వైఎస్‌ జగన్‌‌ను కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన కేసీఆర్‌ | KCR invites AP CM YS Jagan for Inauguration of Kaleshwaram Project | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌‌ను కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన కేసీఆర్‌

Jun 17 2019 3:46 PM | Updated on Mar 22 2024 10:40 AM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం సమావేశం అయ్యారు. తాడేపల్లిలోని వైఎస్‌ జగన్‌ క్యాంప్‌ కార్యాలయానికి వచ్చిన కేసీఆర్‌ను ముఖ్యమంత్రి సాదరంగా ఆ‍హ్వానించి, దగ్గరుండి లోనికి తీసుకు వెళ్లారు.  కేసీఆర్‌ ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలంటూ జగన్‌ను ఆహ్వానించారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి రావాలని కేసీఆర్‌ ఆహ్వాన పత్రిక అందచేశారు. అనంతరం ఇరువురు ముఖ్యమంత్రులు కలసి లంచ్‌ చేశారు. కేసీఆర్‌ వెంట కేటీఆర్, సంతోష్‌, వినోద్‌ కుమార్‌, పల్లా రాజేశ్వరరెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement