ఒకే టెస్టులో ఏకంగా ముగ్గురు..

పెర్త్‌: ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఆటగాళ్ల గాయాల బెడడ తప్పటం లేదు. రొజుకొకరు చొప్పున గాయపడటం ఇరు జట్లను కలవరపెడుతోంది. తొలి రోజు కివీస్‌ బౌలర్‌ ఫెర్గుసన్‌ గాయంతో ఈ టెస్టుకు దూరం కాగా.. రెండో రోజు ఆసీస్‌ బౌలర్‌ హేజిల్‌వుడ్‌ గాయంతో ఈ సిరీస్‌కే దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. తాజాగా మూడో రోజు ఆటలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌కు అంపైర్‌గా విధులు నిర్వర్తిస్తున్న పాకిస్తాన్‌ సీనియర్‌ అంపైర్‌ అలీమ్‌ దార్‌ గాయపడ్డాడు. గాయంతో విలవిల్లాడిన ఆయన మైదానంలో కుప్పకూలాడు. అలీమ్‌ దార్‌కు గాయం జరిగిన తీరు చూశాకా ఈ టెస్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపించాయి.  అనంతరం ఫిజియో వచ్చి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం తిరిగి అంపైరింగ్‌ చేశాడు. దీంతో కథ సుఖాంతమైంది. 
 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top