సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపేసిన పాక్

భారత పైలట్‌ ఇంకా పాకిస్తాన్‌ కస్టడీలో ఉన్నందున ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మరోవైపు భారత్‌- పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసినట్టు పాకిస్తాన్‌ వెల్లడించింది. లాహోర్‌ నుంచి అతారి వరకూ నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను తదుపరి నోటీసులు ఇచ్చేవరకూ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. భధ్రతా ఆందోళనల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని పాకిస్తాన్‌ రైల్వేల అదనపు జనరల్‌ మేనేజర్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top