Chiranjeevi: పరిపాలన వికేంద్రీకరణకు నా సంపూర్ణ మద్దతు | Chiranjeevi Supports YS Jagan AP 3 Capitals New Idea - Sakshi Telugu
Sakshi News home page

పరిపాలన వికేంద్రీకరణకు చిరంజీవి సంపూర్ణ మద్దతు

Dec 21 2019 4:24 PM | Updated on Mar 22 2024 10:49 AM

ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన వికేంద్రీకరణకు మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్‌ చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అధికార, పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తారన్న నమ్మకం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతి శాసన నిర్వాహక, విశాఖ కార్యనిర్వాహక, కర్నూలు న్యాయపరిపాలన రాజధానులుగా మార్చే ఆలోచనను అందరు స్వాగతించాలని చిరంజీవి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ లేఖను విడుదల చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement