వైఎస్ జగన్ చెప్పిందే నిజమైంది
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఏదైతే చెప్పారో అక్షరాలా అదే నిజమని తేలింది. ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఆర్థిక సంఘం అనుమతి అక్కర లేదని, అసలు హోదా అంశం ఆర్థిక సంఘం పరిధిలోకి రాదని, ప్రధానమంత్రి సంతకంతో ఒక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (కార్యనిర్వాహక ఆదేశం) ద్వారా చేయవచ్చని వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగేళ్లుగా పదేపదే చెబుతున్న అంశం వాస్తవమని 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ నందకిషోర్సింగ్ గురువారం అమరావతి సాక్షిగా హోదాపై చేసిన ప్రకటనతో తేటతెల్లం అయింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు