చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తున్నారు | Ram Madhav slams chandrababu naidu over karnataka elections | Sakshi
Sakshi News home page

చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తున్నారు

May 26 2018 10:39 AM | Updated on Mar 22 2024 10:49 AM

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ నూతన అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ప్రమాణ స్వీకారం చేయడం శుభపరిణామమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు.  రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. గుంటూరులో జరిగే కన్నా లక్ష్మీనారాయణ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు బీజేపీ నేతలు రాంమాధవ్‌, యూపీ మంత్రి సిద్ధార్థ సింగ్‌, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తదితరులు శనివారం గన్నవరం చేరుకున్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు గన్నవరం విమానాశ్రయంలో వారికి ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా రాంమాధవ్‌ మాట్లాడుతూ...‘  రాష్ట్రంలో చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తున్నారు. చివరికి ఫ్లెక్సీల మీద కూడా తమ కుటుంబానికి చెందినవారి ఫోటోలను మాత్రమే వేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ బీజేపీతో విడిపోవడం మాకు నష్టం లేదు. మాతో విడిపోయిన తర్వాత టీడీపీ విషప్రచారం చేస్తోంది. ఎవరిది ధర్మ పోరాటమో ప్రజలే నిర్ణయిస్తారు. నరేంద్ర మోదీ ఇమేజ్‌ వలనే దేశంలో బీజేపీ బలంగా ఉంది.  

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement