ఈనాటి ముఖ్యాంశాలు | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Published Tue, Jul 30 2019 8:02 PM

వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మంగళవారం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి  జయశంకర్‌ను కలిశారు. దాయాది పాకిస్తాన్ చెరలో ఉన్న ఉత్తరాంధ్ర జాలర్లను విడిపించాలని ఆయనను కోరారు. జాలర్లతో వారి కుటుంబసభ్యులు మాట్లాడేందుకు  దౌత్య అనుమతి ఇప్పించాలని కేంద్రమంత్రిని వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. కర్ణాటకలో కొత్తగా ఏర్పటైన బీఎస్ యడియూరప్ప ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో టిప్పు జయంతి ఉత్సవాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.