టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్
వన్డే వరల్డ్కప్లో అత్యంత ఆసక్తికరమైన భారత్-పాకిస్తాన్ల మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఆదివారం ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సర్పరాజ్.. భారత్ను ముందుగా బ్యాటింగ్కు ఆహ్వానించాడు. శిఖర్ ధావన్ గాయం కారణంగా మ్యాచ్కు దూరం కావడంతో అతని స్థానంలో విజయ్ శంకర్ తుది జట్టులోకి వచ్చాడు. వరుణుడు కాస్త తెరిపి ఇవ్వడంతో టాస్ పడింది. ఇక మ్యాచ్ మొత్తం జరగాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు