చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు.. | MP Mithun Reddy fires on Cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు..

Jan 4 2019 12:43 PM | Updated on Mar 21 2024 10:52 AM

చంద్రబాబు నాయుడు ఓ వీడియో ప్లే చేసి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మదనపల్లిలో ఆగస్టు నుంచి తిప్పారెడ్డి 60వేల గడియారాలు పంచుతున్నారని తెలిపారు. ఓ గడియారంలో టీఆర్‌ఎస్‌ ఫొటో ఉంటే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి కుట్ర కోణమని మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. రాజధాని శంకుస్థాపనకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను పిలవలేదా అని గుర్తుచేశారు. ఓటుకు కోట్లు కేసులో అప్పటి టీడీపీ నాయకుడు రేవంత్‌ రెడ్డికి ఇచ్చింది మీ డబ్బు కాదా అని నిలదీశారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement