ప్రజలు తిరస్కరించినా బుద్ధి రాలేదా బాబూ..!

 ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏడుపు గొట్టు రాజకీయాలు మానుకోవాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర్ర ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య హితవు పలికారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..ప్రజలు తిరస్కరించినా బాబులో మార్పు రాలేదని.. కుట్రలు,కుతంత్రాలతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర్రంలో అస్థిరతను నెలకొల్పేలా ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. గ్రామీణ ప్రాంతాల్లో సామరస్య వాతావరణాన్ని తేలేని వ్యక్తి.. రాజకీయవేత్తే కాదన్నారు. బాబు సిద్ధాంతాలను వైసీపీ ప్రభుత్వం కొనసాగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top