద్ద దాడులకు పాల్పడుతున్న సమయంలో సమీపంలోని రైతులు ఎదురు తిరగడంతో విరమించుకున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు పీఏసీఎస్ అధ్యక్షురాలు మందపాటి శ్రీదేవి తెలిపారు.కొయ్యలగూడెం మండలం సరిపల్లి సచివాలయ భవనంపై దాడి చేస్తున్న కూటమి పార్టీ కార్యకర్త