పవన్‌ కులాలు ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారు | YSRCP Leader Botsa Satyanarayana Comments On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవన్‌ కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారు

Mar 23 2019 6:37 PM | Updated on Mar 22 2024 11:29 AM

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోవాలని వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ సూచించారు. రాజకీయ లబ్ధికోసమే పవన్‌ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. పవన్‌ కళ్యాణ్‌లా ఊసరవెల్లిలా తాము మారలేమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌ సోదరుడు నాగబాబు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తన ఓటు టీఆర్‌ఎస్‌కు వేశానని స్వయంగా చెప్పినట్లు పేర్కొన్నారు. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారు, ఎవరు టీఆర్‌ఎస్‌ గెలవాలని కోరుకున్నారంటూ ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement