గ్రామ వలంటీర్‌పై టీడీపీ వర్గీయుల దాడి

టీడీపీ వర్గీయులు మరోసారి బరితెగించారు. పాత కక్షలతో ఓ గ్రామ వలంటీర్‌పై వేట కొడవళ్లతో దాడికి దిగారు. ఈ ఘటన జిల్లాలోని చక్రాయపేట మండలం కుమారకాల్వలో ఆదివారం చోటుచేసుకుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలతో టీడీపీ వర్గీయులు ఘర్షణకు దిగారు. కొడవళ్లు, రాళ్లతో వీరంగం సృష్టించారు. ఈ క్రమంలో గ్రామ వలంటీర్‌ తాళ్లపల్లె రాకేష్‌ (23), ఆయన బంధువుపై పాత కక్షల నేపథ్యంలో విరుచుకుపడ్డారు. దీంతో రాకేష్‌ చేతిపై కత్తిపోటు బలమైన గాయం చేసింది. రాకేష్‌ పెద్దనాన్న తాళ్లపల్లె జ్ఞానముత్తు (48 )పై వేట కొడవళ్లతో టీడీపీ వర్గీయులు దాడి చేయడంతో ఆయన తలకు బలమైన గాయమైంది. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top