నేడు చివరి టి20 మ్యాచ్‌ | Today is the last T20 match | Sakshi
Sakshi News home page

Feb 24 2018 7:57 AM | Updated on Mar 22 2024 10:48 AM

దక్షిణాఫ్రికా జట్టు ఆఖరి సారిగా 2015లో భారత్‌లో పర్యటించినప్పుడు టెస్టు సిరీస్‌లో చిత్తుగా ఓడినా... వన్డే, టి20 సిరీస్‌లు రెండింటిని సొంతం చేసుకుంది. ఇప్పుడు సరిగ్గా అదే తరహాలో బదులివ్వాలంటే టీమిండియా టి20 సిరీస్‌ కూడా గెలుచుకోవాల్సి ఉంది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో నేడు న్యూలాండ్స్‌ మైదానంలో ఆఖరి టి20 మ్యాచ్‌ జరగనుంది. గత మ్యాచ్‌లో అనూహ్య విజయంతో సఫారీ టీమ్‌లో ఆత్మవిశ్వాసం పెరగగా... ఆ మ్యాచ్‌లో దొర్లిన తప్పులను దిద్దుకొని సత్తా చాటాలని కోహ్లి సేన పట్టుదలగా ఉంది.  

Advertisement
 
Advertisement

పోల్

Advertisement