సీఎం నివాసానికి ర్యాలీ.. రాజధానిలో ఉద్రిక్తత | Sakshi
Sakshi News home page

సీఎం నివాసానికి ర్యాలీ.. రాజధానిలో ఉద్రిక్తత

Published Mon, Feb 25 2019 11:41 AM

తాడేపల్లిగూడెంలో ఉద్రిక్తత నెలకొంది. తమ పొలాలపై యూ-1 రిజర్వ్‌జోన్‌ ఎత్తివేయాలంటూ రైతులు ర్యాలీ చేపట్టారు. తాడేపల్లి, కుంచనపల్లి, కొలకొండ రైతులు తాడేపల్లి నుంచి ఉండవల్లిలోని సీఎం నివాసం వరకు భారీ ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీగా వెళ్తున్న రైతులు పోలీసులు అడ్డుకోవడంతో వారి మధ్య తోపులాట జరిగి.. ఘర్షణ వాతావరణ ఏర్పడింది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ రైతులు రోడ్డుపైన ఆందోళనకు దిగారు. ప్రభుత్వ చర్యపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.