‘ఆయన ట్రాప్‌లో పడ్డ కొన్ని మీడియా సంస్థలు’.. | Talasani Srinivas Yadav Fires On Chandrababu Over IT Grid | Sakshi
Sakshi News home page

‘ఆయన ట్రాప్‌లో పడ్డ కొన్ని మీడియా సంస్థలు’..

Mar 7 2019 5:02 PM | Updated on Mar 22 2024 11:17 AM

 ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిమ్మిని బమ్మిని చేయగలరని, ఆయన ట్రాప్‌లో పడిన కొన్ని మీడియా సంస్థలు కూడా తిమ్మిని బమ్మిని చేయాలనుకుంటున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌​ మండిపడ్డారు. ఐటీ గ్రిడ్‌కు సంబంధించిన వాస్తవాలు ప్రజల దృష్టికి తేవాలని మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ గ్రిడ్‌ కేసును రెండు రాష్ట్రాల వివాదంగా కొందరు తెలిసీ, తెలియక చిత్రీకరిస్తున్నారన్నారు. ఏపీ మంత్రులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, తెలంగాణ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయటం దౌర్భాగ్యమన్నారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement