రసవత్తరంగా మారిన మా ఎన్నికలు | Sakshi
Sakshi News home page

రసవత్తరంగా మారిన మా ఎన్నికలు

Published Wed, Mar 6 2019 7:51 AM

‘‘శివాజీ రాజా కంటే నేనే సీనియర్‌. అయితే తన మనసులో మాటని అర్థం చేసుకోవడంతో పాటు ‘మా’ బాగుండాలనే ఉద్దేశంతో గత పర్యాయం ‘మా’ అధ్యక్షుడిగా ఉండమని శివాజీరాజాకి నేనే చెప్పా. అయితే గత ఏడాది వచ్చిన వివాదాలు, కొన్ని సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఏకగ్రీవం కాకుండా ఎన్నికలకు వెళ్తున్నాం’’ అని నటుడు నరేశ్‌ అన్నారు. నరేశ్‌ అధ్యక్షుడిగా, రాజశేఖర్‌ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా, జీవితా రాజశేఖర్‌ ప్రధాన కార్యదర్శిగా ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్యానల్‌ మంగళవారం హైదరాబాద్‌లో తమ మేనిఫెస్టోని ప్రకటించింది. ఈ సందర్భంగా నరేశ్‌ మాట్లాడుతూ– ‘‘మా’ అన్నది ఒక ఆర్గనైజేషన్‌.

Advertisement
Advertisement