అని, అనలేదని అనడం ఆయనకే చెల్లు! | Sakshi
Sakshi News home page

అని, అనలేదని అనడం ఆయనకే చెల్లు!

Published Tue, Feb 13 2018 6:18 PM

కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి అన్ని విధాల అండగా ఉంటున్న ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ మరోసారి నోరు జారడంపై వివాదం రగులుతోంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు అనాలోచితంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత సర్దుకోలేక సతమతమవడం మోహన్‌ భాగవత్‌కు మొదటి నుంచి అలవాటే. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా మోహన్‌ భాగవత్‌ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడారు. బీసీలు ఎక్కువగా ఉన్న బీహార్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల బీసీలు దూరమయ్యారని, పర్వవసానంగా ఎన్నికల్లో గెలవాల్సింది, ఓడిపోయామని బీజేపీ వర్గాలు ఇప్పటికీ వాదిస్తాయి. 

Advertisement
Advertisement