breaking news
-
టీడీపీ నేతల కీచకపర్వం.. నిందితులకు ‘పరిటాల’ వత్తాసు!
సాక్షి టాస్క్ఫోర్స్ : దళిత మైనర్ బాలికపై ఆరు నెలలుగా 14 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం పేరూరు పంచాయతీ పరిధిలోని ఏడుగుర్రాలపల్లిలో టీడీపీ కీచకులు సాగించిన ఈ దారుణకాండను శుక్రవారం ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ అమానుష ఘటన అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.రాజకీయ, పోలీసు వర్గాల్లో సైతం విస్మయం వ్యక్తమైంది. ఈ ఘటన గురించి స్థానిక పోలీసులకు ముందుగానే తెలిసినా, ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చే వరకు స్పందించక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సాక్షి కథనంతో ఈ ఘోరం బయటి ప్రపంచానికి వెల్లడైంది. నిందితుల్లో తొమ్మిది మందిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరిని విచారణ కోసం అంటూ రామగిరి నుంచి ధర్మవరం తీసుకెళ్లినట్లు సమాచారం. వీరిని ఎక్కడ పట్టుకున్నారనే విషయాన్ని పోలీసులు వెల్లడించ లేదు. దాదాపుగా నిందితుల పేర్లన్నీ ఇప్పటికే బయటకు వచ్చినా, ఎందుకు ముందుగానే అదుపులోకి తీసుకోలేకపోయారనేది అనుమానాలకు తావిస్తోంది.టీడీపీ ప్రముఖ నేతల జోక్యంతో కేసును, నిందితులను తారుమారు చేసే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాప్తాడు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరిటాల సునీత కనుసన్నల్లోనే నిందితులు దాక్కున్నట్లు సమాచారం. వీడియో వైరల్ చేస్తామని బెదిరించి మైనర్ బాలికపై 14 మంది టీడీపీ వర్గీయులు ఆర్నెల్ల పాటు అత్యాచారం సాగించారు. బాధిత బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటకు పొక్కింది. అయితే బాధితురాలు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా నిందితులు తీవ్రంగా బెదిరించారు. దీంతో గురువారం మధ్యాహ్నమే సదరు బాలిక.. తల్లితో కలిసి గ్రామం వదిలి వెళ్లిపోయారు. వారు ఒక టీడీపీ నేత ఇంట్లో ఉండగా.. పోలీసులు ఆ బాలికతో మాట్లాడినట్లు సమాచారం. నీకెవరూ దిక్కు లేరంటూ.. బాధిత బాలికను జిల్లా ఎస్పీ వి.రత్న నేతృత్వంలో ధర్మవరం డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం విచారించినట్లు తెలిసింది. విచారణలో బాలిక విస్తుగొలిపే వాస్తవాలు చెప్పినట్లు సమాచారం. 14 మందీ అదే గ్రామానికి చెందిన టీడీపీ వారేనని వివరించినట్లు తెలిసింది. మొదట ఒకరు బెదిరించి, అత్యాచారానికి పాల్పడి.. ఆ దృశ్యాలను సెల్ఫోన్లో వీడియో తీశాడని, ఆ తర్వాత ఆ వీడియోను ఇతరులకు పంపారని చెప్పినట్లు సమాచారం. అనంతరం ఒకరి తర్వాత మరొకరు ఆ వీడియో పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తూ అమానుషానికి పాల్పడ్డారని కన్నీటి పర్యంతమైనట్లు తెలిసింది. ఇలా దాదాపు ఆరు నెలలుగా అత్యాచారం చేశారని ఎస్పీ విచారణలో బాలిక వెల్లడించినట్లు సమాచారం.‘ఎవరికైనా చెబితే చంపేస్తాం. నీకు తండ్రి లేడు. తల్లికి మతి స్థిమితం లేదు. నీకెవరూ దిక్కు లేరు. మేం చెప్పినట్లు వినకపోతే నీ వీడియోలు బయట పెడతాం అని బెదిరించే వారు. అవి చూపుతూ తరచూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఎంతగా బతిమాలినా వదిలి పెట్టేవాళ్లు కాదు. ఏం చేయాలో తోచేది కాదు. దొంగగా ఏడ్చుకోవాల్సి వచ్చేది. దీంతో నాకు చాలా సార్లు చనిపోవాలనిపించింది. అయితే అమ్మ పరిస్థితి చూసి ఆ పని చేయలేకపోయాను’ అని బాధిత బాలిక తన నరకయాతనను పోలీసులకు వివరించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ బాలికను జువైనల్ హోమ్కు తరలిస్తున్నట్లు సమాచారం. నిందితులకు ‘పరిటాల’ వత్తాసు! సామూహిక అత్యాచారంలో పాల్గొన్నట్లు అనుమానం ఉన్న యువకులందరూ టీడీపీ సానుభూతిపరులే. దీంతో వారిని కాపాడేందుకు ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ రంగంలోకి దిగినట్లు తెలిసింది. వాస్తవానికి బాధిత బాలిక కుటుంబం కూడా టీడీపీలోనే కొనసాగుతోంది. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత జరిగిన విజయోత్సవ సంబరాల్లో బాధిత బాలిక తండ్రి మరణించాడు. అయినప్పటికీ పరిటాల సునీత బాధిత బాలిక వైపు కాకుండా.. నిందితుల వైపు ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, శుక్రవారం ఏడుగుర్రాలపల్లిలో రెవెన్యూ, పోలీస్, ఐసీడీఎస్ అధికారులు పర్యటించారు. ఘటనకు సంబంధించి గ్రామస్తుల ద్వారా వివరాలు సేకరించారు. బాధిత బాలికకు న్యాయం జరిగేవరకు పోరాడతామని దళిత సంఘం నాయకులు పేర్కొన్నారు. -
కాకినాడలో సైబర్ స్కామర్లు
కాకినాడ క్రైం: అమాయకులే లక్ష్యంగా కాకినాడలో ఓ ముఠా ఖాతాలు తెరచి, వాటిని వినియోగించుకుని సైబర్ నేరాలకు పాల్పడుతోంది. ఎస్పీ బిందుమాధవ్ «శుక్రవారం కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన నార్ని సతీశ్ చంద్ర (37), దాసరి వీరవెంకట సత్యనారాయణ (31) కొద్ది నెలలుగా కాకినాడలోని వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తెరిపిస్తున్నారు. పాస్బుక్, చెక్బుక్, ఏటీఎం కార్డుతో కూడుకున్న బ్యాంక్ కిట్లు తమకు అప్పగిస్తే ఖాతా తెరిచేందుకు అయ్యే ఖర్చుతో పాటు మరో రూ.5 వేలు ఇస్తామని ప్రలోభ పెట్టేవారు. ఈ ఖాతాపై రెండు నెలల్లో రూ.5 లక్షల చొప్పున లోన్ ఇప్పిస్తామని నమ్మబలికారు. దీంతో పదుల సంఖ్యలో జనం ఖాతాలు తెరచి, కిట్లను వీరికి అప్పగించారు. కాకినాడకు చెందిన ఉదయ్కిరణ్కు ఈ కిట్లు అప్పగిస్తే అతను వీరికి డబ్బు ఇచ్చేవాడు. కాకినాడ సాంబమూర్తినగర్కు చెందిన కొర్రా లోవరాజు ఖాతా తెరచి కిట్ అప్పగించి రెండు నెలలైంది. లోన్ కోసం కాకినాడలోని బ్యాంక్ ఆఫ్ కర్ణాటకకు వెళ్లాడు. బ్యాంక్ అధికారులు అతని ఖాతా పరిశీలిస్తే కేవలం నెల రోజుల వ్యవధిలో రూ.50 లక్షల విలువైన లావాదేవీలు జరిగినట్లు వెల్లడైంది. దీంతో లోవరాజు పోలీసుల్ని ఆశ్రయించాడు. పోలీసులు సతీశ్ చంద్ర, వీర వెంకట సత్యనారాయణను అదుపులోకి తీసుకొని విచారించారు. వీరు కాకినాడకు చెందిన ఉదయ్కిరణ్ అనే వ్యక్తికి ఈ ఖాతాల కిట్లు అప్పగిస్తే అతడు వీటిని దుబాయ్ పంపిస్తున్నాడని తేలింది. దుబాయ్లో ఈ బ్యాంకు వివరాలు పుట్టారామ్ అనే వ్యక్తికి పంపిస్తున్నాడని తెలిసింది. ఇందుకు ఉదయ్ కిరణ్కు ఖాతాకు రూ.30 వేల చొప్పున పుట్టారామ్ చెల్లిస్తున్నాడు. గడచిన 2 నెలల్లో సతీశ్ చంద్ర, వీర వెంకట సత్యనారాయణ కాకినాడ జిల్లాతో పాటు గుజరాత్, పశ్చిమ బెంగాల్, కర్ణాటకకు చెందిన పేర్లతో 48 ఖాతాలు తెరచి రూ.9 కోట్ల విలువైన మొత్తం జమ చేసినట్టు ఎస్పీ తెలిపారు. సతీశ్ చంద్ర, సత్యనారాయణను అరెస్టు చేయగా ఉదయ్కిరణ్ పరారీలో ఉన్నాడు. పుట్టారామ్ను పట్టుకునేందుకు కేంద్ర నిఘా విభాగాలకు సమాచారమిచ్చామని ఎస్పీ చెప్పారు. -
పోలీసు అరాచకాలకు నా చావు కనువిప్పు కావాలి
సాక్షి, టాస్క్ ఫోర్స్ : తన చావుతోనైనా పోలీసులకు కనువిప్పు కలగాలని, అమాయకులను వేధించడం ఆపాలని ఓ వ్యాపారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అధికార పార్టీ నేతలు, పోలీసుల వేధింపులు తాళలేక పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో ఆయన చివరిసారిగా మాట్లాడిన సెల్ఫీ వీడియో (వాంగ్మూలం) లోని మాటలు వైరల్ అయ్యాయి. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం పెద్దనెమిలిపురి గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణ వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు. కృష్ణా జిల్లా నందిగామకు చెందిన ఎమ్వీఆర్ అలియాస్ గాం«దీతో కలిసి భాగస్వామ్యంతో శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో వాయిదాలపై మిక్సీలు, గ్రైండర్లు వంటి సామగ్రిని విక్రయించే వ్యాపారం చేస్తున్నారు. వీరికి గాంధీ సోదరుడు వైఎన్ఆర్ హైదరాబాద్ నుంచి కావాల్సిన సరుకును పంపుతున్నాడు. ఈ క్రమంలో తన భాగస్వామి గాంధీ అలియాస్ ఎమ్వీఆర్ మృతి చెందడంతో ఎవరికి రావాల్సిన వాటాలు వారు తీసేసుకున్నారు. లక్ష్మీనారాయణ సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాడు. గాంధీ కింద పని చేస్తున్న హనుమంతు, వెంకటేష్, రెడ్డి, సునీల్ వచ్చి తాము కూడా వ్యాపారం చేసుకుంటామని, సరుకు ఇప్పించమని కోరారు. దీంతో లక్ష్మీనారాయణ వారికి కావాల్సిన సరుకు ఇవ్వమని వైఎన్ఆర్కు మాట సాయం చేశాడు. అప్పులకు తాను గ్యారెంటీ ఇవ్వలేనని చెప్పుకొచ్చాడు. కొన్ని రోజుల తర్వాత వీరి నుంచి నగదు చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో మొత్తంగా రూ.35 లక్షలు ఇవ్వాలంటూ వైఎన్ఆర్ ఏడాదిన్నర నుంచి లక్ష్మీనారాయణపై ఒత్తిడి తెచ్చారు. టీడీపీ రాకతో వేధింపులు సార్వత్రిక ఎన్నికల సమయంలో గుత్తా లక్ష్మీనారాయణ మరో నలుగురు కలిసి టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. ఎన్నికల్లో కూటమి విజయం సాధించటంతో వైఎన్ఆర్ రాజుపాలెం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రాజుపాలెం ఎస్ఐ మూడు నెలల క్రితం పిలిచి మాట్లాడి సెటిల్ చేసుకోమని చెప్పారు. పగబట్టిన వైఎన్ఆర్ ఎలా అయినా సరే లక్ష్మీనారాయణను వేధించాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా పిడుగురాళ్లకు చెందిన తెలుగుదేశం నాయకులు ఖలీల్ రామారావు, పట్టిపాటి రామారావు, వంశీలను ఆశ్రయించారు. ఈ ముగ్గురు తెలుగుదేశం నాయకులకు పోలీసులతో ఉన్న పరిచయాలతో లక్ష్మీనారాయణను రోజూ పోలీస్ స్టేషన్కు పిలిపించారు. తాను వైఎన్ఆర్కు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఏమైనా డాక్యుమెంట్లు ఉంటే డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నానని పోలీసులతో తేల్చి చెప్పాడు. దీంతో ఆగ్రహించిన తెలుగుదేశం నాయకులు పంచాయతీని సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు వద్దకు తీసుకువచ్చారు. నువ్వు కమ్మోడివి కాదా.. రెడ్లకు పుట్టావా? సత్తెనపల్లి డీఎస్పీ కార్యాలయం నుంచి నాలుగు రోజుల క్రితం లక్ష్మీనారాయణకు పిలుపొచ్చింది. అక్కడికి వెళ్లగానే.. ‘నువ్వు కమ్మోడివి. నీకు ఆ పార్టీ (వైఎస్సార్సీపీ)తో పని ఏంటి? రాజకీయాలు చేసే స్థాయికి ఎదిగావా? రాజకీయాలు చేయాలంటే నీకు ఇక పార్టీలే లేవా? నువ్వు కమ్మోడివేనా.. నువ్వేమైనా రెడ్లకు పుట్టావా?’ అంటూ పోలీసులు నోటికి వచ్చినట్లు దూషించారు. ‘మర్యాదగా టీడీపీ నేతలు ఇవ్వాలంటున్న రూ.35 లక్షలు చెల్లిస్తే ఓకే. లేదంటే నా సంగతి ఎలా ఉంటుందో తెలుసుగా’ అంటూ డీఎస్పీ బెదిరిస్తూ హెచ్చరికలు చేశాడు. డీఎస్పీ టార్చర్ పెట్టడాన్ని భరించలేక మనస్థాపం చెందిన లక్ష్మీనారాయణ శుక్రవారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అనంతరం తను ఎదుర్కొన్న వేధింపులను వివరిస్తూ ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. అందులో ‘జగనన్నా.. నేను బతికుంటానో లేదో తెలియదు. ఈ పోలీసుల అరాచకాలకు చెక్ పెట్టాలి. వైఎస్సార్సీపీ అంటే చాలు టార్చర్ పెడుతున్నారు. దయచేసి మీరు నా శవాన్ని తాకి పాడె మోయాలి. నా కుటుంబాన్ని పరామర్శించాలి. అప్పుడైనా ఈ అరాచకాలకు చెక్ పడుతుందేమో. మళ్లీ నాలాంటోడు ఇంకొకడు బలి కాకుండా, నాలాంటి కుటుంబం బలి కాకుండా ఉంటుందేమో. నా చావుకు నేను రాజకీయం పులమడం లేదు. చచి్చపోతూ అబద్ధం ఆడనన్నా. కేవలం వైఎస్సార్సీపీ అని వేధిస్తున్నారన్నా’ అని వాపోయారు. ఈ మేరకు లేఖ కూడా రాశారు. లక్ష్మీనారాయణను బంధువులు గుంటూరుకు తరలించగా వెంటిలేటర్పై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. రెడ్బుక్ రాజ్యాంగంతో చావు బతుకుల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తడీఎస్పీ సహా బాధ్యులపై చర్య తీసుకోవాలిసీఎం చంద్రబాబును డిమాండ్ చేసిన వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రెడ్బుక్ రాజ్యాంగం అమలుతో వైఎస్సార్సీపీ కార్యకర్త చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని, అందుకు బాధ్యులైన డీఎస్పీతో సహా అందరిపైనా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి వైఎస్సార్సీపీ కార్యకర్త గుత్తా లక్ష్మీనారాయణ సెల్ఫీ వీడియో, లేఖతో సహా శుక్రవారం ఎక్స్లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం పెదనెమలిపురి గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణను పోలీసులు వేధించి, హింసించారు. ఆయనపై గతంలో వ్యాపార భాగస్వామి చేసిన ఆరోపణలకు సంబంధించి సత్తెనపల్లి సీఐ, ఎస్సై విచారించినప్పటికీ, లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు ఆ విషయాన్ని విడిచి పెట్టారు. కానీ, అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇదే విషయంపై 2 నెలల తర్వాత సత్తెనపల్లి డీఎస్పీ పిలిపించుకుని తీవ్ర వేధింపులకు దిగారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడివైనా నువ్వు వైఎస్సార్సీపీలో ఎందుకున్నావు.. అని డీఎస్పీ తీవ్రంగా అవమానపరిచారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తామని, డబ్బులు ఇవ్వాల్సిందేనని బెదిరించారు. దీంతో లక్ష్మీనారాయణ ఈ తెల్లవారు జామున (శుక్రవారం) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతూ డీఎస్పీ దుర్మార్గంపై వీడియో వాంగ్మూలం ఇచ్చాడు. బాధ్యులైన వ్యక్తుల పేర్లతో లేఖ కూడా రాశాడు. ఇప్పుడు చావు బతుకుల మధ్య గుంటూరు ఆస్పత్రిలో ఉన్నాడు. లక్ష్మీనారాయణ కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. లక్ష్మీనారాయణకు, ఆయన కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. ఈ ఘటనకు బాధ్యులైన డీఎస్పీ సహా మిగిలిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా’ అని ఆ పోస్ట్లో వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
మైనర్ బాలికపై టీడీపీ నేతల సామూహిక అత్యాచారం
రామగిరి: శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలో టీడీపీ నేతల కీచక పర్వం తాజాగా వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికపై టీడీపీ నేతలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఘటన సంచలనంగా మారింది. రామగిరిమండలం ఏడుగురాకలపల్లిలో ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు టీడీపీ నేత. ఈ క్రమంలోనే ఆ బాలికను లోబర్చుకుని నగ్న దృశ్యాలు చిత్రీకరించారు. ఆపై ఆ బాలికను బ్లాక్ మెయిల్ చేసి పలువురు టీడీపీ నేతలు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. దీనిపై ఆ బాలిక కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. దీనిపై ఆ బాధిత కటుంబంతో పాట దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఆ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తన్నారు. -
అక్రమ కేసు పెట్టి..
ఖాజీపేట: పోలీసుల వేధింపులు.. తప్పుడు కేసుకు ఒక నిండు ప్రాణం బలైపోయింది. వైఎస్సార్ సీపీ కార్యకర్త ఆత్మహత్యకు కారణమైంది. తీవ్ర మానసిక వేదనకు గురైన అతను ఏకంగా విద్యుత్ సబ్స్టేషన్లో కరెంటు తీగలు పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుని బంధువుల, స్థానికుల కథనం ప్రకారం.. వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలం దుంపలగట్టు గ్రామానికి చెందిన రెడ్యం శివలక్ష్మీనారాయణరెడ్డి పేకాట ఆడుతున్నట్లు అనుమానించి మే 6న ఖాజీపేట పోలీసులు స్టేషన్కు పిలిపించారు. అతనితోపాటు మరో 9 మందిని పిలిపించి విచారణ చేపట్టారు.తాము పేకాట ఆడలేదని వారు చెప్పినా.. పోలీసులు వినిపించుకోలేదు. రెడ్యం శివలక్ష్మీనారాయణరెడ్డిని పోలీసులు తీవ్రంగా వేధించారు. అనంతరం అతనితోపాటు విచారణకు వచ్చిన అందరినీ ఇంటికి పంపించారు. 7,8 తేదీల్లో స్టేషన్కు మళ్లీ విచారణ పేరుతో పిలిపించారు. 9న వారి పై పేకాట కేసుతోపాటు గంజాయి కూడా అమ్ముతున్నట్లు తప్పుడు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో రెడ్యం శివలక్ష్మీనారాయణరెడ్డి తోపాటు మరో 8 మందిని నిందితులుగా చూపుతూ, వారి వద్ద నుంచి 2.570 కిలోల గంజాయితోపాటు రూ 20,500 నగదు 52 పేకముక్కలు దొరికినట్లు చూపించారు. తనకు సంబంధంలేని గంజాయి కేసులో అరెస్టయిన శివలక్ష్మినారాయణరెడ్డి మే 29న బెయిల్పై బయటకు వచ్చారు.తన భార్య సుభాషిణికి జరిగిన విషయం వివరించారు. ఖాజీపేట సీఐ మోహన్ తనను అక్రమంగా పేకాట, గంజాయి కేసులో ఇరికించారని ఆవేదన చెందారు. తనను చిత్ర హింసలకు గురిచేసినట్లు చెప్పారు. తగిలిన దెబ్బలను భార్యకు చూపించి తీవ్ర మనోవేదన చెందారు. సీఐ మోహన్పై ప్రైవేటు కంప్లయింట్ వేసి కోర్డులోనే న్యాయం కోరదామని ఆమె నారాయణరెడ్డికి సర్ది చెప్పే యత్నం చేశారు. ఆయన బుధవారం మైదుకూరులో జరిగిన వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.జరిగిన అన్యాయాన్ని అక్కడ వైఎస్సార్సీపీ నాయకులకు చెప్పి బాధపడ్డాడు. తీవ్ర మనోవేదనతో రాత్రి 10 గంటలకు ఇంటి నుంచి బయటకు పోయి పుప్పగిరి వెళ్లే దారిలో ఉన్న సబ్స్టేషన్ మెయిన్ తీగలను పట్టుకుని విద్యుదాఘాతానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఎంతకూ ఇంటికి రాక పోవడంతో భార్యతోపాటు బంధువులు వెతికారు. చివరకు సబ్స్టేషన్లో విద్యుత్ తీగ పట్టుకుని చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. సీఐ మోహన్పై మృతుడి భార్య ఫిర్యాదుఖాజీపేట సీఐ మోహన్ తన భర్త నారాయణరెడ్డిని డబ్బుల కోసం, వేధించారని, డబ్బులు ఇవ్వక పోవడంతో అక్రమంగా కేసు నమోదు చేసి జైలుకు పంపి తన భర్త మృతికి కారణమయ్యాడని సుభాషిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త ఆత్మహత్యకు కారణమైన సీఐ మోహన్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విషయం తెలుసుకున్న మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి కడప మేయర్ సురేష్ బాబు ఎస్పీ అశోక్ కుమార్ను కలిశారు. సీఐది తప్పని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని నాయకులకు ఎస్పీ భరోసా ఇచ్చారు. అనంతరం దుంపలగట్టు గ్రామంలో జరిగిన లక్ష్మీనారాయణరెడ్డి అంత్యక్రియల్లో నాయకులు పాల్గొన్నారు. -
దళిత బాలికను చెరచిన టీడీపీ కీచకులు
అభం శుభం తెలియని బాలికను మానవ మృగాలు కనీ వినీ ఎరుగని రీతిలో దారుణంగా కాటేశాయి.. స్కూలుకెళ్లే పిల్లలను సైతం వదిలి పెట్టని దారుణ రోజులు దాపురించాయి.. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 14 మంది వంతు లేసుకుని.. వీడియో తీసి బెదిరిస్తూ.. బ్లాక్ మెయిల్ చేస్తూ.. వారికి ఇష్టం వచ్చినప్పుడల్లా బలాత్కారం చేయడం దిగ్భ్రాంతి పరుస్తోంది.. అధికారం అండ ఉండగా అడిగే వారు లేరని ఏకంగా ఆరు నెలల పాటు కీచక పర్వం కొనసాగించడం విస్తుగొలుపుతోంది.. తండ్రి లేని పిల్ల.. మతి స్థిమితం లేని తల్లి.. పైగా ఎస్సీ బాలిక.. ఏం చేస్తుందిలే అన్న కండ కావరం, అధికార మదంతో ఆ బరితెగింపు రాష్ట్రంలో దౌర్భాగ్య పాలనకు అద్దం పడుతోంది.. పాపం.. ఎవరికీ చెప్పుకోలేని దయనీయ పరిస్థితి ఆ బాలికది.. ఒకవేళ ఎవరికైనా చెప్పుకోవాలనుకుని దాచుకున్న కాసింత ధైర్యాన్ని సైతం ఆ దుర్మార్గులు పదేపదే బెదిరింపులతో చంపేశారు.. దుప్పటి పంచాయితీలు, రాయ‘బేరాలు’తో వెల కట్టే పనిలో పాలకులు బిజీగా ఉండటం దురదృష్టం.సాక్షి, టాస్క్ఫోర్స్ : అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలకు కేరాఫ్గా మారిన ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి ప్రాంతంలో మరో దుర్మార్గం చోటుచేసుకుంది. మాజీ మంత్రి పరిటాల సునీత స్వగ్రామం వెంకటాపురానికి కూతవేటు దూరంలోని ఏడుగుర్రాలపల్లిలో ఓ దళిత బాలికపై కొందరు టీడీపీ అల్లరి మూకలు కొన్ని నెలల పాటు పదే పదే అత్యాచారం చేశారు. వీడియోలు తీసి మరీ ఒకరి తర్వాత మరొకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం వెలుగు చూసింది. టీడీపీ నేతల ఒత్తిడితో ఇప్పటికే బాధిత బాలిక కుటుంబం ఊరి నుంచి ఎక్కడికో వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. పేరూరు పంచాయతీ పరిధిలోని ఏడుగుర్రాలపల్లిలో 9వ తరగతి చదువుతున్న దళిత విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన కొందరు యువకులు కన్నేశారు. ఏడాది క్రితం టీడీపీ గెలుపు సంబరాల్లో తప్పెట కొడుతూ బొలెరో నుంచి జారి కింద పడి తండ్రి మృతి చెందాడు. తల్లికి మతి స్థిమితం సరిగా లేదు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఆ విద్యార్థినిపై తొలుత కొందరు అత్యాచారం చేశారు. దాన్ని వీడియో తీశారు. ‘నీ వీడియో ఒకటి మా వద్ద ఉంది’ అంటూ బెదిరిస్తూ.. మరికొందరు లొంగదీసుకున్నారు. గత ఆరు నెలలుగా ఏకంగా 14 మంది ఆ చిన్నారిని ఆటబొమ్మను చేసి ఆడుకున్నారు. నిందితులందరూ టీడీపీకి చెందిన వారే కావడంతో మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరామ్ అండదండలు ఉన్నాయనే ఉద్దేశంతో స్థానికులు మౌనం వహించారు. గర్భం దాల్చిన బాలిక పోలీసులను ఆశ్రయించకుండా గ్రామంలోనే దుప్పటి పంచాయితీ చేసి మూసి పెట్టాలని చూస్తున్నట్లు సమాచారం. ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. ఇబ్బందులు తప్పవని టీడీపీ నేతల నుంచి బెదిరింపు కాల్స్ వెళ్లినట్లు తెలిసింది. వీడియో ఉందని బెదిరిస్తూ.. ఆర్నెల్ల కాలంలో పేరూరు పంచాయతీకి చెందిన 14 మంది యువకులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. నిందితుల్లో బడగొర్ల అభిషేక్, బూడిద రాజేష్, బాసి గిరి, బాసి కార్తీక్, బాసి రాజేంద్ర, బాసి సోనప్ప, బాసి అంజి, తలారి మురళి, రొద్దకంపల్లి మహేశ్, హరిజన సురేశ్, హరిజన హేమంత్ పేర్లు బయటపడ్డాయి. మరో ముగ్గురి పేర్లు తెలియాల్సి ఉంది. కాగా నిందితుల్లో కొందరు ఇప్పటికే గ్రామం వదిలి పరారయ్యారు.బాధిత కుటుంబం అదృశ్యంగురువారం మధ్యాహ్నం నుంచి సామూహిక అత్యాచారం విషయం ఆ నోటా.. ఈ నోటా తెలియడంతో బాధిత బాలిక కుటుంబ సభ్యులను టీడీపీ నేతలు బెదిరించినట్లు తెలిసింది. సాయంత్రం నుంచి గ్రామంలో బాధిత కుటుంబ సభ్యులు కనిపించలేదు. రామగిరి సీఐ శ్రీధర్ వెళ్లి విచారణ చేయగా.. బాధిత బాలిక ఇంటికి తాళం వేసి ఉంది. పోలీసుల సహకారంతో టీడీపీ నేతలే వారిని ఎక్కడికో తరలించారని గ్రామంలో చర్చ జరుగుతోంది. అబార్షన్ చేయించుకోవాలని బెదిరింపు?సదరు బాలిక అబార్షన్ చేయించుకుని.. ఎలాంటి కేసులకు వెళ్లకుండా ఉండాలని టీడీపీ నాయకులు కొందరు బెదిరించినట్లు తెలిసింది. ఈ క్రమంలో బాలికను ఎక్కడో టీడీపీ నాయకులే దాచి ఆస్పత్రికి తరలించి, అబార్షన్ చేయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అబార్షన్ చేయిస్తే ఎలాంటి కేసు లేకుండా మూసేయాలని పన్నాగం పన్నినట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. హరియాన్ చెరువుకు చెందిన రౌడీషీటర్ నాగరాజు కనుసన్నల్లో బాధిత బాలికను దాచినట్లు సమాచారం. పార్టీ కోసం ప్రాణాలు విడిచిన కుటుంబానికి అండగా నిలవాల్సిన పరిటాల కుటుంబం నిందితుల వైపు ఉందనే విషయంపై జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.ఎవరూ ఫిర్యాదు చేయలేదువిషయం నా దృష్టికి రాగానే గురువారం మధ్యాహ్నం ఏడుగుర్రాలపల్లి గ్రామానికి వెళ్లి విచారణ చేశాం. అయితే ఎవరూ వివరాలు చెప్పేందుకు ముందుకు రావడం లేదు. బాధిత బాలిక కుటుంబం నివసిస్తోన్న ఇంటికి తాళం వేసి ఉంది. వారి బంధువుల ఇళ్లన్నీ పరిశీలిస్తున్నాం. ఫిర్యాదు వస్తే ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు. వెనుక ఎవరు ఉన్నా చట్టానికి అతీతులు కారు.– శ్రీధర్, రామగిరి సీఐహోం మంత్రి సమాధానం చెప్పాలి దళిత బాలికపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి. దళిత, గిరిజనులపై రాష్ట్రంలో వరుసగా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో పాలన పూర్తిగా విఫలమైంది. కూటమి ప్రభుత్వంలో మహిళలకు.. బాలికలకు రక్షణ లేకుండా పోయింది. దళిత సామాజిక వర్గానికి చెందిన హోం మంత్రి అనిత ఇందుకు సమాధానం చెప్పాలి.– సాకే హరి, ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడుమహిళా సమాజం సిగ్గు పడేలా.. రాప్తాడు ఎమ్మెల్యే కూడా మహిళే. పైగా ఎమ్మెల్యే పరిటాల సునీత స్వగ్రామానికి సమీపంలోనే ఏడుగుర్రాలపల్లి ఉంది. చుట్టుపక్కల గ్రామాల్లో మహిళలకు కూడా రక్షణ కల్పించలేని ఎమ్మెల్యే ఉంటే ఏం? లేకుంటే ఏం? శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ కూడా మహిళే. ఈ కేసులో న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం.– తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే -
వైఎస్సార్సీపీ నేత దారుణ హత్య
ఓర్వకల్లు: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు, వైఎస్సార్సీపీ నాయకుడు రమేష్నాయుడు (45) దారుణహత్యకు గురయ్యారు. స్వగ్రామం నుంచి రాత్రి ఏడు గంటలకు మినరల్ వాటర్ కోసం నన్నూర్ నుంచి బైక్పై వస్తుండగా మీదివేముల సమీపంలోని దిగువయ్య దర్గా మలుపు వద్ద కాపుకాసిన గుర్తుతెలియని దుండగులు బైక్ను ఆపి రమేష్నాయుడుపై దాడిచేశారు. ఆయన బైక్ దిగి పారిపోయేందుకు ప్రయత్నించగా, వెంబడించి పొత్తికడుపుపై కత్తితో పొడిచారు. దీంతో రమేష్నాయుడు కిందపడిపోవడంతో ఆయన ముఖంపై బండరాయితో విచక్షణారహితంగా.. గుర్తుపట్టలేని విధంగా మోదడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యకు‡్ష్యలు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని రమేష్నాయుడు హత్య తీరును పరిశీలించి సీఐ చంద్రబాబునాయుడుతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని సీఐ చంద్రబాబునాయుడు తెలిపారు. రమేష్నాయుడికి భార్య లక్ష్మీదేవితో పాటు కొడుకు, కుమార్తె ఉన్నారు. తమ పార్టీ బుధవారం నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’లో ఆయన చురుగ్గా పాల్గొన్నారని, గ్రామంలో ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నందునే టీడీపీ వర్గీయులు ఓర్వలేక ఆయనను హత్యచేశారని నంద్యాల వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఆరోపించారు. గతంలో కూడా ఈయన ఇంటిపై దాడిచేశారన్నారు.రాజకీయ నేపథ్యం..రమేష్నాయుడు మొదటి నుంచి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డికి సన్నిహితంగా మెలిగేవారు. ఇతని కుటుంబం మీద నాయకులకు అపారమైన నమ్మకం ఉండడంతో 2014 స్థానిక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో దింపారు. ఆయన మంచితనం కారణంగా ప్రజలు గెలిపించారు. ఆ తర్వాత 2019లో విశేషమైన సేవలు అందించారు. రమేష్నాయుడు హత్యతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. హత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు. -
గుండ్లపాడు జంట హత్య కేసులో ఆరుగురి అరెస్ట్
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావు గురువారం వెల్లడించారు. ఈ కేసులో టీడీపీకి చెందిన తోట వెంకట్రామయ్య, జవిశెట్టి శ్రీనివాసరావు, తోట గురవయ్య, దొంగరి నాగరాజు, తోట వెంకటేశ్వర్లు, గెల్లిపోగు విక్రంలను ఈ నెల 4న సాయంత్రం వెల్దుర్తిలో అరెస్ట్ చేసినట్టు చెప్పారు.టీడీపీలో వర్గపోరు నేపథ్యంలో గత నెల 24న గుండ్లపాడుకు చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు (మొద్దయ్య), జవిశెట్టి కోటేశ్వరరావు హత్యకు గురైన విషయం విదితమే. వెంటనే ఘటనాస్థలానికి వెళ్లి ప్రాథమిక విచారణ జరిపిన ఎస్పీ శ్రీనివాసరావు చనిపోయిన, చంపిన వ్యక్తులు టీడీపీకి చెందిన వారేనని మీడియాకు వీడియో రూపంలో వివరించారు. మృతుల సమీప బంధువు తోట ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెల్దుర్తి పోలీసులు తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో మిగిలిన ముగ్గురు నిందితులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, పిన్నెల్లి వెంకటరెడ్డి ఆచూకీ కోసం గాలిస్తున్నామని, త్వరలో అరెస్ట్ చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు. పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసుజంట హత్యల కేసును వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిపై నెట్టాలన్న దురుద్దేశంతో పోలీసులు ఓ కట్టుకథ అల్లారు. హత్యలపై టీడీపీ నేత తోట ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదులో గ్రామ టీడీపీలో ఆధిపత్య పోరు వల్లే హత్యలు జరిగాయని తెలిపాడు. జవిశెట్టి వెంకటేశ్వర్లును హతమారిస్తే టీడీపీలో తనకు ఎదురుండదని, రానున్న సర్పంచ్ ఎన్నికల్లో పోటీ ఉండదన్న కారణంతోనే నిందితుడు తోట వెంకట్రామయ్య హత్య చేశాడని స్పష్టం చేశారు. ఆ తరువాత ఎలాగైనా పిన్నెల్లి సోదరులను కేసులో ఇరికించాలన్న దుర్బుద్ధితో కట్టుకథ అల్లారు. హత్యలో పాల్గొన్న నిందితులు జవిశెట్టి శ్రీను, తోట వెంకట్రామయ్య, తోట గురవయ్య, దొంగరి నాగరాజు హత్యానంతరం ప్రత్యక్ష సాక్షి తోట ఆంజనేయులును కారులోని కత్తులు తీసి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిజంగా కారులో కత్తులే ఉంటే.. జవిశెట్టి సోదరులను బండరాళ్లతో మోది ఎందుకు చంపుతారని, వారిని హత్య చేసేందుకు కత్తులే వాడేవారు కదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసుల ఎఫ్ఐఆర్, ప్రభుత్వ వైద్యుల పంచనామాలో ఎక్కడా కత్తులు వాడినట్టు పేర్కొనలేదు. ‘వచ్చేది మా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. మిమ్మల్ని బతకనివ్వం. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామరెడ్డి చెబితేనే మేం చేస్తున్నాం. మాకు ఏమైనా ఆపద వస్తే వాళ్లు చూసుకుంటారు’ అంటూ హత్యానంతరం నిందితులు కారులోంచి కతు్తలు చూపించి బెదిరిస్తూ వెళ్లిపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిజంగా హత్యకు పిన్నెల్లి సోదరులు కుట్ర పన్ని ఉంటే ఇలా చెబుతారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. ఇది కేవలం పిన్నెల్లి సోదరులను అక్రమంగా ఇరికించేందుకే ప్రభుత్వం, పోలీసులు పన్నిన కుట్రగా అర్థమవుతోంది. నిందితులు బెదిరించారన్న కట్టుకథలు తప్ప ఈ హత్యలో పిన్నెల్లి సోదరుల పాత్రపై ఎటువంటి ఆధారాలు దొరకలేదు. -
ఫోర్జరీ పోలీస్!
కాకినాడ క్రైం: తన స్థాయిని పెంచుకుని అడ్డగోలు దందాలకు పాల్పడేందుకు ఒక హెడ్ కానిస్టేబుల్ ఏకంగా డీఐజీ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. తనకు తానే ఎస్ఐగా ఐడీ కార్డును తయారు చేసుకున్నాడు. దాన్ని చూపించి ఎస్ఐగా చెప్పుకొంటూ చెలరేగిపోతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొప్పిశెట్టి యోగి కామేశ్వరరావు గవర్నమెంట్ రైల్వే పోలీస్ విభాగం(జీఆర్పీ)లో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు.రాజమహేంద్రవరం రైల్వే సబ్ డివిజన్లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన కొద్దికాలం కిందట రాష్ట్ర ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ డీఐజీ సంతకాన్ని ఫోర్జరీ చేసి తన పేరిట ఎస్ఐగా ఐడీ కార్డు తయారు చేసుకున్నాడు. దాన్ని చూపిస్తూ రాజమహేంద్రవరం రైల్వే సబ్ డివిజన్ పరిధిలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతోపాటు కాకినాడ, తుని, సామర్లకోట, అన్నవరం, రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లలో ఉద్యోగులపై అజమాయిషీ చేసేవాడు. కొన్ని కేసులను ఎస్ఐ హోదాలో సొంతంగా విచారణ చేసి డబ్బులు వసూలు చేయడం, చోరీ కేసుల్లోనూ రికవరీలు చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కాకినాడకు చెందిన ఓ జవాన్ తనను వేధిస్తున్నాడని అతని భార్య నగరంలోని దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జవాన్ సోదరుడైన రైల్వే కానిస్టేబుల్, అతని తల్లి పేర్లను కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. రైల్వే కానిస్టేబుల్పై ఫిర్యాదు చేయడంతో విచారణ కోసం జీఆర్పీ స్టేషన్కు పంపారు. దీంతో వివరాలు సేకరించేందుకు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ కామేశ్వరరావు... విచారణ పేరుతో రైల్వే కానిస్టేబుల్ భార్యను మరో ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి బెదిరించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు చేసిన జవాన్ భార్యను రైల్వే గెస్ట్ హౌస్కి అనధికారికంగా తీసుకెళ్లి విచారించడం వివాదాస్పదంగా మారింది. అదే సమయంలో కామేశ్వరరావు నకిలీ ఐడీ కార్డు చూపించి తాను ఎస్ఐని అని బెదిరించాడని రైల్వే కానిస్టేబుల్ భార్య కాకినాడ టూ టౌన్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు డీఐజీ సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. మరికొందరు కూడా అతనిపై జీఆర్పీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో నకిలీ ఐడీ కార్డును ఎక్కడెక్కడ ఉపయోగించారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.కామేశ్వరరావుపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేయాలని అనకాపల్లి జిల్లా ఎస్పీకి జీఆర్పీ అధికారులు సిఫార్సు చేశారు. రైల్వే నుంచి తిరిగి అతని మాతృవిభాగమైన అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయానికి బుధవారం పంపించారు. అతనికి సహకరించిన మరికొందరిని కూడా జీఆర్పీ నుంచి బదిలీ చేశారు. విశాఖ రేంజ్కి చెందిన స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఈ నెల ఒకటో తేదీన కాకినాడ వచ్చి కామేశ్వరరావుపై ఫిర్యాదు చేసిన బాధితుల నుంచి వివరాలు సేకరించారు. కామేశ్వరరావుపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేస్తున్నామని, బాధితులు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని కాకినాడ జిల్లా అదనపు ఎస్పీ ఎంజేవీ భాస్కరరావు తెలిపారు. -
కుప్పం దొంగల ముఠా కేసులో కీలక పురోగతి
సాక్షి, చిత్తూరు: కుప్పంలో పోలీసుల మీదకే వాహనంతో దూసుకెళ్లిన దొంగల ముఠా కోసం గాలింపు కొనసాగుతోంది. ఆ ముఠాలో ఐదుగురు సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి పోలీసులు పురోగతి సాధించారు.కుప్పం రైల్వే స్టేషన్లో ముఠా సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం పుష్పుల్ రైలులో బెంగళూరు వెళ్లే ప్రయత్నంలో ఉండగా.. అదుపులోకి తీసుకున్నారు. అతని ద్వారా మిగిలిన ముఠా సభ్యుల ఆచూకీ కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. కరుడుగట్టిన దొంగల ముఠా ఒకటి సరిహద్దు దాటుతున్నారనే సమాచారంతో కుప్పం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో కృష్ణగిరి-పలమనేరు జాతీయ రహదారిపై ఉన్న తంబిగానిపల్లె చెక్పోస్టు వద్ద పోలీసులను చూసి దుండగులు తమ కారుతో తొక్కించేందుకు విఫలయత్నం చేశారు. వెంటనే కానిస్టేబుళ్లు పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో తప్పించుకున్న వారిని నిలువరించేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కారు నడుపుతున్న డ్రైవర్ తొడకు బుల్లెట్ గాయమైంది. అయినా కూడా ఆ ముఠా తప్పించుకుంది. కొద్దిదూరం వెళ్లాక కారును వదిలేసి ఆ ముఠా సభ్యులు పరారైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కుప్పం డీఎస్పీ పార్థసారథి మాట్లాడుతూ హత్యాయత్నం కింద దొంగలపై కేసు నమోదు చేశారు. పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి సమీప ప్రాంతాల్లో దొంగల కోసం జల్లెడ పడుతున్నారు. కుప్పం పరిధిలోని పలు గ్రామాల్లో డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్తో గాలింపు చేపట్టారు. ఆ ముఠాలో హర్యానా, రాజస్థాన్ ముఠా సభ్యులు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. హిందీలో మాట్లాడుతూ ఎవరైనా అనుమానాస్పద రీతిలో ఎవరైనా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. -
ఏయ్.. నేను ఎవర్నో తెలుసా?
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఆమె వితంతువు. మరో వ్యక్తితో రిలేషన్షిప్లో ఉంది. అయితే ఆ ప్రియుడి సాయంతోనే తన అత్తమామలను హతమార్చేెందుకు ప్రయత్నించి పట్టుబడి పోయింది. ఆ ప్రియుడేమో ‘‘ఏయ్.. నేను ఎవర్నో తెలుసా?. నా బ్యాక్గ్రౌండ్ తెలుసా?.. జనసేన లీడర్ని, ఇక్కడి ఎమ్మెల్యే పీఏని’’ అంటూ ఊరి జనంపైనే బెదిరింపులకు దిగాడు. నందిగామ మండలం అనాసాగరం గ్రామంలో చోటు చేసుకున్న ఘటన వివరాల్లోకి వెళ్తే.. మమత అనే మహిళ భర్త ఐదేళ్ల కిందట బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె అత్తమామల దగ్గరే ఉంటూ వస్తోంది. అయితే గత కొంతకాలంగా కర్రి హనుమంతరావు అనే వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. విషయం తెలిసి పెద్దలు ఆమెను మందలించారు. దీంతో కోపం పెంచుకున్న ఆమె ఏకంగా వాళ్ల అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నించింది. ఈ క్రమంలో.. ప్రియుడు హనుమంతరావుతో కలిసి అత్తమామలను హతమార్చేందుకు ప్లాన్ వేసింది. గత రాత్రి మరో వ్యక్తితో కలిసి వచ్చిన హనుమంతరావు.. కొబ్బరి కాయలు కొట్టే కత్తితో వెంకటేశ్వర్లు, మంగమ్మలపై దాడి చేయబోయాడు. దీంతో వాళ్లు పెద్దగా కేకలు వేయగా చుట్టుపక్కల వాళ్లు అప్రమత్తమయ్యారు. ఈ పరిణామంతో షాక్ తిన్న హనుమంతరావు పారిపోయే యత్నం చేయగా.. గ్రామస్తులు వెంబడించి పట్టుకున్నారు. ఆ సమయంలో తాను.. జనసేన లీడర్నని, నందిగామ ఎమ్మెల్యే పీఏ వాళ్లను బెదిరించే ప్రయత్నం చేశాడు. అయితే గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వచ్చారు. పోలీసులకు గ్రామస్తులకు మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. చివరకు.. హనుమంతరావు ఫోన్లోని ఫొటోలు, ఇతర వివరాల ఆధారంగా పోలీసులు జనసేన నేతగా నిర్ధారించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి కత్తిని స్వాధీనం చేసుకుని.. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. -
ఏపీ కేంద్రంగా ప్ర‘మాదక’ర దందా!
పోలీసు వ్యవస్థ ప్రభుత్వం చేతిలో ఉంది. కూటమి సర్కారు వచ్చి ఏడాదవుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే మద్యం, గంజాయి దందాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. సర్కారే బెల్టుషాపులను ప్రోత్సహిస్తోంది. పర్మిట్ రూంలకు ఇష్టానుసారం అనుమతులిచ్చేస్తోంది. దీనికితోడు ఇప్పుడు డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లో రూ.కోటి విలువైన కొకైన్ పట్టుబడిన కేసులో ప్రధాన నిందితుడిగా ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఉండడం కూటమి ప్రభుత్వం, పోలీసుశాఖ వైఫల్యానికి నిదర్శనం. దీనికి బాధ్యత తీసుకోవాల్సిన కూటమి సర్కారు ప్రతిపక్ష ఎంపీపై ఎదురుదాడికి దిగడం నిజంగా సిగ్గుచేటు.. హాస్యాస్పదం.. జీడిమెట్ల(హైదరాబాద్)/తిరుపతిక్రైమ్: తిరుపతి నుంచి హైదరాబాద్కు కొకైన్, ఎఫిడ్రిన్ వంటి మత్తు పదార్థాలు తీసుకువచ్చి అమ్మేందుకు యత్నించిన ఐదుగురు సభ్యుల ముఠాను బాలానగర్ ఎస్వోటీ, కూకట్పల్లి పోలీసులు పట్టుకున్నారు. ఏపీలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ప్రధాన నిందితుడు గుణశేఖర్ పరారీలో ఉన్నాడు.వీరి వద్ద రూ.కోటి విలువచేసే 820 గ్రాముల కొకైన్, ఎఫిడ్రిన్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం హైదరాబాద్ షాపూర్నగర్లోని డీసీపీ కార్యాలయంలో ఇన్చార్జి డీసీపీ ఎన్.కోటిరెడ్డి, ఎస్వోటీ డీసీపీ డి.శ్రీనివాస్ తదితరులు కలిసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్నేహితుడి చేత డ్రగ్స్ తరలింపు తిరుపతికి చెందిన గుణశేఖర్ ఏపీలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అతని స్నేహితుడు ఉన్నం సురేంద్రకు డబ్బు ఆశచూపి మే 29న 820 గ్రాముల కొకైన్, ఎఫిడ్రిన్ డ్రగ్స్ ఇచ్చి తిరుపతి నుంచి హైదరాబాద్కు పంపించాడు. గుణశేఖర్ చెప్పినట్లుగానే సురేంద్ర కొకైన్ తీసుకుని గుంటూరు మీదుగా నగరంలోని కూకట్పల్లికి చేరుకున్నాడు. ఇక్కడ సురేంద్ర తన మనుషులైన బాపట్ల జిల్లాకు చెందిన దోతిరెడ్డి హరిబాబురెడ్డి, దేవరాజు యేసుబాబులను హైదరాబాద్ రప్పించాడు. అదేవిధంగా చేగూడి మెర్సి మార్గరెట్, షేక్ మస్తాన్ వలీలను సైతం పిలిపించుకున్నాడు. అందరూ కలిసి కూకట్పల్లిలోని జయనగర్లో కలుసుకున్నారు. జూన్ 2న పోలీసులు బిజీగా ఉంటారని.. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న పోలీసులు బిజీగా ఉంటారని భావించి ఆ రోజే కొకైన్ అమ్మేందుకు పథకం వేశారు. ఈ మేరకు ఐదుగురు కూకట్పల్లి భాగ్యనగర్ వైపు వెళ్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు వారిని ఆపి తనిఖీ చేయగా కొకైన్ లభించింది. వెంటనే ఐదుగురిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించి విచారించగా అసలు బండారం బయటపెట్టారు. అసలు డ్రగ్స్ వీరికి ఎక్కడ నుంచి వచ్చిoదనే విషయం తెలియలేదు. ప్రధాన నిందితుడు గుణశేఖర్ పోలీసులకు పట్టుబడితే అసలు విషయాలు బయటకు వస్తాయి. సమావేశంలో కూకట్పల్లి ఏసీపీ రవికుమార్, ఇన్స్పెక్టర్ రాజేశ్, బాలానగర్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎస్సై కట్కం గౌతం పాల్గొన్నారు. పోలీస్శాఖ ఆరా గుణశేఖర్ తిరుపతిలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఇతను పంపిన మనుషులు డ్రగ్స్తో హైదరాబాద్లో పట్టుబడడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఘటనపై పూర్తిస్థాయిలో ఆరా తీస్తోంది. దీనిపై తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో మాట్లాడగా.. గుణశేఖర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని చెప్పారు. పోలీస్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఇలా చేయడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కానిస్టేబుల్ గుణశేఖర్కు తిరుపతి ఎంపీ గురుమూర్తికి సంబంధాలు అంటగట్టే యత్నాలు జరుగుతుండడం అందరినీ విస్తుగొలుపుతోంది. కొన్ని నెలల క్రితం గుణశేఖర్ ఎంపీ వద్ద కొద్ది రోజులు గన్మేన్గా ఉద్యోగం నిర్వహించాడు. దానిని సాకుగా తీసుకుని ఈ కేసును ఎంపీకి అంటగట్టాలని కూటమి నేతలు యత్నించడం కుట్రపూరితమే. -
ప్రకాశం: మర్రిపూడి ఎస్ఐ దౌర్జన్యం కేసులో ట్విస్ట్
సాక్షి, ప్రకాశం జిల్లా: రెడ్బుక్ రాజ్యాంగంలో సామాన్యుల పట్ల పోలీసుల దాడులు పెరిగిపోతున్నాయి ప్రకాశం జిల్లా కొండపి మండలం జాళ్లపాలెంలో మర్రిపూడి ఎస్ఐ ఎ.రమేష్బాబు మహిళపై దౌర్జన్యం చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధితులపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంట్లోకి చొరబడి మహిళపై చేయివేసి విసిరిపడేసి.. అమర్యాదగా ప్రవర్తించిన ఎస్సై రమేష్ బాబును ఎస్పీ వెనుకేసుకొచ్చారు.బాధితులపైనే కేసులు పెడుతున్నట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ మీడియా ముందు ప్రకటించారు. దళిత ఎస్ను అడ్డగించి విధులకు ఆటంకం పరిచారంటూ ఇద్దరు మహిళలతో పాటు ఇంటి యజమాని మారంరెడ్డి కొండలరావుపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.కాగా, ఈ కేసులో జాళ్లపాలెం గ్రామానికి చెందిన మారంరెడ్డి కొండలరావు అదేరోజు కొండపి పోలీస్స్టేషన్కు, ఎస్పీ ఏఆర్ దామోదర్కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోవటంతో సోమవారం జిల్లా ఎస్పీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం.. జాళ్లపాలెంలో మారంరెడ్డి కొండలరావు నిర్వహిస్తున్న కిరాణా దుకాణంలో సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్నారు. గత నెల 28న కొండపి మండలం పెట్లూరు శివాలయంలో రూ.7 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులు, జరుగుమల్లి మండలం ఎన్ఎన్ కండ్రిక పంచాయతీ కొత్తపాలెం అంకమ్మ తల్లి ఆలయంలో రూ.70 వేల విలువైన వెండి వస్తువులు, హుండీలో సుమారు రూ.20 వేల నగదు చోరీకి గురయ్యాయి.ఈ కేసుల విచారణలో భాగంగా మర్రిపూడి ఎస్ఐ రమేష్బాబు జాళ్లపాలెం వెళ్లారు. కొండలరావు షాపు వద్ద సీసీ కెమెరా ఉన్నట్టు తెలుసుకుని అతడి కుటుంబ సభ్యులను సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించాలని కోరారు. వారు యజమాని కొండలరావు లేరని చెప్పగా.. ఎస్సై రమేష్బాబు వెంటనే కొండలరావు కుమారుని ద్వారా ఫోన్ చేయించి అతడితో మాట్లాడారు. కొండలరావు ఎస్ఐతో మాట్లాడుతూ తాను ఊళ్లో లేనని, సాయంత్రం వస్తానని, పెన్డ్రైవ్ ఇస్తే సీసీ ఫుటేజీ కాపీ చేసి పంపిస్తానని మర్యాదపూర్వకంగా చెప్పారు.దీంతో ఎస్ఐ రమేష్బాబు తాను స్వయంగా సీసీ కెమెరా ఫుటేజీ చెక్ చేసుకుంటానని చెప్పడంతో ‘సార్ మీరు నా ఇంట్లోకి వెళ్లడానికి వీల్లేదు. మీ మీద నాకు నమ్మకం లేదు’ అని చెప్పాడు. దీంతో అహం దెబ్బతిన్న ఎస్సై ‘మా మీద నమ్మకం లేదా’ అనడంతో కొండలరావు ‘నమ్మకం లేదు. గత ఏడాది నవంబర్లో మర్రిపూడి మండలం జగ్గరాజుపాలెం పెట్రోల్ బంకులో నాపై దాడి జరిగిందని ఫిర్యాదు చేస్తే నన్ను మూడు గంటలపాటు నిలువరించటమే కాక మీరు నేరస్తుల పక్షాన నిలబడి నాపై తప్పుడు కేసు పెట్టమని సలహా ఇచ్చారు.నేటి వరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు’ అనడంతో ఎస్ఐ ఫోన్ కట్ చేశారు. తరువాత కొండలరావు కుటుంబ సభ్యులపై ఎస్ఐ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ఎంత పొగరు. తలుపులు వేసేస్తారా’ అని తలుపులు నెట్టుకుంటూ షాపులోకి వెళ్లి కుటుంబ సభ్యులను కొట్టారు. షాపులో ఉన్న కొండలరావు చెల్లెలు చంద్రమ్మను చేతితో నెట్టుకుంటూ ఆమెను దూషిస్తూ బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి సీసీటీవీ ఎన్వీఆర్, మొబైళ్లు, పెన్డ్రైవ్లు జేబులో వేసుకుని వెళ్లిపోయారు. ఈ ఘటనపై కొండలరావు కొండపి పోలీస్స్టేషన్లోను, ఎస్పీకి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. అయినా ఇంతవరకు న్యాయం జరగలేదని, తక్షణమే విచారించి న్యాయం చేయటంతో పాటు దోషులను శిక్షించి తమ వద్ద లూటీ చేసిన ఆస్తులను రికవరీ చేసి ఇప్పించాలని మరోమారు ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
డైవర్షన్ గమనించలేదా?
రంగంపేట/రాజానగరం/రాజమహేంద్రవరం రూరల్: అప్పటి వరకూ ఆనంద సాగరంలో ఓలలాడిన వారిన్ని విధి చిన్నచూపు చూసింది.. కొద్దిసేపటిలో ఇంటికి చేరుకునేవారే.. అయినవారితో సంతోషంగా గడిపేవారే.. కానీ, అంతలోనే వారిపై మృత్యువు పంజా విసింది.. రహదారిపై మృత్యుఘోష ప్రతిధ్వనించింది.. రంగంపేట మండలం వడిశలేరు వద్ద ఏడీబీ రోడ్డుపై జరిగిన ఘోర ప్రమాదం రెండు కుటుంబాల్లో ఎప్పటికీ తీరని విషాదాన్ని నింపింది. అయినవారందరినీ శోక సంద్రంలో ముంచింది.ఏం జరిగిందంటే..ఈ ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు, గాయ పడిన వారు దగ్గర బంధువులు. రాజానగరం మండలం రఘుదేవపురానికి చెందిన రేలంగి శివన్నారాయణ (40), ఆయన భార్య దేవీ లలిత (34), కుమార్తెలు వర్షిత (13), హర్షితతో పాటు.. రాజమహేంద్రవరం రూరల్ మండలం కవలగొయ్యి గ్రామానికి చెందిన శివన్నారాయణ బావమరిది తీగిరెడ్డి శివ (30), ఆయన భార్య భవాని, వారి కుమార్తె సాన్వి (4) కలసి కారులో సోమవారం కాకినాడ బీచ్కు వెళ్లారు. అక్కడ ఆనందంగా గడిపారు. తిరిగి వస్తున్న క్రమంలో వడిశలేరు గ్రామ సమీపాన హెచ్పీ పెట్రోలు బంకు వద్ద వారు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న పాల ట్యాంకర్ను వేగంగా ఢీకొంది. ఆ వేగానికి కారు సగ భాగం ట్యాంకర్లోనికి చొచ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న శివన్నారాయణ (40), దేవీ లలిత (34) దంపతులు, వారి కుమార్తె వర్షిత (13), తీగిరెడ్డి శివ (30), ఆయన కుమార్తె సాన్వి (4) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వెనుక సీటులో కూర్చున్న శివ భార్య భవాని, శివన్నారాయణ కుమార్తె హర్షిత తీవ్రంగా గాయపడ్డారు. వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కల్లు గీతపై ఆధారపడి ఈ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. శివ తండ్రి సూరిబాబు గత ఏడాది తాటిచెట్టు పైనుంచి పడి, మంచాన ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ ఘోరం జరగడం ఆయా కుటుంబాలను తీవ్రంగా కలచివేస్తోంది. సరదాగా బీచ్కు వెళ్లి వస్తామని చెప్పి వెళ్లిన వారు ఇలా కనుమరుగైపోతారనుకోలేదంటూ మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ప్రమాదంతో రెండు గ్రామాల్లోనూ విషాద ఛాయలు అలముకున్నాయి.డైవర్షన్ గమనించలేదా?ఏడీబీ రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరిస్తున్నారు. ఈ పనుల నేపథ్యంలో వడిశలేరు హెచ్పీ పెట్రోల్ బంకు వద్ద అటుగా వెళ్లాల్సిన ట్రాఫిక్ను పక్క మార్గంలోకి మళ్లిస్తూ డైవర్షన్ ఇచ్చారు. దీనికి కొద్ది దూరంలోనే పాల ట్యాంకర్ ఆగి ఉంది. ప్రమాద సమయానికి శివన్నారాయణ కారు నడుపుతున్నారు. ఆయన ఆగి ఉన్న ట్యాంకర్ను, డైవర్షన్ను గమనించకుండా వేగంగా దూసుకుని రావడం వల్లనే ఈ ఘోరం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జయిపోయింది. రహదారిపై డైవర్షన్ను గమనించి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండకపోవచ్చని స్థానికులు భావిస్తున్నారు. ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్, అడిషనల్ ఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణ, అడిషనల్ ఎస్పీ (క్రైం) ఎల్.అర్జున్, రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ డీఎస్పీ బి.విద్య, అనపర్తి సీఐ సుమంత్ సందర్శించారు. మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాలను చూసి బంధువులు, కవలగొయ్యి, రఘునాథపురం గ్రామస్తులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వాసుపత్రి వద్ద కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి. రంగంపేట పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.ఆధార్ ఇబ్బందులు తొలగిపోతాయనుకుంటే..మృతుడు శివన్నారాయణ కుమార్తెలు హర్షిత, వర్షితలు కవల పిల్లలు. 13వ సంవత్సరంలోకి వచ్చారు. ఇద్దరూ ఒకే రూపంలో ఉండటంతో ఆధార్ అయ్యేది కాదు. ఈ క్రమంలో కాకినాడలో ఇందుకు సంబంధించిన పని చేసే వారున్నారని వారికి తెలిసింద. బీచ్లో సరదాగా గడిపిన అనంతరం వారు హర్షిత ఆధార్ పని పూర్తి చేసుకోవాలని వెళ్లారు. తిరిగి వచ్చే సమయంలో ఈ కవలల్లో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఆధార్ ఇబ్బందులు తొలగిపోతాయనుకుంటే ఇలా జరిగిందంటూ వారి బంధువులు కన్నీటి పర్యంతమవతున్నారు. -
పాముకాటుతో మహిళ మృతి
ఇచ్ఛాపురం టౌన్(శ్రీకాకుళం): మున్సిపాలిటీలోని అమీన్సాహెబ్పేటలో ఆదివారం రాత్రి తలగాన పూజ(27), వంజరాన జయరాం, గీత కృష్ణవేణిలు నిద్రిస్తున్న సమయంలో పాము కాటు వేయడంతో తలగాన పూజ మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతురాలి బంధువులు ఇచ్చిన సమాచారం ప్రకారం కవిటి మండలం శావసానపుట్టుగ గ్రామానికి చెందిన తలగాన పూజ అమీన్సాహెబ్ పేటలో జరుగుతున్న ఆలయ ప్రతిష్టకు అమ్మమ్మ గారింటికి వచ్చింది. దీనిలో భాగంగా కుటుంబ సభ్యులతోపాటు అర్థరాత్రి వరకు సాంస్కృతిక కార్యక్రమాలు చూశారు. అనంతరం ఇంటికి వెళ్లగా ఉక్కగా ఉండడంతో ఇంటి వరండాలో పడుకున్నారు. అయితే ఆ సమయంలో వారి ముగ్గురినీ పాముకాటు వేసింది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ముగ్గురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బరంపురం తరలిస్తుండగా మార్గమధ్యలో తలగాన పూజ మృతి చెందినట్లు తెలిపారు. వంజరాన జయరాం, గీత కృష్ణవేణిలకు ఐసీయూ ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. మృతురాలి భర్త తలగాన శంకర్ రోజుకూలీ చేస్తూ జీవిస్తుంటారు. -
కర్నూలు జిల్లాలో మరో సీఐ వేధింపులు.. వైఎస్సార్సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
సాక్షి టాస్క్ఫోర్స్: టీడీపీ కూటమి నాయకులు పోలీసులను ఇష్టారాజ్యంగా వాడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి వైఎస్సార్సీపీ సానుభూతిపరులు, కార్యకర్తలను బెదిరించి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. తెనాలి పోలీసుల మాదిరిగానే కర్నూలు జిల్లా పత్తికొండ సీఐ వేధింపులు, బెదిరింపులు తట్టుకోలేక మండల పరిధిలోని దూదేకొండ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త పి.ప్రవీణ్కుమార్ ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. మరోవైపు బాధితుడు తనకు జరిగిన అన్యాయంపై హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఉద్దేశిస్తూ సెల్ఫీ వీడియో తీశాడు. పోలీస్స్టేషన్లో బెదిరింపులు.. రెండేళ్ల క్రితం దూదేకొండ గ్రామానికి చెందిన తలారి కృష్ణమూర్తి నుంచి రూ.10 వడ్డీతో ప్రవీణ్కుమార్ రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. రూ.50 వేలు చెల్లించాడు. ఇంకా రూ.50 వేలు చెల్లించాల్సి ఉంది. అయితే, కృష్ణమూర్తికి మద్దతుగా మాజీ ఎంపీటీసీ మునిలక్ష్మి కుమారుడు రంగస్వామి, రంగన్న ఇద్దరు కలిసి పోలీసుస్టేషన్కు వచ్చి అధికార పార్టీ నాయకుల సహకారంతో సీఐ జయన్నపై ఒత్తిడి తీసుకొచ్చారు. ప్రవీణ్కుమార్ వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు కావడంతో వారు ఒత్తిడి పెంచారు. పైగా.. గతంలో కొంత చెల్లించినా కూడా మళ్లీ అప్పు ఉన్నట్లుగా ప్రామిసరి నోటు రాయించారు. మిగిలిన బాకీ రూ.50వేలు తనకిస్తే అప్పు ఇచ్చిన వారికి తాను ఇచ్చి సెటిల్చేస్తానని సీఐ కొద్దిరోజుల క్రితం చెప్పారు. అలాగే, పొలం అమ్మకానికి సంబంధించిన మరో అంశంలో కూడా ప్రవీణ్కుమార్ వేరొకరికి ఇవ్వాల్సిన రూ.లక్ష నగదు, తలారి కృష్ణమూర్తికి ఇవ్వాల్సిన రూ.50వేలు మే 31లోగా చెల్లించకపోతే రౌడీషిట్ ఓపెన్ చేస్తానని పచ్చిబూతులు తిడుతూ బెదిరించారు. అంతేకాక.. గతంలో జరిగిన ఇంటి గొడవలో ఎలాంటి విచారణ చేపట్టకుండానే ప్రవీణ్కుమార్, అతని భార్యపై కేసు నమోదు చేశారు. జేఎం తండా, హోసూరుకు చెందిన ఇద్దరి వద్ద చీటీ విషయమై రాసుకున్న ప్రామిసరీ నోటుకు బదులుగా పోలీసుస్టేషన్లో మరో ప్రామిసరీ నోటు బలవంతంగా రాయించారు. ఇలా కక్షపూరితంగా టార్గెట్ చేసి వేధిస్తుండడాన్ని భరించలేక తాను పురుగుల మందు తాగినట్లు బాధితుడు ప్రవీణ్కుమార్ చెప్పాడు. -
జీతాలు రాక.. ఎంటీఎస్ టీచర్ ఆత్మహత్య
కోరుకొండ: టీడీపీ కూటమి ప్రభుత్వంలో జీతాలు సక్రమంగా అందకపోవడంతో తూర్పుగోదావరి జిల్లాలోని మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) టీచర్ బలవన్మరణానికి పాల్పడ్డారు. కోరుకొండ మండలం పశ్చిమ గానుగూడేనికి చెందిన కన్నాబత్తుల విజయకుమార్ (43) కాపవరం మండల పరిషత్ పాఠశాలలో ఎంటీఎస్ టీచర్గా పనిచేస్తున్నారు. మే నెలలో జీతాలు అందకపోవడంతో అప్పులపాలై, ఆర్థిక సమస్యలతో మానసిక వేదనకు గురై ఆదివారం రాత్రి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ హుక్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు. పిల్లలు ఇంటర్మిడియెట్ చదువుతున్నారు. విజయకుమార్ 2008 డీఎస్సీలో ఎంపికై, నాలుగేళ్లుగా సర్విసులో ఉన్నారు. ఆ టీచర్లకు సక్రమంగా జీతాలు లేకే సమస్యలు.. 1998, 2008 సంవత్సరాల్లో టీచర్లుగా చేరిన వారికి ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం రెగ్యులర్గా జీతాలు ఇవ్వకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఉద్యోగానికి ఎంపికైనా కూడా వారికి 16 సంవత్సరాలుగా ఉద్యోగాలివ్వలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 1998, 2008 సంవత్సరాల్లో డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులకు ఎంటీఎస్ టీచర్లుగా అవకాశం కల్పించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వీరికి సరిగా వేతనాలు ఇవ్వడం లేదు. వారిలో పలువురు వయస్సు రీత్యా వివిధ వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పలువురు రిటైర్మెంట్ వయస్సుకు చేరుకుంటూ, కుటుంబ పోషణ కష్టమై, ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.సమస్యలు పరిష్కరించాలి.. ఉద్యోగ భద్రత కల్పించడంలో విఫలమవుతున్న కూటమి ప్రభుత్వం నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషిచేయడంలేదు. ఎంటీఎస్ టీచర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఆత్మహత్యలను అరికట్టాలి. – కె.చంద్రశేఖర్రెడ్డి, రాష్ట్ర కన్వీనర్, ఎంటీఎస్ టీచర్స్ అసోసియేషన్రెగ్యులరైజ్ చేయాలి.. ఎంటీఎస్ టీచర్లను బేషరతుగా రెగ్యులరైజ్ చేయాలి. వారి కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలి. ఒత్తిడి లేకుండా విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించాలి. – బైరెడ్డి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, ఎంటీఎస్ టీచర్స్ అసోసియేషన్ కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి.. టీచర్ల ఆత్మహత్యలకు టీడీపీ కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. వసతుల కల్పనలో, జీతాలందించడంలో ప్రభుత్వం విఫలమైంది. – మార్తార్ బాల్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంటీఎస్ టీచర్స్ అసోసియేషన్ -
కాళ్లు, చేతులు కట్టేసి..కడపలో వ్యక్తి దారుణ హత్య
కడప అర్బన్: కడప నగరం చిన్నచౌక్ పోలీస్స్టేషన్ పరిధిలోని అశోక్నగర్లో మసీద్ వీధిలో ఆదివారం సాయంత్రం సయ్యద్ చాంద్బాషా (36) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటనపై అతని తల్లి సయ్యద్ జుబేదా, పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప నగరంలోని రామకృష్ణ నగర్లో నివాసం వుంటున్న సయ్యద్ జుబేదా చిన్నకుమారుడు సయ్యద్ చాంద్బాషాకు, అశోక్నగర్ మసీద్ వీధిలో నివాసం వుంటున్న షేక్ మహబూబ్ బాషా కుమార్తె ఆయేషాకు 9 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారులు సంతానం. చాంద్బాషా ఆటోడ్రైవర్గాను, ఎలక్ట్రికల్ పనులు, ఇంకా తనకు వచ్చిన పనులను చేసుకుంటూ జీవనం సాగించేవాడు. భార్య ఆయేషా కడప నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తోంది. ఈ క్రమంలో వివాహమైనప్పటి నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. అతను అశోక్నగర్లోనే తన అత్తగారింటికి సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని వుండేవాడు. వీరి మధ్య మనస్పర్థలు తీవ్రం కావడంతో పోలీసుస్టేషన్, కేసుల దాకా వెళ్లారు. గత ఆరునెలల నుంచి ఆయేషా తన పుట్టింటిలోనే వుంటూ పిల్లలను తనదగ్గరే పెట్టుకుంది. ఈ క్రమంలో పరస్పరం ఘర్షణ పడుతూనే వున్నారు.20 రోజుల క్రితం ఆయేషా తండ్రి షేక్ మహబూబ్ బాషా కువైట్ నుంచి వచ్చాడు. ఒకసారి తన అల్లుడు సయ్యద్ చాంద్బాషాపై హత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం చాంద్బాషా తల్లి జుబేదాకు దావత్ ఉందని చెప్పి వెళ్లాడు. తన అత్తారింటికి సమీపానికి వెళ్లాడు. ఆ సమయంలో మామ షేక్ మహబూబ్బాషా, వారి కుటుంబ సభ్యులు సయ్యద్ చాంద్ బాషాను తమ ఇంటికి తీసుకుని వెళ్లారు. చేతులు, కాళ్లను తాళ్లతో కట్టేసి, కత్తి, కొడవలితో దారుణంగా నరికి హత్య చేశారు. రక్తపుమడుగులో పడివుండగా ప్రధాన నిందితుడైన షేక్ మహబూబ్బాషా, ఇతర కుటుంబ సభ్యులు పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, చిన్నచౌక్ సీఐ ఓబులేసు, ఎస్ఐ రవికుమార్, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు.మామ, కుటుంబ సభ్యులే మా కుమారుడిని పొట్టన పెట్టుకున్నారు– హతుని తల్లి జుబేదా తన కుమారుడు సయ్యద్ చాంద్ బాషా అన్ని పనులను చేసుకుంటూ తన భార్య ఆయేషాను, ముగ్గురు పిల్లలను పోషించేవాడు. తన కోడలికి, కుమారునికి మనస్పర్థలుండటం, తన కుమారుడిని మామ షేక్ మహబూబ్బాషా ఇంటి వద్దకు తీసుకుని వెళ్లి పొట్టన బెట్టుకున్నాడని ఆరోపించారు. మామతో పాటు, అతని భార్య, కుమార్తె, ముగ్గురు కుమారులే కారణమని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.షేక్ మహబూబ్బాషానే తన అల్లుడు సయ్యద్ చాంద్బాషాను దారుణంగా హత్య చేశాడని, ఇందులో బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కడప చిన్నచౌక్ సీఐ ఓబులేసు తెలిపారు. కాగా పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు షేక్ మహబూబ్బాషాతో పాటు, ఇతర నిందితులు ఉన్నారని తెలిసింది. కాగా ఈ హత్యను ఆప్ కి ఆవాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, వక్ఫ్ పరిరక్షణ కమిటీ జేఏసీ నగర కో కన్వీనర్ ఒక ప్రకటనలో ఖండించారు. -
తెనాలిలో విషాదం.. బంగారం వ్యాపారి ఆత్మహత్య
సాక్షి, గుంటూరు: తెనాలిలో విషాదం చోటు చేసుకుంది. బంగారం వ్యాపారి సిద్దేశ్ శివాజీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. బంగారం వ్యాపారి ఆత్మహత్య పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిద్దేశ్ శివాజీ ఆత్మహత్యకు పోలీసులు వేధింపులే కారణమని సమాచారం.దొంగ బంగారం కేసులో సిద్దేశ్ శివాజీని కొంత బంగారం ఇవ్వమని పోలీసులు వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు కొందరు ఆరోపిస్తున్నారు. సిద్ధేష్ శివాజీ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
వైఎస్సార్ జిల్లాలో దారుణం.. భార్యపై అనుమానంతో..
సాక్షి, వైస్సార్ జిల్లా: జిల్లాలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో ఉరివేసి చంపిన భర్త.. తాను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెన్నూరు పట్టణంలో ఈ ఘటన జరిగింది. బంధువుల సమాచారం ప్రకారం.. కొత్త గాంధీనగర్ చెందిన వల్లెపు నిత్యానంద్ 11 రోజుల క్రితం కువైట్ నుంచి స్వగ్రామానికి నిత్యానంద తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి భార్యపై అనుమానంతో చిన్నపాటి తగాదాలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున నిత్యానంద్ తన భార్య లక్ష్మీకుమారితో గొడవపడ్డాడు. దీంతో భార్యకు ఉరివేసిన భర్త.. తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులకు ఇద్దరు కుమార్తెలు గంగా మేఘన (8) గంగా మౌనిక (5) ఉన్నారు. సంఘటనా స్థలికి చేరుకున్న సీఐ కృష్ణారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కడప రిమ్స్కు తరలించారు. -
సైబర్ మోసాలు పదిరకాలు
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారు. కంటికి కనిపించకుండా వివరాలు చెప్పించుకొని మరీ బ్యాంకు ఖాతాలు ఊడ్చేస్తున్నారు. అవగాహనా లేమి, అత్యాశలే సైబర్ మోసాలకు ప్రధాన కారణాలు. మన చుట్టూ సైబర్ నేరాలకు సంబంధించిన వార్తలు నిత్యం చక్కర్లు కొడుతున్నా వాటిపై చాలా మంది ధ్యాస పెట్టడం లేదు. మాకు అంతా తెలుసులే అనే అతిధోరణితో మోసపోతున్నారు. సైబర్ మోసాలపై నమోదవుతున్న కేసులను గమనిస్తే ప్రధానంగా పది రకాల మోసాలే ఎక్కువగా జరుగుతున్నట్లు సైబర్ భద్రతాధికారులు చెబుతున్నారు. ఈ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 1. పెట్టుబడుల పేరిట స్టాక్ మార్కెట్ మోసాలు విపరీతంగా పెరిగాయి. తక్కు వ కాలంలో ఎక్కువ లాభాలు వస్తాయన్న ఆశ తో ఎంతో మంది అమాయకులు సులువుగా సైబర్ నేరగాళ్ల వలకు చిక్కుతున్నారు. సోషల్ మీడియా ప్రకటనలతో స్టాక్ మార్కెట్లో 30–40% లాభాలంటూ సైబర్ నేరగాళ్లు ఊదరగొడుతున్నారు. ఈ ప్రకటనలకు స్పందించే వారికి వాట్సాప్లో లింక్లు పంపుతూ వారు రూపొందించిన మోసపూరిత వెబ్సైట్ లలో పెట్టుబడి పెట్టిస్తున్నారు. లాభాలు వస్తున్నట్లు చూపుతూ మరింత పెట్టుబడి పెట్టేలా చేస్తున్నారు. నగదు ఉపసంహరణకు ప్రయతి్నంచినప్పు డు డబ్బులు రాక లబోదిబోమంటున్నారు. అందు వల్ల ఇలాంటి ప్రకటనలు సైబర్ మోసమని గ్రహించాలి. 2. లైక్లు.. షేర్ల పేరిట.. సోషల్ మీడియా పోస్టులను లైక్, షేర్ చేయడం వంటి సులువైన టాస్క్లతో డబ్బులు సంపాదించండంటూ ప్రకటనలిస్తూ సైబర్ ఉచ్చులోకి లాగుతున్నారు. తొలుత చిన్నచిన్న మొత్తాలు రాబడి రూపంలో చూపుతారు. అవతలి వ్యక్తి నమ్మకం పెరిగాక అసలు మోసానికి తెరతీస్తున్నారు. ఫొటోలు, వీడియోలకు లైక్, షేర్ చేస్తే అవతలి వ్యక్తులు డబ్బులు ఎందుకు ఇస్తారు? ఈ చిన్న లాజిక్ మరవొద్దు. 3. క్రెడిట్కార్డు మోసాలు స్కామర్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ల మాదిరిగా ఫోన్ చేసి క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామంటూ సీవీవీ, క్రెడిట్ కార్డు నంబర్లు, పుట్టిన తేదీ, బ్యాంకు ఖాతా వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత డబ్బులు కొల్లగొడతారని గుర్తుపెట్టుకోండి.4. తప్పుగా డబ్బులు పడ్డాయంటూ.. బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అయినట్లు మెసేజ్లు పంపుతారు. ఆ తర్వాత సైబర్ మోస గా ళ్లు ఫోన్ చేసి మీ బ్యాంకు ఖాతా లో పొరపాటున జమ అయిన మొత్తాన్ని తిరిగి పంపాలంటూ డబ్బులు కాజేస్తారు. ఇలాంటి సమ యాల్లో బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోకుండా స్పందించవద్దు.5. కేవైసీ అప్డేట్ పేరిట.. మీ బ్యాంకు ఖాతా వివరాలు, పేరు చెబుతూ ఫోన్ చేస్తారు. కేవైసీ వివరాలు అప్డేట్ చేసుకోవాలని సూచిస్తారు. లేదంటే ఎస్ఎంఎస్, ఈ–మెయిల్ ద్వారా కొన్ని లింక్లు పంపి అందులో మీ బ్యాంకు ఖాతా కేవైసీ అప్డేట్ చేసుకోవాలని సూచిస్తారు. వారు అడిగిన వివరాలు ఇస్తే మీ బ్యాంకు ఖాతా ఖాళీ అయినట్టేనని గుర్తుపెట్టుకోండి.6. కస్టమ్స్ అధికారులమంటూ.. మీ బంధువులు, స్నేహితులు విదేశాల నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్ పంపారని.. అది మీకు చేరాలంటే కస్టమ్స్ సుంకం చెల్లించాలని.. తాము కస్టమ్స్ అధికారులమంటూ ఎస్ఎంఎస్లు లేదా ఫోన్లు చేస్తారు. బహుమతిపై ఆశతో ఎంతో మంది సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు డబ్బు పంపి మోసపోతున్నారు. మీ పేరిట వచ్చిన పార్సిల్లో నిషేధిత వస్తువులు ఉన్నాయని.. మీపై కేసులు పెడతామని బెదిరిస్తూ ఫోన్ చేస్తారు. ఇతరులకు ఈ విషయం చెబితే మీకే చిక్కులంటూ భయాందోళనలకు గురిచేసి అందినకాడికి ఆన్లైన్లో డబ్బులు వేయించుకుంటున్నారు. అనుమానాస్పద ఫోన్కాల్స్ విషయంలో తస్మాత్ జాగ్రత్త.7. ఐటీ చెల్లింపులు, రిటర్న్ల పేరు చెప్పి.. ఆదాయపు పన్ను చెల్లింపుల పేరిట సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. ఐటీ శాఖ నకిలీ లోగోతో సందేశాలు పంపుతారు. పన్ను చెల్లింపుదారులకు తాము ఐటీ అధికారులమని చెప్పి.. రీఫండ్ను వేగవంతం చేయడానికి బ్యాంకు వివరాలు ఇవ్వాలంటూ ఫోన్ చేస్తారు. ఇలాంటి ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లు మోసపూరితమైనవిగా గుర్తించాలి. 8. ట్రాయ్ పేరిట.. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అధికారుల పేరిట ఇటీవల ఫోన్ చేస్తారు. మీ ఫోన్ నంబర్పై చట్టవిరుద్ధ కార్యకలాపాలు నమోదయ్యాయని.. ఉగ్రవాదులు, ఇతర నేరగాళ్ల ఫోన్ లిస్టులో మీ నంబర్ ఉందని బెదిరిస్తారు. మీ నంబర్ను ఆ లిస్టులోంచి తీసేయాలంటే డబ్బులు ఇవ్వాలంటూ పట్టుబడతారు. తీవ్రంగా ఒత్తిడి తెచ్చి అందినకాడికి డబ్బులు దండుకుంటారు. ట్రాయ్ అధికారులు ఈ తరహా ఫోన్కాల్స్ చేయరని గుర్తుంచుకోవాలి. 9. డిజిటల్ అరెస్టులు.. ఈ మధ్యకాలంలో అత్యధికంగా నమోదవుతున్న సైబర్ మోసాల్లో డిజిటల్ అరెస్టులు ప్రధానమైనవి. సీబీఐ, పోలీసు అధికారులమని వాట్సాప్లో ఆడియో, వీడియో కాల్స్ చేస్తారు. వాట్సాప్ డీపీలో పోలీస్ యూనిఫాంతో ఉన్న ఫొటోలు, వీడియో కాల్ మాట్లాడేటప్పుడు పోలీస్ యూనిఫాంలో ఉంటూ మీ కుమారుడు అత్యాచారం, హత్య కేసులో చిక్కినందున మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేశామని బెదిరిస్తారు. ఈ విషయాలు ఎవరితో పంచుకోవద్దని, బయటికి వెళ్లవద్దని హెచ్చరిస్తారు. కేసు లేకుండా చేయాలంటే తాము చెప్పిన నంబర్కు డబ్బులు పంపాలని డిమాండ్ చేస్తారు.10. ఏఐతో వలవేసి.. సైబర్ నేరగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను సైతం మోసాలకు వాడుతున్నారు. ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికల్లో పంచుకొనే ఫొటోలు, వీడియోలను ఆధారంగా చేసుకొని.. ఏఐ సాయంతో వారి గొంతును అనుకరిస్తూ ఆడియోలు తయారు చేస్తారు. వాటిని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపి అత్యవసరమనో లేదా ఆసుపత్రిలో ఉన్నామనో చెబుతూ వెంటనే డబ్బులు పంపాలని అభ్యర్థిస్తారు. డబ్బులు ఇవ్వకపోతే మీ కుటుంబ సభ్యుల మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు బయటపెడతామని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. -
అడ్డు తొలగించుకోవాలనే యువతి హత్య
యలమంచిలి రూరల్(అనకాపల్లి): రెండేళ్ల క్రితం యలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బీపీసీఎల్ పెట్రోల్ బంక్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురైన యువతి ఎల్లబిల్లి దివ్య(20) హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. యువతిని హతమార్చి, పెట్రోల్ పోసి తగలబెట్టిన ఈ ఘటన అప్పట్లో జిల్లాలో సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో 25 నెలలుగా నిందితులను పోలీసులు పట్టుకోలేకపోయారు. ఇటీవల జిల్లా ఎస్పీ ఆదేశాలతో పెండింగ్ కేసుల దర్యాప్తుపై దృష్టి సారించిన యలమంచిలి సర్కిల్ పోలీసులు చాకచక్యంగా పలు సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకోగలిగారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఈ హత్య కేసును ఛేదించిన యలమంచిలి సీఐ ధనుంజయరావు, ట్రైనీ డీఎస్పీ కృష్ణ చైతన్య, యలమంచిలి పట్టణం, మునగపాక ఎస్ఐలు కె.సావిత్రి, పి.ప్రసాదరావులను పరవాడ డీఎస్పీ వి.విష్ణుస్వరూప్ అభినందించారు. ఈ సందర్భంగా యలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు వివరాలను డీఎస్పీ మీడియాకు వెల్లడించారు. అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామానికి చెందిన ఎల్లబిల్లి దివ్య(20) 2023 ఫిబ్రవరి 22న యలమంచిలి మున్సిపాలిటీ పరిధి ఎర్రవరం సమీపంలో దారుణ హత్యకు గురైంది. కాలిపోయిన ఆమె మృతదేహాన్ని గుర్తించిన ఎర్రవరం వీఆర్వో చేవేటి అప్పారావు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట్లో ఆమె ఎవరనేది, ఎవరు హత్య చేశారో కూడా గుర్తించలేని పరిస్థితి ఉండడంతో వీఆర్వో ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని మృతదేహంగాను, గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్టు కేసు నమోదు చేశారు. హత్యకు గురైన మహిళను తొలుత ట్రాన్స్జెండర్గా కూడా భావించారు. ఆ తర్వాత హత్యకు గురైంది పూడిమడకకు చెందిన ఎల్లబిల్లి దివ్యగా తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హతురాలు యలమంచిలిలో పలువురు యువకులతో ఎక్కువగా తిరుగుతూ ఉండడంతో ఆమెతో పరిచయం ఉన్న చాలా మంది యువకులపై అనుమానంతో పోలీసులు విచారించారు. అయినా సరైన ఆధారాలు లభ్యం కాకపోవడంతో నిందితులను గుర్తించలేకపోయారు. ఇటీవల ఈ కేసు దర్యాప్తుపై దృష్టి సారించిన పోలీసులు పలు సాంకేతిక ఆధారాలతో యలమంచిలి ధర్మవరం సీపీ పేటకు చెందిన ప్రగడ రవితేజ(30), సెలంశెట్టి సాయికృష్ణ(20), కాకివాని వీధికి చెందిన బంగారి శివ(23)లను నిందితులుగా నిర్ధారణకు వచ్చారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించడంతో నిందితులు నేరాన్ని అంగీకరించారు.వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే.. దివ్యకు కేసులో ప్రధాన నిందితుడు ప్రగడ రవితేజకు రిలేషన్షిప్ ఉండేది. రవితేజ మరో అమ్మాయిని కూడా ప్రేమిస్తున్నాడు. ఆమెతో వివాహం కూడా నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న దివ్య.. తనను వివాహం చేసుకోవాలని రవితేజను కోరింది. లేకపోతే ఇంటికి వచ్చి గొడవ చేస్తానని బెదిరించింది. దివ్యను వివాహం చేసుకోవడానికి ఇష్టం లేని రవితేజ ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పథకం రచించాడు. ఇందుకు స్నేహితులైన సెలంశెట్టి సాయికృష్ణ, బంగారి శివల సహాయం కోరాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం దివ్యను పిడిగుద్దులు గుద్ది, చాకుతో పొడిచి చంపారు.అక్కడితో ఆగకుండా మృతురాలి ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకు మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టారు. నిందితుల్లో ప్రగడ రవితేజ, సెలంశెట్టి సాయి కృష్ణలు యలమంచిలి రూరల్ పీఎస్లో గంజాయి చోరీ చేసిన కేసులో నిందితులుగా ఉన్నారు. మూడో నిందితుడు బంగారిశివపై కొట్లాట కేసు ఉంది. అంతేకాకుండా నిందితులు ముగ్గురూ గంజాయికి అలవాటు ఉందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇంకెవరూ నిందితులు లేరని పోలీసులు స్పష్టం చేశారు. నిందితులు ముగ్గుర్నీ శుక్రవారం రాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా జ్యుడీíÙయల్ రిమాండ్ విధించారు. -
AP: ఒంటరి మహిళలు, వివాహితలే టార్గెట్.. యూట్యూబర్ అరెస్ట్
సాక్షి, తిరుపతి: తిరుపతిలో దారుణ ఘటన వెలుగు చూసింది. మహిళలను లైంగికంగా వేధిస్తున్న యూట్యూబర్ హేమాద్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తి.. సోషల్ మీడియా వేదికగా మహిళలను వేధింపులకు గుర్తిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.వివరాల ప్రకారం.. తిరుపతిలో యూట్యూబర్ హేమాద్రిని తిరుచానూర్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. నిందితుడు హేమాద్రి.. సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలు, ఒంటరి మహిళలకు, వివాహితలతో పరిచయాలు పెంచుకున్నాడు. అనంతరం, వారితో సన్నిహితంగా ఉంటూ ఫొటోలు సేకరించాడు. కొద్ది రోజుల తర్వాత వారిని సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురిచేసినట్టు బాధితులు.. పోలీసులు ఆశ్రయించారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. హేమాద్రిని అరెస్ట్ చేశారు. మరోవైపు.. హేమాద్రి అరెస్ట్ తెలియడంతో తిరుచానూర్, తిరుపతి, చంద్రగిరి నుంచి బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుడిని పోలీసులు విచారిస్తున్నట్టు తెలిపారు. -
ప్రతీ పనికి నిన్ను ఇబ్బంది పెడుతున్నా.. ఈ జీవితం నాకొద్దు!
ఏలూరు టౌన్: అన్నింటికీ నీపై ఆధారపడుతున్నాను.. ఇక నీకు భారం కాలేను.. పిల్లల్ని జాగ్రత్తగా చూస్కోండి అంటూ భర్తకు ఫోన్లో మెసెజ్ పెట్టి ఓ వివాహిత గోదావరిలోకి దూకి తనువు చాలించింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజమండ్రి లాలా చెరువు స్పిన్నింగ్ మిల్లు ప్రాంతానికి చెందిన సుంకరం రామకృష్ణ, కళ్యాణి (32) దంపతులు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఏలూరు శాంతినగర్ 21 వ డివిజన్ సచివాలయంలో కళ్యాణి ఏఎన్ఎంగా పనిచేస్తుండడంతో ఆమె కుటుంబంతో స్థానికంగానే నివాసముంటున్నారు. రెండేళ్ల క్రితం ఆమెకు ఒక రోడ్డు ప్రమాదంలో కాలికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె సరిగా నడవలేని పరిస్థితిలో భర్తపై ఆధారపడి జీవనం సాగిస్తోంది. ఆమె చేస్తున్న ఉద్యోగంలో, కుటుంబ జీవనంలోనూ భర్తపై ఆధారపడుతోంది. ఒకవైపు కరోనా వ్యాప్తి చెందుతుందనే భయం, మరోవైపు పని భారం పెరగడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆమె బుధవారం ఎవరికీ చెప్పకుండా రాజమండ్రి వెళ్లింది. భర్త రామకృష్ణకు ఫోన్లో.. ప్రతి పనికి నీ మీద ఆధార పడి ఉంటున్నా.. నిన్ను ఇబ్బంది పెడుతున్నాను.. నాకు జీవితంపై విరక్తి కలిగింది.. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని మెసేజ్ పెట్టింది. దీంతో ఏలూరు త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా సెల్ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేశారు. లొకేషన్ రాజమండ్రిలో చూపించగా అక్కడకు వెళ్లి వెదికారు. తీరా చూస్తే ఆమె గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై రాజమండ్రి త్రీ టౌన్ సీఐ వీ అప్పారావు ఆధ్వర్యంలో మృతదేహాన్ని రాజమండ్రి సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాజమండ్రి త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
ప్రేమ జంట ఆత్మహత్య
తిరుపతి జిల్లా: జిల్లాలోని నాయుడుపేటలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. నాయుడుపేటలోని అమరావతి లాడ్జి నందు ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడిని ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆత్మహత్యకు పాల్పడిన జంటను కుప్పరెడ్డిపాలెం గ్రామానికి చెందిన మణి, శిరీషగా గుర్తించారు. ఈ ఘటనలో శిరీష ఉరి వేసుకుని ఉండగా, మణి కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై కుటుంబ సభ్యుల సమక్షంలోనే లాడ్జి గది తలుపులు పగలగొట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com