వైఎస్సార్ జిల్లా పులివెందులలో రాజకీయం వేడెక్కింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పులివెందులలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిధ్దమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విసిరిన ప్రతిసవాల్కు టీడీపీ స్పందించింది. పులివెందులలో వైఎస్సార్ చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని టీడీపీ నేతల సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ సవాల్ను స్వీకరించిన వైఎస్ అవినాష్ రెడ్డి ఎప్పుడు ఏ సెంటర్లో చర్చకు రావాలో చెప్పాలని ప్రతి సవాల్ విసిరారు. దీనిపై శనివారం టీడీపీ నేత సతీష్ రెడ్డి ఈ నెల 4 వతేదీ (ఆదివారం) సాయంత్రం చర్చకు సిధ్దమని ప్రకటించారు.
Mar 3 2018 4:07 PM | Updated on Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement