వేధింపులకు బీహెచ్ఈఎల్ ఉద్యోగిని బలి
ఉన్నతాధికారి వేధింపులు తాళలేక బీహెచ్ఈఎల్ ఉద్యోగిని ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. లైంగిక వేధింపులకు పాల్పడి తనను చిత్రవధ చేస్తున్నారని సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ రఘురాం కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భోపాల్కు చెందిన రాజుకుమారి, తులసీరాం దంపతుల కుమార్తె నేహా చౌక్సే (33) బీహెచ్ఈఎల్లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో జైపూర్కు చెందిన సునీల్ కండిల్వాల్తో ఆమెకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా భోపాల్లోని బీహెచ్ఈఎల్ కంపెనీలో అకౌంట్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న నేహా.. తన భర్త 2018 సెప్టెంబర్లో హైదరాబాద్కు రావడంతో ఆమె కూడా ఆర్సీపురంలోని బీహెచ్ఈఎల్కు బదిలీ చేయించుకుంది. ప్రస్తుతం వీరిద్దరు మియాపూర్, ప్రజయ్సిటీలోని భానుటౌన్షిప్లో నివాసముంటున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు