యూపీలో నకిలీ మద్యానికి 44 మంది బలి | Thirty Four People Died After Drinking Spurious Liquor In UP And Uttarakhand | Sakshi
Sakshi News home page

యూపీలో నకిలీ మద్యానికి 44 మంది బలి

Feb 9 2019 4:40 PM | Updated on Mar 20 2024 4:00 PM

నకిలీ మద్యం తాగిన కారణంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌ల్లో శుక్రవారం 44 మంది మరణించారు. పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటనపై ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించింది. ఎక్సైజ్, పోలీస్‌ శాఖలకు చెందిన 17 మంది ఉద్యోగులను సస్పెండ్‌ చేసింది. ఉత్తరప్రదేశ్‌ కూడా 10 మంది పోలీస్‌ సిబ్బందిని సస్పెండ్‌ చేసింది. అంతకుముందు మరో ఘటనలో ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీ నగర్‌ జిల్లాలో గత మూడు రోజుల్లో 8 మంది మరణించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement