టీడీపీ అవినీతికి కేరాఫ్ అడ్రస్గా రాష్ట్రాన్ని మారుస్తుంది
నాటకం, సినీ రంగాలకు పుట్టినిల్లు అయిన పాలకొల్లులో అవినీతి రాజ్యమేలుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పాలకొల్లు బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అవినీతికి కేరాఫ్ అడ్రస్గా రాష్ట్రాన్ని మార్చిందని అన్నారు. రేలంగి, చలం, చిరంజీవి లాంటి గొప్పవారు పాలకొల్లు నుంచే వచ్చారని గుర్తు చేశారు. ఎన్నో వైభవాలకు నెలవైన డెల్టా ప్రాంతం చంద్రబాబు పాలన మొదలెట్టాక కరువుతో అల్లాడిపోతోందని అన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు