దేవతలకు పూలు, పండ్లు, కొబ్బరికాయలు, విరాళాలు, కానుకలు ఇచ్చి కోరికలు కోరుకోవటం ఆనవాయితీ. కానీ ఇక్కడ ఆ వ్యవహారం దారి తప్పింది. బాబా భైరోన్ నాథ్ దేవుడికి భక్తులు మద్యాన్ని బాటిళ్ల కొద్దీ తెచ్చి సమర్పించుకుంటారు. అనంతరం దానినే ప్రసాదంగా తీసుకుంటారు. ముంబై సమీపంలోని చెంబూర్ ఈ విడ్డూరానికి వేదికైంది.