‘ఐదు రోజుల్లోనే పెన్షన్లు మంజూరు చేస్తాం’ | Sakshi
Sakshi News home page

‘ఐదు రోజుల్లోనే పెన్షన్లు మంజూరు చేస్తాం’

Published Tue, Feb 4 2020 2:45 PM

అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అనర్హులను మాత్రమే తొలగించామని స్పష్టం చేశారు. సమగ్ర విచారణ అనంతరం ఇంకా అనర్హులుంటే తొలగిస్తామని అన్నారు. అర్హతలు ఉన్నవారి నుంచి దరఖాస్తులు స్వీకరించి ఐదు రోజుల్లోనే పెన్షన్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. నిరంతరం ఈ ప్రక్రియ చేపడతామని తెలిపారు. చంద్రబాబు హయాంలో అడ్డగోలుగా పెన్షన్లను తొలగించారని మంత్రి గుర్తు చేశారు. రికార్డు స్థాయిలో 50 లక్షల 50 వేల మందికి పింఛన్లు పంపిణీ చేశామని చెప్పారు.