సూరత్లో ఘోర అగ్నిప్రమాదం; 15 మంది మృతి
గుజరాత్లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సూరత్లోని ఓ బిల్డింగ్లోని కోచింగ్ సెంటర్లో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో దాదాపు 15 మంది విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రాణాలు కాపాడుకునేందుకు.. విద్యార్థులు భవనంపై నుంచి దూకేందుకు ప్రయత్నించగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుంది. ఆరు ఫైర్ ఇంజన్లతో దాదాపు 18 మంది రక్షణ చర్యలు చేపట్టారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు