నాలుగేళ్ల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని దోచుకుని కొడుకు లోకేశ్కు, బినామిలకు పంచిపెట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత సి. రామచంద్రయ్య ఆరోపించారు. శనివారం జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తప్పు చేయనప్పుడు ఐటీ దాడులకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.