సరదాగా మొదలై..చివరకు ప్రాణం తీసేసింది | Sakshi
Sakshi News home page

సరదాగా మొదలై..చివరకు ప్రాణం తీసేసింది

Published Mon, Apr 16 2018 10:30 AM

సరదాగా మొదలైన ఆట.. చివరకు ఓ విద్యార్థి ప్రాణం తీసేసింది. పాకిస్థాన్‌ పంజాబ్‌ ప్రొవిన్స్‌లోని మియాన్‌ ఛన్ను ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూల్‌ విరామ సమయంలో ఆరో తరగతి చదువుతున్న బిలాల్‌, అమీర్‌ అనే ఇద్దరు విద్యార్థులు తప్పర్‌ కబడ్డీ(చెంప దెబ్బల ఆట.. పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో ఈ ఆట ప్రాచుర్యంలో పొందింది‌)కి సిద్ధమయ్యారు. టీచర్లు, విద్యార్థుల సమక్షంలో వారు దెబ్బల వర్షం కురిపించుకున్నారు. అమీర్‌ దెబ్బలకి తాళలేక బిలాల్‌ కుప్పకూలిపోగా.. సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.