టీడీపీ ఎందుకంత గగ్గోలు పెడుతోంది | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎందుకంత గగ్గోలు పెడుతోంది

Published Wed, Mar 27 2019 3:45 PM

కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ ఎందుకు గగ్గోలు పెడుతుందో అర్థం కావడం లేదని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరుకుందని, సొంత ప్రయోజనాల కోసం ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను వాడుకుంటున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను కూడా పక్కన పెట్టాలని తాము డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ఇదే విషయంపై మరోసారి ఈసీని కలవబోతున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement