యూపీలో నకిలీ మద్యానికి 44 మంది బలి
నకిలీ మద్యం తాగిన కారణంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ల్లో శుక్రవారం 44 మంది మరణించారు. పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటనపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. ఎక్సైజ్, పోలీస్ శాఖలకు చెందిన 17 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసింది. ఉత్తరప్రదేశ్ కూడా 10 మంది పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేసింది. అంతకుముందు మరో ఘటనలో ఉత్తరప్రదేశ్లోని ఖుషీ నగర్ జిల్లాలో గత మూడు రోజుల్లో 8 మంది మరణించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు