సూరత్‌లో ఘోర అగ్నిప్రమాదం; 15 మంది మృతి

గుజరాత్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సూరత్‌లోని ఓ బిల్డింగ్‌లోని కోచింగ్‌ సెంటర్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో దాదాపు 15 మంది విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రాణాలు కాపాడుకునేందుకు.. విద్యార్థులు భవనంపై నుంచి దూకేందుకు ప్రయత్నించగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుంది. ఆరు ఫైర్‌ ఇంజన్లతో దాదాపు 18 మంది రక్షణ చర్యలు చేపట్టారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top