రాజస్తాన్‌లో కుప్పకూలిన మిగ్‌-21 విమానం

 రాజస్తాన్‌లో భారత యుద్ధ విమానం మిగ్‌-21 కుప్పకూలింది. ఘటన జరిగిన సమయంలో పైలట్‌ విమానం నుంచి ఎజెక్ట్‌ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పైలట్‌ క్షేమంగానే ఉన్నట్లు సమాచారం. బికనీర్‌కు సమీపంలో ఉన్న శోభా సర్‌కీ ధానీ ఏరియాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని బికనీర్‌ ఎస్పీ తెలిపారు. పుల్వామా ఉగ్రదాడి, మెరుపు దాడుల నేపథ్యంలో భారత్‌- పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న తరుణంలో యుద్ధ విమానం కూలిపోవడంతో అలజడి రేగింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top