ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం సోమవారం లోక్సభ ముందుకు రానుంది. ఇందుకు సంబంధించిన నోటీసును వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇప్పటికే ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీని ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, అందుకే అవిశ్వాసం పెడుతున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు వదిలిపెట్టబోమని అన్నారు.