నేటికి ప్రత్యేక హోదా అంశం సజీవంగా ఉందంటే వైఎస్ జగన్ పోరాటమే అని వైఎస్సార్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయన్ని రాష్ట్రపతిని కలిసి వివరించామని ఎంపీ చెప్పారు. పాదయాత్ర శిబిరం వద్ద ఎంపీలు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఢిల్లీలో జరిగిన పరిణామాలను ఎంపీలు వైఎస్ జగన్కు వివరించారు. అనంతరం ఎంపీ మేకపాటి మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 22న మరోసారి భేటీ అవుతామని తెలిపారు. 25మంది ఎంపీలు ఒకేసారి రాజీనామా చేసి ఉంటే దేశం మొత్తం చర్చ జరిగేదని ఎంపీ అన్నారు