ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం మంత్రివర్గ ఉపసంఘంతో సమావేశం అయ్యారు. గత ప్రభుత్వ పాలసీలను సమీక్షించేందుకు ఈ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. 30 అంశాల్లో అవినీతిని వెలికితీసే బాధ్యతను ఈ సబ్ కమిటీకి అప్పగించారు. తొలిసారి ఈ మంత్రివర్గ ఉపసంఘంతో వైఎస్ జగన్ భేటీ జరుగుతోంది. ఏఏ అంశాలపై దృష్టి పెట్టాలో సబ్కమిటీకి సూచనలు ఇవ్వనున్నారని సమాచారం.