జిల్లాలోని హసన్పర్తిలో దారుణం జరిగింది. గుర్తుతెలియని దుండగులు మంగళవారం దంపతుల గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో మృతిచెందిన భార్యాభర్తలను దామోదర్, పద్మగా గుర్తించారు. దోపీడి దొంగలే ఈ దురాగతానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దోపిడీయత్నాన్ని దంపతులు అడ్డుకోవడంతో వారిని దారుణంగా హతమార్చారని భావిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తును ప్రారంభించారు. క్లూస్ టీమ్లు, డాగ్ స్క్వాడ్స్ను రంగంలోకి దింపి ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు.
హసన్పర్తిలో జంట హత్యలు
Jun 19 2018 11:10 AM | Updated on Mar 21 2024 11:24 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement