చిక్కినట్టే చిక్కి.. పట్టుజారిన బోటు | Godavari Boat Extraction Works Continues | Sakshi
Sakshi News home page

చిక్కినట్టే చిక్కి.. పట్టుజారిన బోటు

Oct 22 2019 8:05 AM | Updated on Mar 21 2024 8:31 PM

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ట పున్నమి బోటును వెలికితీసే పనుల్లో సోమవారం మరికొంత పురోగతి కనిపించింది. బోటు ముందు భాగంలో ఉండే ప్లాట్‌ఫామ్, బోటు క్యాబిన్‌లోని కొంత భాగం, హైడ్రాలిక్‌ గేర్‌రాడ్, రెయిలింగ్‌లోని కొంత భాగం, బోటు టాప్‌పై ఉండే ప్లాస్టిక్‌ షీట్, బోటు నేమ్‌ బోర్డును బయటకు తీశారు. లంగర్లకు చిక్కినట్టే చిక్కి.. పట్టు జారటంతో బోటు మొత్తాన్ని బయటకు తీయడం వీలు కాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement