చెరువులోకి దూసుకెళ్లిన కారు, ముగ్గురు మృతి | Car Falls Into Lake Yadadri District | Sakshi
Sakshi News home page

చెరువులోకి దూసుకెళ్లిన కారు, ముగ్గురు మృతి

Feb 22 2020 1:25 PM | Updated on Mar 21 2024 8:24 PM

సాక్షి, నల్లగొండ: యాదాద్రి జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. రామన్నపేట మండలం వెల్లంకి చెరువులోకి ప్రమాదవశాత్తు ఓ కారు అదుపు తప్పి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో సర్నెనిగూడెం సర్పంచ్‌ భర్త మధు(37), కొడుకు మణికంఠ(9), వార్డు మెంబర్‌ శ్రీధర్ రెడ్డి(25) మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. సర్నేని గూడెం గ్రామ సర్పంచ్‌ స్వప్న భర్త, తొమ్మిదేళ్ల కుమారుడితో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా, కారు ఒక్కసారిగా అదుపు తప్పి చెరువులో బోల్తా కొట్టింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement