ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఎంపికపై సెలక్షన్ కమిటీ శుక్రవారం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ కమిటీ ఐదుమంది అధికారుల పేర్లను డీజీపీ పోస్టు కోసం ఎంపిక చేసింది. ఈ జాబితాలో గౌతమ్ సవాంగ్, ఠాకూర్, కౌముది, అనురాధ, సురేంద్రబాబుల పేర్లు ఉన్నాయి. అంతేకాక అధికారుల ట్రాక్ రికార్డు, సర్వీస్ వివరాలను కూడా నివేదికలో పొందుపరిచింది.