అత్తాపూర్లో పట్టపగలే అందరూ చూస్తుండగానే దారుణ హత్య జరిగింది. ఏకంగా పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్ ముందే జుమెరాత్ బజార్కు చెందిన రమేష్ని గొడ్డలితో నరికి అతిదారుణంగా చంపారు. అత్యంత రద్దీగా ఉండే పిల్లర్ నంబర్ 138 వద్ద నలుగురు వ్యక్తులు కలిసి రమేష్ని హత్య చేశారు. స్థానికులు, పోలీసులు కలిసి హత్య చేసిన వ్యక్తిని, అతనికి సహకరించిన మరో వ్యక్తిని పట్టుకుని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కి తరలించారు. కాగా ఈ హత్యతో ప్రమేయమున్న మరో ఇద్దరు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.
నడిరోడ్డు పై యువకుడిని నరికిన దుండగులు
Sep 26 2018 1:35 PM | Updated on Mar 20 2024 3:38 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement